Publish Date:Sep 12, 2025
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్కు గురైన తర్వాత కల్వకుంట్ల కుటుంబానికి కవిత పూర్తిగా దూరమైనట్లేనంటూ వార్తలు వచ్చాయి. అంతకు ముందు కూడా కవిత తండ్రిని కలవడానికి ప్రయత్నించినా కేసీఆర్ ఆమెను దూరంగానే ఉంచారు. ఈ నేపథ్యంలో గురువారం(సెప్టెంబర్ 11) కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయిన తరువాత తొలి సారిగా ఆమె తల్లి, కేసీఆర్సతీమణిక ల్వకుంట్ల శోభ కవిత నివాసానికి వెళ్లారు. శోభ తన కుమార్తె కవిత నివాసానికి వెళ్లడం ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చనీయాంశమైంది. కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ పుట్టిన రోజు గురువారం (సెప్టెంబర్ 11). ఆ సందర్భాన్నిపురస్కరించుకుని శోభ కవిత నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కవితతో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్నీ సర్దుకుంటాయని ఆమె కవితకు చెప్పినట్లు సమాచారం.
అదలా ఉంచితే.. అంతేనా? అంతకు మించి ఏమైనా ఉందా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. కవిత సస్పెన్షన్ తరువాత ఇప్పటి వరకూ కవిత ముఖం కూడా చూడని శోభ ఇప్పుడు పని కట్టుకుని అల్లుడి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఎందుకు వెళ్లారన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ నెల 2న బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండయ్యారు. ఆ తరువాత మూడు రోజులకు అంటే సెప్టెబర్ 5న కవిత కుమారుడి పుట్టిన రోజు. ఆ సందర్భంగా కవిత తన తల్లిని ఆహ్వానించినా ఆమె మనవడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్ల లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా అల్లుడి పుట్టిన రోజు సందర్భంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేసీఆర్ సూచన మేరకే శోభ కవిత ఇంటికి వెళ్లి ఆమెను సముదాయించి వచ్చారని అంటున్నారు. కుటుంబంలో సయోధ్య కోసం కేసీఆర్ కుమార్తె వద్దకు శోభను పంపారన్న చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతలు, బంధువులు కూడా అయిన హరీశ్రావు, సంతోశ్ కుమార్లపై కవిత తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడం, వారి వల్లే కేసీఆర్కు చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించడం పార్టీలో పెను దుమారం రేపడమే కాకుండా కవిత సస్పెన్షన్ కు కూడా ఆ ఆరోపణలే కారణమయ్యాయి. కవితపై క్రమశిక్షణ చర్య కింద సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ.. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఇప్పటి వరకూ కవిత ఆరోపణలను ఖండించలేదు. హరీష్ రావుకు మద్దతుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మొత్తంగా కవిత ఆరోపణలపై వ్యూహాత్మక మౌనం పాటించారు. ఈ నేపథ్యంలోనే తల్లీ కుతుళ్ల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-wife-to-kavitha-house-39-206049.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.