కేజ్రీవాల్ ని రనవుట్ చేసే పనిలో సిద్దూ!

Publish Date:Sep 3, 2016

Advertisement


సవజ్యోత్ సింగ్ సిద్దూ... ఈ పేరు ఇండియన్ క్రికెట్లో ఎంత పాప్యులరో అంతే వివాదాస్పదం కూడా! అసలు ఆయన ఎలా ఆడేవాడో ఈ కాలం క్రికెట్ లవ్వర్స్ కి పెద్దగా తెలియదు! కాని, విచిత్రం ఏంటంటే, ఆయన క్రికెట్ ఎలా ఆడేవాడో తెలియకపోవటమే కాదు పాలిటిక్స్ ఎలా ఆడతాడో కూడా జనానికి అర్థం కావటం లేదు ప్రస్తుతం! ఎవరికి మేలు చేసి ఎవరికి కీడు చేస్తాడో, ఎవరి కొంప కొల్లేరవుతుందో అస్సలు తెలియటం లేదు...

 

సిద్దూ అద్భుతమైన బ్యాట్సమన్ అయినా పెద్దగా పాలిటిక్స్ తెలిసిన వ్యక్తి కాదు. అందుకే, చాలా రోజులు ఇండియా కోసం ఆడినా క్యాప్టెన్ అవ్వలేకపోయాడు. రిటైర్మెంట్ అయ్యాక బీజేపిలో చేరి ఒకింత సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఆ పార్టీ సిద్దూకి తగినంత గుర్తింపు ఇచ్చింది. ఎంపీగా పోటీ చేయించింది. రాజ్యసభ  సీటు కూడా ఇచ్చింది. అయినా ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా రాజకీయం నిజంగా ఒంటబట్టని సిద్దూ ఎందుకోగాని ఈ సారి మొత్తం అతలాకుతలం చేసుకున్నాడు!

 

పార్టీ మీద అలిగో, లేదంటే ఇతర పార్టీల్లోంచి వస్తున్న టెంప్టింగ్ ఆఫర్ల వల్లో నవజ్యోత్ సింగ్ సిద్దూ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఎవ్వరూ చేయని సాహసం చేసి బంగారం లాంటి రాజ్యసభ సీటు వదులుకున్నాడు. రాజీనామా చేసి కొన్ని రోజులుగా ఖాళీగా కూర్చున్నాడు! అందరూ అనుకున్నట్టు ఆప్ లో చేరిపోలేదు...

 

సిద్దూ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా చక్రం తిప్పేందుకే బీజేపి ఇచ్చిన రాజ్యసభ సీటు వద్దనుకున్నాడని అంతా భావించారు. ఆయన వెళ్లి కేజ్రీవాల్ ని కలిసి ఆ అంచనాల్ని నిజం కూడా చేశాడు. కాని, ఏమైందో ఏమోగాని ఆప్ క్రీజులోకి సిద్దూ వెళ్లలేదు. పెవెలియన్ లోనే వుండిపోయి ... హఠాత్తుగా స్వంత పార్టీ ప్రకటన చేశాడు!

 

పంజాబ్ లోని మరికొంత మంది చిన్నా, చితకా నేతలతో కలిసి ఆయన ఆవాజ్ ఏ పంజాబ్ అనే ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు తాజాగా ప్రకటించాడు! ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. పైగా ఈ ఫ్రంట్ పెట్టటం ద్వారా ఇటు ఆకాళీదల్, బీజేపి కూటమిని, అటు కాంగ్రెస్ ను, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీని సిద్దు ఎదుర్కొని ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది! అంత పోటీలో ఈ ఆవాజ్ ఏ పంజాబ్ ఊడబొడిచేదేం లేదంటున్నారు క్రిటిక్స్! అయినా సిద్దూ ఇలాంటి సాహసం చేయటానికి కారణం ఏంటి?

 

కొందరి టాక్ ప్రకారం... నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపిలో అసంతృప్తిగా వుండటం చూసి కేజ్రీవాల్ వల వేశాడట! ఆయన తన పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని అనటంతో సిద్దూ బీజేపి టీమ్ లోంచి ఆప్ టీమ్ లోకి జంప్ అవుదామనుకున్నాడు. కాని, తీరా రాజ్యసభ సీటు కూడా వదిలేసి వచ్చాక అరవింద్ కేజ్రీవాల్ తన కేడీ వేషాలు మొదలు పెట్టాడట! సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చేంత లేదని స్పష్టమైపోయింది. దాంతో సిద్దూకి తిక్కరేగిపోయింది...

 

అటు బీజేపికి, ఇటు ఆప్ కి కాక సతమతం అవుతోన్న సిద్దూపై కాంగ్రెస్ కూడా ఓ కర్చీఫ్ వేసింది. కాని, పంజాబ్ లో ప్రస్తుతం ప్రతి పక్షం అయిన కాంగ్రెస్ కి గెలిచేటంత సీన్ లేదని డౌట్స్ వున్నాయి. కాబట్టి కాంగ్రెస్ లో కాలేయకుండా ఆప్ దిమ్మతిరిగిపోయేలా సిద్దూ స్వంత ఫ్రంట్ ఆలోచన చేశాడంటున్నారు!

 

ఆవాజ్ ఏ పంజాబ్ ని కూడా షార్ట్ గా పిలిస్తే ఆప్ అనే అనాల్సి వస్తుంది. పైగా పంజాబ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపి, అకాళీదల్ కూటమికి డ్యామేజ్ చేయాలని చూస్తోంది ఆప్. ఇలాంటి సమయంలో సిద్దూ తన దుకాణం ఒకటి కొత్తగా తెరవటంతో ప్రతి పక్షాలన్నిటి మధ్యా ఓట్లు చీలి అధికార కూటమికి లాభం చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి! చూడాలి మరి.... పంజాబ్ ఎన్నికల మ్యాచ్ లో సిద్దూ బ్యాటింగ్ ఎలా వుంటుందో! రన్స్ కొట్టి బీజేపిని గెలిపిస్తాడో...బాల్స్ వేస్ట్ చేసి ఆప్ నో, కాంగ్రెస్ నో గెలిపిస్తాడో! ఏది ఏమైనా సిద్దు కలలు కన్నట్టు పంజాబ్ సీఎం ఆయనే అయ్యే అవకాశాలు మాత్రం పెద్దగా లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు!

By
en-us Political News

  
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.