రాష్ట్ర విభజన జరిగితే కిరణ్ పరిస్థితి ఏమిటి

Publish Date:Jul 23, 2013

Advertisement

 

కోర్ కమిటీలో సమైక్యాంధ్ర కోసం వాదించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధిష్టానం రాష్ట్ర విభజనకు మొగ్గు చూపితే రాజీనామా చేస్తారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, తను అటువంటి పనిచేయబోనని ఆయన స్వయంగా చెప్పారు. అంటే, అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకొంటానని అంగీకరించినట్లే భావించవచ్చును.

 

తెలంగాణా అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంటే, మరో వైపు సీమంధ్ర నేతలు సమైక్యాంధ్ర సభలు, సమావేశాలు అంటూ చాలా హడావుడి చేస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్, శైలజానాథ్, గంట శ్రీనివాస రావు, టీజీ వెంకటేష్ తదితరులు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న నేతలుగా ఇప్పటికే ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. కానీ వారెవరూ కూడా అధిష్టానాన్ని దిక్కరించే పరిస్థితి లేదు. వారు ఎన్ని సభలు నిర్వహించుకొన్నపటికీ అంతిమంగా అందరూ కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడేవారే. మరయితే, ఈ సమైక్యాంధ్ర సభలు, హడావుడి ఆందోళనలు ఎందుకు అని ప్రశ్నిస్తే, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న నేతలుగా ప్రజలలో గుర్తింపు తెచ్చుకోవడానికి మాత్రమేనని చెప్పక తప్పదు.

 

రేపు అధిష్టానం రాష్ట్ర విభజన చేసినప్పుడు, వారందరూ మళ్ళీ మరోమారు బహిరంగ సభలు పెట్టి ప్రజలకి తాము ఏఏ కారణాలచేత, విధిలేని పరిస్థితుల్లో అయిష్టంగా అందుకు అంగీకరించవలసివచ్చిందో సంజాయిషీలు ఇచ్చుకోవడం ప్రజలు చూడవచ్చును. కానీ, ఆ తరువాత, ఇంత కాలంగా తాము చేస్తున్న సమైక్యాంధ్ర కోసం చేస్తున్న పోరాటాలవల్ల ఏర్పడిన ప్రత్యేక గుర్తింపుని (యన్కాష్) సద్వినియోగించుకొంటూ వారందరూ కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవి, హోం, ఆర్ధిక, రెవెన్యు వంటి కీలక పదవుల కోసం పోటీలు పడవచ్చును.

 

మరటువంటి భుజకీర్తులు తగిలించుకొన్నవారితో కిరణ్ కుమార్ రెడ్డి పోటీపడి, మళ్ళీ తన ముఖ్యమంత్రి పదవి నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డికి కేవలం కోర్ కమిటీలో తను చేసిన వాదనల గురించి మాత్రమే చెప్పుకోవడానికి ఉంటుంది. అయితే, ఆ ప్రాధమిక అర్హత రేసులో పాల్గొనడానికి సరిపోదు గనుక ఆయన ముందున్న రెండే రెండు ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవలసి ఉంటుంది.

 

మొదటి ఆప్షన్: అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి, అధిష్టానానికి విధేయుడిగా ఉంటూ మళ్ళీ ముఖ్యమంత్రి దక్కించుకోవడం. రెండవ ఆప్షన్: (అధిష్టానానికి తన పరిస్థితి అంతా సవినయంగా విన్నవించుకొని, సోనియమ్మఅనుమతితోనే) రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ రాజీనామా చేసేసి తను కూడా ఒక వీరత్రాడు వేసేసుకొని, రేసులో పాల్గొంటూ ఆనక అధిష్టానం దయతోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవడం. ఈ రెండు మార్గాలలో దేనిని ఎంచుకొంటారనేది వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకటించిన తరువాత తేలిపోతుంది.

 

అయితే ఆయన వినయ విదేయతలకు, సమర్ధతకు మెచ్చిఅధిష్టానం కేంద్రానికి ప్రమోట్ చేసినా చేయవచ్చును. అదేజరిగితే, కిరణ్ పని తంతే బూర్లె గంపలో పడినట్లే మరి!

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.