Publish Date:Apr 15, 2026
హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారిన మైక్రో ఫైనాన్స్ వివాదం కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పేరు చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో కీలక వ్యక్తి అప్రూవర్గా మారి సంచలన వ్యాఖ్యలు చేయడంతో కేసు కీలక మలుపు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం న్యాయవాది సుబ్బారావు, మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించడం తెలిసిందే. దీనికి ప్రతిగా మంగ్లీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న మధు అప్రూవర్గా మారి వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. మంగ్లీకి ఈ వ్యవహా రంతో ఎలాంటి సంబంధం లేదని మధు స్పష్టంగా పేర్కొన్నాడు. అసలు మోసం చేసిన వ్యక్తి హిమాకాంత్ రెడ్డి అని మధు ఆరోపించారు. కంపెనీలో పెట్టిన దాదాపు రూ.20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపించాడు.
హిమా కాంత్ రెడ్డి, సుబ్బారావు స్నేహితులని చెప్పిన మధు.. సుబ్బారావును తనకు హిమాకాంత్ రెడ్డే పరిచయం చేశాడని వెల్లడించారు. హిమాకాంత్ రెడ్డి నుండి డబ్బులు తిరిగి ఇప్పిస్తానని సుబ్బారావు చెప్పాడనీ, అందుకు ప్రతిగా సినీ సెలబ్రిటీల ఫోన్ నంబర్లు కావాలని అడిగాడని అప్రూవర్ గా మారిన మధు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక అసలైన బాధితులు కాకుండా వేరే వ్యక్తులు ముందుకు వస్తు న్నారని మధు వ్యాఖ్యా నించడం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చింది. మధు అప్రూవర్గా మారడంతో కేసు పూర్తిగా కొత్త కోణంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఇప్పటి వరకు ఆరోపణల మధ్య చిక్కుకున్న మంగ్లీకి ఇది కొంత ఊరట కలిగించే పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/key-twist-in-microfinance-case-36-217415.html
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.