కేశినేని అన్నదమ్ముల సవాల్

Publish Date:Jun 6, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడ నగరం అనేక కీలకమైన రాజకీయ మలుపులకు కేంద్ర మయింది. ఆంధ్రుల సాస్కృతిక కేంద్రంగా కూడా గణతికెక్కిన బెజబాడ గ్రూపు తగాదాలకూ కేంద్ర బిందువు. తాజాగా రచ్చకెక్కిన కేశినేని బ్రదర్స్ వ్యవహారంతో  ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది. కేశినేని బ్రదర్స్ అనగా కేశినేని శ్రినివాస్ అలియాస్ నాని, కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని అనే ఇద్దరు అన్నదమ్ముల కథ విజయవాడ వీధుల్లో ప్రస్తుతం హాట్ టాపిక్. 

మొదట్లో రామలక్ష్మణుల్లా మెలిగిన వీరిద్దరూ వాలి సుగ్రీవులుగా మారడానికి కారణాలు తెలియాలంటే ఓ పాతికేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ నగరానికి ఆంధ్రప్రాంత ప్రజల రాకపోకలు పెరిగిపోయాయి.  దీంతో ట్రావెల్స్ వ్యాపారం ఊపందుకుంది. సరిగ్గా  ఆ సమయంలోనే యువకులైన మన రామలక్ష్మణులు రంగంలోకి దిగారు.  దక్షిణ భారత దేశంలోనే ఆటోమొబైల్ పరిశ్రమకు మూలమైన బెజవాడ నుండి తమ కార్యకలాపాలు ప్రారంభించారు. కేశినేని ట్రావెల్స్ పేరుతో ప్రారంభమైన వ్యాపారం మూడు బస్సులు, ఆరు ట్రిప్పులతో అభివృద్ధి చెందింది. పెద్ద వాడైన నానితో పొసగలేక తమ్ముడు చిన్ని వ్యాపారం నుండి వైదొలిగాడు. తన వాటాగా ఒ కోటి రూపాలయు తీసుకుని మోడల్ ట్రావెల్స్  అనే మరో కొత్త అనే మరో కొత్త సంస్థను ప్రారంభించాడు. హైదరాబాద్ తో పాటు ముంబై, చెన్నై వంటి నగరాలకు వ్యాపారాన్ని విస్తరించాడు.  ఆ రోజుల్లో ముంబై నుంచి కార్గొను హైదరాబాద్, విజయవాడ, చెన్నై, విశాఖ వంటి నగరాలకు చేర్చే వ్యాపారం జోరుగా సాగింది.

దీంతో అనతి కాలంలోనే చిన్ని నానిని మించిన వాడయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య స్పర్ధలు మొదలయ్యాయి.  దీంతో చిన్ని వ్యాపారాలను దెబ్బ తీసు వ్యూహాలకు నాని పదును పెట్టాడని బెజవాడలో చెప్పుకుంటారు. అప్పటి లోక్ సభ స్పీకర్ బాలయోగితో ఉన్న స్నేహంతో శివసేన నేతలతో కలిసి ముంబైలో చిన్ని వ్యాపారాలను దెబ్బ తీశాడని నానిపై ఆరోపణలు ఉన్నాయి. బాలయోగితో నాని సంబంధాలపై బెజవాడలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.  ముంబాయిలో దెబ్బ తిన్న చిన్ని తన ఫోకస్ ను హైదరాబాద్ పై పెట్టాడు. రియల్ రంగంతో పాటు సాఫ్ట్ వేర్ రంగంలో కూడా నిలదొక్కుకుని నాని తలెత్తి కూడా చూడలేని స్థాయికి ఎదిగాడు. దీంతో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు నాని రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. విజయవాడ లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

ఇక ప్రస్తుతానికి వస్తే.. వాలి సుగ్రీవులుగా మారిన నాని, చిన్నిలు పాత కక్షలను మరచిపోలేదు.  ఇప్పటికీ కత్తులు నూరుకుంటున్న కేశినేని బ్రదర్స్ కు ప్రస్తుత రాజకీయాలు కలసి వచ్చాయి. 2024లో విజయవాడ బరిలో నిలబడేందుకు ఇద్దరూ వ్యూహాలు పన్నుతున్నారు.

కేశినేని నాని తెలుగుదేశం పార్టీతో కొంత దూరాన్ని పాటిస్తుండగా, వైసీపీ పరిస్థితులను అంచనా వేసే పనిలో పడింది. ఆర్థిక వనరులకు లోటు లేని చిన్ని ఈ సారి అన్నపై పై చేయి సాధించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఇదే జరిగితే విజయవాడ రాజకీయాలలో ఒక కొత్త అంకానికి తెరలేస్తుంది. కనక దుర్గమ్మ సాక్షిగా, కృష్ణా తీరంలో జకగనున్న కేశినేని అన్నదమ్ముల సవాల్ బవిష్యత్ ఎన్నికలలో ముఖ్య భూమిక పోషించనుందని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. 

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.