Publish Date:Apr 14, 2026
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మపై తనకు ఇసుమంతైనా నమ్మకం లేదని, ఆమె నేతృత్వంలోని బెంచ్ ముందు తనకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు సదరు న్యాయమూర్తి ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని (రెక్యుసల్) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై కేజ్రీవాల్ స్వయంగా కోర్టులో తన వాదనలు వినిపించారు.
గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సుదీర్ఘంగా మూడు నెలల పాటు పరిశీలించి, అది తప్పుడు కేసు అని తేల్చిచెప్పిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించగానే కేవలం తొలి రోజే ఆ తీర్పును పక్కనపెట్టేలా జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యవహరించారని ఆరోపించారు. కేవలం మూడు విచారణలతోనే నిందితులందరినీ అవినీతిపరులుగా ముద్ర వేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.
న్యాయమూర్తి గతంలో ఏబీవీపీ వంటి సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలకు హాజరైన విషయాన్ని కేజ్రీవాల్ తన వాదనల్లో ప్రధానంగా ప్రస్తావించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంబంధం ఉన్న వారికి తమ వంటి ప్రత్యర్థుల కేసుల్లో నిష్పాక్షికంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉండదన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై ఉన్న కేసులను మాత్రమే అత్యంత వేగంగా విచారిస్తూ, దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించడం పక్షపాత వైఖరిని సూచిస్తోందన్నారు.
మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను సీబీఐ తరఫు న్యాయవాది తుషార్ మెహతా తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయ కారణాలను సాకుగా చూపి న్యాయమూర్తులను తప్పుకోవాలని కోరడం సరికాదన్నారు. ఇటువంటి ధోరణి న్యాయవ్యవస్థకు గొడ్డలిపెట్టన్నారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చని జడ్జిలపై ఇలాంటి ఆరోపణలు చేస్తే విచారణలు సాధ్యం కావని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ పరిణామం ఢిల్లీ రాజకీయాల్లోనే కాకుండా న్యాయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. న్యాయమూర్తి స్వయంగా ఈ విచారణ నుంచి తప్పుకుంటారా లేక కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చుతారా అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ విచారణాధికారి మారితే కేసు మలుపు తిరిగే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ పిటిషన్పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైనే కేజ్రీవాల్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kejriwal-makes-sensational-remarks-against-judge-36-217301.html
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బరితెగించారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన రాజకీయ హింస రోజురోజుకూ ముదురుతోంది.
హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు.
వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఐఎస్ అనుబంధ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వం లో నిందితులు సమన్వయంగా పనిచేశారు. హ్యాండ్లర్ల చేత రాడికలైజ్ చేయబడిన యువతను జిహాద్కు మద్దతుగా నియమించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం, నిషేధిత ఆయుధాలు సేకరించడం, బయోటెర్రరిజం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించడం వీరి లక్ష్యం. రిసిన్ అనే అత్యంత ప్రమాదకర జీవ విషాన్ని ఉపయోగించి ఐఎస్ దుష్ట లక్ష్యాన్ని అమలు చేయాలని ప్లాన్ చేశారు. రిసిన్ ఆముదం విత్తనాల్లో సహజంగా లభించే శక్తివంతమైన విషపదార్థం.
గత నెల 14న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్ఎంటీ రోడ్డుపై రాకేష్ శర్మ, హరీష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆరుగురు దుండగులు వారిపై దాడి చేసి 7.5 గ్రాముల బంగారు గొలుసు తో పాటు ఒకరి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
రాజస్థాన్ లోని పర్యాటక నగరంఉదయ్ పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్బీ చౌదరి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్ కుప్పకూలింది. అయితే, మధ్య ఓవర్లలో సమీర్ రిజ్వీ 40 నాటౌట్, స్టబ్స్ 38 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.