మూత్ర పిండాలలో రాళ్ళు ప్రమాదమా?

Publish Date:Aug 7, 2021

Advertisement

మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడడం ఈ మధ్యకాలంలో చాలా తరచుగా వింటున్నాం.
సగటున జనాభాలో 1౦,౦౦౦ మంది లో 7నుండి 21 మంది కి మూత్ర పిండాలలో 
రాళ్ళు ఏర్పడు తున్నట్లు గా తెలుస్తుంది.మూత్ర పిండాలలో రాళ్ళూ ఏర్పడడం స్త్రీలకంటే పురుషులకు 8౦ %కేసులు పురుషులకే సంబందించినవే అయి ఉంటాయి అని నిపుణులు అంచనా.

మూత్ర పిండాలలో రాళ్ళు  అంటే ఏమిటి?

వైద్య పరంగా మూత్ర పిండాలలో ఏర్పడే రాళ్ళను కాల్సులి అంటారు.సాధారణంగా రాళ్ళు మూత్ర పిండాల లోపల ఏర్పడుతూ ఉంటాయి.కాని బ్లాడర్ లోను యురేటర్ మూత్ర నాళం లోను కూడా రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. రక్తంలో కాల్షియం పాస్పరస్,యూరిక్ యాసిడ్ లవణాలు సాల్ట్స్ అధికం కావడం మూలంగా రాళ్ళు ఏర్పడుతాయి.అధికంగా ఉండే లవణాలు స్పటిక రూపాన్ని దాల్చి కిడ్నీ లోపలి పొరలి పొరల మీద నిల్వ ఉంటాయి. లేక పోతే మూత్ర వ్యవస్థ యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురికావడం మూలంగా కూడా మూత్రపిండాలలో రాళ్ళు ఎపడుతాయి. కిడ్నీలో గాని బ్లాడర్ లో గాని ఇసుక రేణువు సైజు నుంచి బత్తాయి పండు సైజు దాకా ఉండే రాళ్ళు ఆయా  భాగాలలో కదల కుండా ఉన్నంతవరకూ మనకేమీ బాధను కలిగించవు అసలు ఏమి లేదన్నట్ట్లుగానే కనిపిస్తాయి. కాని సజులో ఎంత చిన్న రాయి అయినా సరే కిడ్నీ నుంచి బ్లాడర్  లోకి జారుతున్నప్పుడు యురేటర్ లోపలి సున్నితమైన పోరా దెబ్బతినడం మొదలు పెట్ట గానే మనకు భరించలేని బాధ కలుగుతుంది.

మూత్ర పిండాలలో రాళ్ళు ఉంటె లక్షణాలు ఎలా ఉంటాయి...

వీపు కింది భాగాన్ చెప్పరానంత తీవ్రంగా నొప్పి మొదలై ముందు వేపు పొత్తికడుపు దాకా వ్యాపిస్తుంది.అకాది నుంచి వృషణాల నుంచిపురుషాంగం లేదా స్త్రీల కైతే జననేన్ద్రియం వరకూ వ్యాపిస్తుంది. కిడ్నీ రాయి కిడ్నీ మూత్ర పిండం నుంచి మూత్ర్రాశయం దాకా ఉన్న మూత్రనాళము ఉన్న ట్యూబ్ లో కదుల్తున్న కొద్దీ నొప్పి అలలు అలలు గా కదులుతూ బాధ పెడుతుంది. ఈ నొప్పి తీవ్రత కొంత సేపటి తరువాత పతాక స్థాయికి చేరుకొని ఒక నిమిషం పాటు అలా ఉండి తరువాత తగ్గి పోతుంది.అంతలోనే కొద్ది నిమిషాలాలో మళ్ళీ మొదలు అవుతుంది. అప్పుడప్పుడూ తెమలడం, వణుకుతూ కూడుకున్న జ్వరం వాంతులు కూడా ఉండవచ్చు. మూత్రం పోస్తునప్పుడు నొప్పి ఉంటుంది. ఒక్కో సారి మూత్రంలో నెత్తురు వీపుకింది భాగాన్ని కానిపోత్తికడుపుని కానీ అంటుకుంటే చాలు నొప్పి మొదలు అవుతుంది.

రాళ్ళు ఏర్పడడానికి ఎంతకాలం పడుతుంది...

పెద్ద రాళ్ళూ ఏర్పడడానికి సంవత్సరాలు ఏర్పడవచ్చు.కొన్ని చిన్న రాళ్లు మాత్రం ఒకటి లేదా రెండు 
నెలల్లో ఏర్పడుతాయి.

కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలు...

సహజంగా చెప్పాలంటే మూత్రంలో రసాయనాలు బాగా చిక్కబడి స్పటిక రూపానికి మారడం వల్ల రాళ్ళు ఏర్పడుతాయి. ఇలా చిక్కబాడడానికి కారణాలు ఏమిటి అని చూస్తే 

---రాళ్ళు ఏర్పడే శరీరతత్వం కలిగి ఉండడం.

--రోజూ తీసుకునే ఆహారం లో కాల్షియం,ఇతర ఖనిజ లవణాలు కొన్ని అధికం గా ఉండడం వల్ల ఒక్కో ప్రాంతం లో ఆయానేలలలో నీటిలో లవణాలు అధికంగా ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ అధికం కావడం వల్ల కొన్ని రకాల మందులు విటమిన్ సి లేదా విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల లేదా ప్రతి రోజూ సరిపడా నీరు తాగక పోవడం వల్ల మూత్రనాళం ఇన్ఫెక్షన్ కి గురికావడం వల్ల. అతిగా చెమట పడుతూ శరీరంలోని నీటిని అధికంగా విసర్జిమ్పచేసే ఉష్ణ మండల ప్రదేశాలాలో నివసించే వారికి.
అనారోగ్యం కారణాల వాళ్ళ దీర్ఘ కాలం పాటు మంచం మీదనుండి దిగాలేనివారికి పనీ పాటా లేకుండా శారీరక కష్టం లేకుండా కాలం గడిపే వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కిడ్నిలో రాళ్ళు ఉంటె అనార్ధాలు...

కిడ్నీలో అంటే మూత్రపిండాలలో చీముచేరి దెబ్బతింటుంది.

కిడ్నీ రాళ్ళకు చికిత్స్ద్స ...

కిడ్నీ లో రాయి చిన్నదిగా 5 మీ మీ ఉంటె ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే మూత్రం గుండా వెళ్లి పోతుంది. కిడ్నీ లో రాయి సైజు 5 నుంచి1౦ మీ మీ దాకా ఉంటె ఉంటె పెద్దగా అవుతున్నకొద్దీ డానికి అది బయటికి పోదు. 1౦ మీ మీ సైజు లో ఉంటె రాయిని సర్జరీ ద్వారా లేదా లితో ట్రీప్సీ ద్వారా రాయిని తొలగించాల్సి ఉంటుంది.

లితో ట్రీ ప్సీ...

లితో ట్రీ ప్సీ ద్వారా చే సే చికిత్సలో ఎక్ష్ రే ద్వారా రాయి ఎక్కడుందో పసిగట్టి సరిగ్గా ఆభాగాన హై ఎనర్జీ షాక్ వేవ్ ని ఫోలాస్ చేయడం ద్వారా మూడు గంటలు సాగే ప్రక్రియలో రాయి చిన్న చిన్న ముక్కలు కింద పడిపోయి మూడు నాలుగు నెలల లోపల మూత్రం ద్వారా ఒక్కొకటిగా బయటికి వెళ్ళిపోతాయి.

సర్జరీ చికిత్స...

సర్జరీ లో డాక్టర్ కిడ్నీ ని తెరచి లోపలి రాళ్ళను బయటికి తీసేస్తారు. సర్జరీలో ఉండే అసౌకర్యం ఏమిటి అంటే కిడ్నీ ని కోసి తెరిచి నప్పు  డల్లా కిడ్నీ తన సామర్ధ్యం లో మాటి  మాటికీ కిడ్నీ సామార్ధ్యం 2౦% కోల్పోతుందని అంటున్నారు. కిడ్నీ రాళ్ళను తొలగించడానికి యురేటేరోస్కొపి ,పెర్కుతనెఔస్ ఇవి కాక కొన్ని ఆధునిక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.

కిడ్నీలో రాళ్ళూ పడకుండా జాగ్రత్తలు...

మంచి నీలాను ధారాళంగా తాగాలి.దీనివల్ల మూత్రం పల్చ బడవచ్చు.ఎక్కువ నీరు తాగడం వల్ల సాల్ట్స్,ఖనిజ లవణాలు కాన్సన్ ట్రేట్ కాకుండా ఉండి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి.రోజూ షుమారు న రెండు మూడు లీటర్ల నీరు తాగడం మంచిది వేసవి కాలంలో ఇంకా ఎక్కువానీరు తాగాలి. కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో 92%కాల్షియం మూలంగానే ఏర్పడటాయి.కాల్షియం ఉత్పత్తుల మూలంగా ఏర్పడతాయి.కిడ్నీలో రాలు ఏర్పడే అవకాసం ఉన్నదని భా వించిన వాళ్ళు కాల్షియం ఉత్జ్పట్టులను పూర్తిగా మానేయకూడదు.తగిన మోతాదులో మితంగా మాత్రమే తీసుకోవాలి. ఈ విషయంలో డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది.కాల్షియం అదనంగా ఉండే పదార్ధాలు పాలు వెన్న,పాల ఉత్పత్తులు.

By
en-us Political News

  
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.