Publish Date:Oct 21, 2025
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన రాజకీయ అజ్ణాతాన్ని వీడి క్రియాశీల రాజకీయాలలోకి తిరిగి ప్రవేశిస్తున్నారా? బీఆర్ఎస్ కు చావో రేవోగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ప్రచార సారథ్యం వహించనున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాలు ఔననే అంటున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణంలో జూబ్లీ బై పోల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బైపోల్ కు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సతీమణి సునీతను రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక వచ్చే నెల 11న జరగనుంది.
ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికలో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నా.. మిగిలిన పార్టీల కంటే ఈ ఉప ఎన్నిక విజయం బీఆర్ఎస్ కు అత్యంత కీలకం. ఈ ఉప ఎన్నికలో విజయంపైనే ఆ పార్టీ ఉనికి, ఊపు ఆధారపడి ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారిన ఈ ఉప ఎన్నికలో పార్టీని గలిపించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా తానే ప్రచార సారథ్యం వహించాలన్న తలపుతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసినా ఇప్పటి వరకూ కేసీఆర్ ప్రచారానికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ.. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ పార్టీ ప్రధాన ప్రచార కర్తగా, ప్రచార సారథిగా ఉంటారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
ఆ మేరకు పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా కేసీఆర్ పేరును కూడా బీఆర్ఎస్ చేర్చంది. ఇప్పటికే కేటీఆర్, కేసీఆర్ లు తమ ప్రచారం ప్రారంభించేశారు. ఇక రానున్న రోజుల్లో కేసీఆర్ కూడా జూబ్లీ బైపోల్ ప్రచారంలో చురుకుగా పాల్గొంటారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-to-lead-brs-campaign-in-jublee-bypoll-25-208280.html
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.