2026 టీ20 ఫైన‌ల్స్.. గెలుపు వీరులు వీరే!

Publish Date:Mar 8, 2026

Advertisement

టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా వన్డే మ్యాచ్ లో కూడా భారీ స్కోరే అనదగ్గ స్కోరును 20 ఓవర్లలో చేసింది. అవును నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా ఏకంగా 256 పరుగులు చేసింది. ఇందుకు ప్రధాన కారణం టాప్ ఆర్డర్డ్ బ్యాటర్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు చేయడం.ఈ ముగ్గురిలో కూడా ఓపెనర్ సంజూ శాంస‌న్ కీల‌క పాత్ర పోషించాడు.  46 బంతుల్లో టీ ట్వంటీ  ఫైన‌ల్స్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు సాధించిన బ్యాట‌ర్ గా రికార్డు బ్రేక్ చేశాడు, దానికి తోడు క్వార్ట‌ర్ ఫైన‌ల్స్, సెమీ ఫైన‌ల్స్, ఫైన‌ల్స్ లో వ‌రుస హాఫ్ సెంచురీలు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్న‌మెంట్ గా నిలిచాడు శాంస‌న్.

 ఆ తరువాత బుమ్రా.. బుమ్రా ఈ ఫైనల్ లో 4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 15 ప‌రుగులు  ఇచ్చి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఫైన‌ల్స్ లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఈ టోర్నీలో బుమ్రా మొత్తం 14 వికెట్లు తీసి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తితో క‌ల‌సి హ‌య్య‌స్ట్ వికెట్ టేక‌ర్ గా నిలిచాడు. అలాగే అభిషేక్ శర్మ,  ఇషాన్.. ఈ ఇరువురూ కూడా  ఈ విక్టరీలో కీలక పాత్ర పోషించిన వారే. అభిషేక్  కేవ‌లం 18 బంతుల్లోనే యాభై ప‌రుగులు చేసి.. టోర్నీలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ పూర్తి చేయడమే కాకుండా కీలక ఫైనల్ లో . భార‌త్ కు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించాడు. అలాగే ఇషాన్ కిష‌న్ పాతిక బంతుల్లో 54 ప‌రుగులు చేసి మిడిల్ ఓవ‌ర్ల‌లో ప‌రుగుల వేగం త‌గ్గ‌కుండా  చూశాడు. 

ఒక వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఒకే మ్యాచ్ లో టాప్ త్రీ బ్యాట్స్ మ‌న్ అర్ధ శ‌త‌కాలు చేయ‌డం కూడా ఇదే తొలిసారి. ఇక శివందూబె గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి చివరి ఓవర్లలో సిక్సర్లతో చెలరేగిపోయి టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ఒక అద్భుత ముగింపు ఇచ్చారు. కేవ‌లం 8 బంతుల్లో 26 ప‌రుగులు సాధించి.. భార‌త్ స్కోర్   250 దాటించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు అలాగే అక్షర్ పటేల్..  త‌న హోం గ్రౌండ్ అయిన అహ్మ‌దాబాద్ లో   అద్భుతంగా  రాణించాడు. మ‌రీ ముఖ్యంగా ఓపెన‌ర్ ఫిన్ అలెన్ ను త‌న తొలి ఓవ‌ర్లోనే ఫెవిలియ‌న్ బాట ప‌ట్టించ‌డంతో ఒక రకంగా మ్యాచ్ ను మలుపు తిప్పాడని చెప్పవచ్చు.    ఇక ఫీల్డింగ్ లో ఇషాన్ కిషన్ రెండు అద్భుత క్యాచ్ లు పట్టాడు.  లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు  గౌతం గంభీర్  హెడ్ కోచ్ గా   భార‌త్ రెండో ఐసీసీ  ట్రోఫీని అందించాడు. ఈ వరల్డ్ కప్ విక్టరీలో గంభీర్   పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు. .

By
en-us Political News

  
యూఏఈలోని ప్రవాస భారతీయులకు అలర్ట్! జూలై 1, 2026 నుండి భారతీయ పాస్‌పోర్ట్, వీసా, OCI సేవల్లో కీలక మార్పులు రానున్నాయి. BLS ఇంటర్నేషనల్ స్థానంలో అల్హింద్ సంస్థ సేవలు ప్రారంభించనుంది. పూర్తి టైమ్‌లైన్ మరియు గడువు తేదీల వివరాలు ఇక్కడ చూడండి.
వైట్ హౌస్ నివేదికల ప్రకారం.. ఇరాన్ వద్ద ఉన్న అణు ఇంధనాన్ని పూర్తిగా నాశనం చేసి, అక్కడి నుండి తరలించాల్సి ఉంటుంది. అలాగే వారి అణు కార్యక్రమాలను నిలిపివేయాలి. ఇరాన్ ఈ నిబంధనలన్నింటినీ నెరవేర్చే వరకు అమెరికా ఆంక్షలను ఎత్తివేయదు సరే కదా.. వారి నిధులను కూడా విడుదల చేయదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ మొదటి విడత చెల్లించడానికి జూన్ 15 ఆఖరి తేదీ. ఈ గడువు లోపు పన్ను చెల్లించకపోతే పడే జరిమానా వివరాలు, యూపీఐ మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా పన్ను చెల్లించే పూర్తి విధానం మీ కోసం.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో డ్యానీ వ్యాట్ అద్భుత శతకంతో ఇంగ్లండ్ బోణి కొట్టింది. శ్రీలంకపై 87 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లండ్ జట్టు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా ప్రపంచకప్ 2026 హోరాహోరీగా ప్రారంభమైంది. గ్రూప్-బి తొలి మ్యాచ్‌లో బోస్నియా చేతిలో ఓడిపోయే స్థితి నుండి కెనడాను సూపర్ సబ్ సైల్ లారిన్ లేట్ గోల్‌తో ఎలా రక్షించాడో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తడి ఆత్మహత్య కార్పొరేట్ ప్రపంచంలో దాగున్న మానసిక వేధింపుల చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టింది. జూన్ 9న అమిత్ 19 ఏళ్ల కుమారుడు అనీష్ బ్రహ్మే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతోనే ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో అమిత్ రాసిన సూసైడ్ నోట్ లభించింది.
ఈ కుంభకోణానికి రాజ్ కేశిరెడ్డే ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లుఈడీకి ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సేకరించింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా ఉన్న కాలంలో ఆయన తనకున్న రాజకీయ, పరిపాలనా పలుకుబడిని ఉపయోగింది, ఏపీఎస్‌బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవ రెడ్డి, ఆయన అనుచరుడు తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో చేతులు కలిపి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం రవాణా టెండర్లు కేవలం తమ అనుకూల సంస్థలకే దక్కేలా నిబంధనలను మార్చేసినట్లు ఈడీ గుర్తించింది.
వలం వాణిజ్య అవసరాల కోసం సముద్రంలో ప్రయాణించే నౌకలపై ఇలాంటి దాడులు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ హెచ్చరించారు. అంతర్జాతీయ జలాల్లో జరిగే ఇలాంటి దాడులు సముద్ర వాణిజ్య భద్రత, ప్రాంతీయ స్థిరత్వాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని జైశంర్ ఆందోళన వ్యక్తం చేశారు.
జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ శుక్రవారం వెలువరించిన ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే న్యాయస్థానాల పరిధిని దాటి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమనే బలమైన సంకేతాన్ని ఈ తీర్పు ద్వారా హైకోర్టు పంపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ గోల్కొండలో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.
పవిత్ర మొహర్రం మాసంలో అషూరా సందర్భంగా షియా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే చారిత్రాత్మక బీబీ-కా-ఆలం మాతం ఊరేగింపు
తెలంగాణ ఈగల్ ఫోర్స్, హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.