మోదీ సర్కార్ పై ఖర్గే ఫైర్.. 11 ఏళ్లు 33 తప్పులు !

Publish Date:Jun 12, 2025

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే 3.0 ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకుంది.అలాగే..  వరసగా మూడు పర్యాయాలు, అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీఎ ప్రభుత్వం మొత్తంగా 11 ఏళ్ళు పూర్తి చేసుకుని , 12 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ 11 సంవత్సరాల పాలన ఎలా ఉందంటే చెప్పడం కష్టమే. అంతా బాగుందని అనలేము, అసలేమీ బాగులేదని చెప్పలేము. అయితే..  వరసగా మూడవ సారి దేశ ప్రజలు మోదీని మెచ్చి ఓటేసి గెలిపించారు, సో ..మోదీ తొలి పదేళ్ళ పాలన ప్రజలకు నచ్చింది. అందుకే, ముచ్చటగా మూడవసారి మోదీకి పట్టం కట్టారు,అనుకోవచ్చును. ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ప్రామాణికం కాబట్టి, మోదీ తొలి పదేళ్ళ పాలనకు పాస్  మార్కుల కంటే, కొంచెం మెరుగైన మార్కులే ప్రజలు ఇచ్చారు. 

నిజానికి..  వరసగా మూడవ సారి అధికారంలోకి రావడం ఒక చారిత్రక విజయమే అయినా..  2014, 2019 ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే.. మోదీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. బీజేపీ, ఎన్డీయే స్కోర్ దిగి వచ్చింది. 2014లో 284 స్కోర్’తో.. 30 ఏళ్లలో ఎప్పుడూ లేని ఒంటరిగానే మెజారిటీ సాధించిన  బీజేపీ 2019లో మరో మెట్టు పైకి ఎక్కింది బీజేపే ఒంటరిగా 303 సీట్లు గెలిచి చరిత్రను సృష్టించింది. అయినా.. సంకీర్ణ ప్రభుత్వాలనే కొనసాగించింది  అనుకోండి అది వేరే విషయం. అలాంటి బీజేపీ స్కోర్  2024లో 240 కి పడిపోయింది. అంటే 63 సీట్లు కోల్పోయింది. అయినా..  ఎన్డీఎ మిత్ర పక్షాల అండతో ఏర్పాటైన  సంకీర్ణ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకుంది.

సహజంగానే..  అధికార బీజేపీ,ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నాయకులు, మోదీని  మెచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ 11 సంవత్సరాల పాలన సువర్ణాక్షరాలతో లిఖించదగిందని అభివర్ణించారు. అలాగే..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు,ఎన్డీయే ముఖ్యమంత్రులు మోదీ 11 ఏళ్ల పాలనను ఆహా ..ఓహో అంటూ మెచ్చుకునన్నారు. అదేమంత విశేషం కాదు. మోదీ పాలన ఎన్డీయేకి  ముద్దు.  

అలాగే..  విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి, మోదీ పాలన అస్సలు నచ్చలేదు. అది కూడా సహజమే. అందుకే కాంగ్రెస్ సర్వాధికారి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనను సింపుల్ గా ఛీ  కొట్టారు. మోదీ ప్రభుత్వాన్ని కలల ప్రభుత్వంగా అభివర్ణించారు. వర్తమానాన్ని వదిలేసి..  2047 గురించి కలలు పంచి, దేశాన్ని మోసం చేస్తోందని విమర్శించారు. 

మరోవంక..  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  మరో అడుగు ముందుకేసి  మోదీని మోసాల పుట్టగా అభివర్ణించారు. మోదీ 11 ఏళ్ల పాలనలో  దేశానికి జరిగిన మేలు శూన్యమని తేల్చేశారు. 11 ఏళ్లలో 33 తప్పిదాలు చేశారని  మోదీ తప్పుల చిట్టాను వినిపించారు.  గతంలో పార్లమెంటులో కూడా తాను ఇదే మాట చెప్పిన సంగతిని గుర్తు చేశారు.  ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం, యువకులను మోసం చేయడం, పేదలను కడగండ్లపాలు చేస్తున్న ఇలాంటి ప్రధానిని  తమ రాజకీయ జీవితంలోనే చూడలేదని, ఖర్గే పేర్కొన్నారు.

ఇక అక్కడి నుంచి  ఖర్గే  ఆయనే చెప్పినట్లుగా, పార్లమెంట్ లోపలా బయటా చాలా కాలంగా చెపుతూ వచ్చిన  సంగతులనే మరోమారు వల్లె వేశారు. డిప్యూటీ స్పీకర్ సహా  విపక్షాలకు మోదీ ఏ చిన్న పోస్ట్ ఇవ్వడం లేదు అని మొదలు పెట్టి  ఈడీ దాడుల వరకు.. మోదీ ప్రభుత్వం  మొత్తం 33 తప్పులు చేసిందని ఎత్తిచూపారు. 

అయితే..  మోదీ 11 ఏళ్ల పాలనను అధికార విపక్షాలు, ఎలా చూసినా, ఏమనుకున్నా  తాజాగా, నిర్వహించిన మూడ్ అఫ్ డి నేషన్ సర్వే లు మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ  ఎన్డీయేదే అధికారమని చెపుతున్నాయి. అంతే కాదు  2024 కంటే, ఈసారి.. బీజేపీ సొంత సంఖ్యా బలంతో పాటుగా ఎన్డీయే సంఖ్యా బలం కూడా పెరుగుతుందని చెపుతున్నాయి.  ఇండియా టుడే 2025 ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో  బీజేపీ 281 సీట్లతో సింపుల్ మెజారిటీ మార్క్  (273) క్రాస్ చేస్తుందనీ, అలాగే..  ఎన్డీఎ 343 సీట్లు గెల్చుకుంటుందని దీంతో  కాంగ్రెస్,ఇండియా కూటమి బలం తగ్గుతుందని సంకేతాలు ఇస్తోంది.  కాంగ్రెస్ బలం  99 నుంచి  78కి, ఇండియా కూటమి నెంబర్ 232 నుంచి 184కు పడిపోతుందని సర్వే చెపుతోంది. అలాగే..  తాజగా ఆపరేషన్ సిందూర్ తర్వాత నిర్వహించిన మరో సర్వేకూడా బీజేపీ, ఎన్డీయే కే జై కొడుతున్నది.. సో  11 ఏళ్ల మోదీ పాలనకు  ఇప్పటి వరకు అయితే  ప్రజామోదం పుష్కలంగానే ఉన్నట్లుంది. సందేహం లేదు. అయితే.. ఎన్నికలకు ఇంకా నిండా నాలుగు సంవత్సరాల సమయం వుంది. ఈలోగా ఏమైనా జరవచ్చును.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.