కేటీఆర్ కోరికలకు కేసీఆర్ కళ్ళెం ?

Publish Date:Jul 19, 2022

Advertisement

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్  అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం తద్యమనే వార్తలొచ్చాయి. ముహూర్తాలు ఖరారయ్యాయి. బహిరంగ వేదికల నుంచి మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, అయన సమక్షంలోనే  కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. అయితే, అక్కడక్కడా వినిపిస్తున్నట్లుగా  కుటుంబ కలహాలు కారణమా,ఇంకేదైనా కారణమా, ఏమో కానీ, విఘ్నేశ్వరుని పెళ్లి ముహూర్తం లాగా, కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి,  రామన్న పట్టాభిషేక ముహుర్తం ఇంతవరకు ముడిపడలేదు.  

అదలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం, ఇక ఈసారికి కేటీఆర్ కి ముఖ్యమంత్రి యోగం లేనట్లేనని అంటున్నారు. అదే విషయాన్ని వాళ్ళు వీళ్ళూ కాకుండా మంత్రి కేటీఆరే స్వయంగా వెల్లడించారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆరే అని స్వయంగా ప్రకటించారు.ఇటీవల మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్  వచ్చే ఎన్నికల్లోనూ తెరాస 90 ప్లస్ సీట్లు తెచ్చుకుని. అధికారంలోకి వస్తుందని చెప్పు కొచ్చారు. అది ఎంత నిజమో  ఏమో కానీ కేటీఆర్ అక్కడితో ఆగకుండా, దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డ్ సృష్టిస్తారని ఇంకో మాట జోడించారు. సరే మళ్ళీ తెరాస అధికారంలోకి వస్తుందా, రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, వస్తే మాత్రం మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, కేటీఆర్  స్పష్టంగానే చెప్పారు. ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నిజానికి కేటీఆర్ ఒక్కరే కాదు, గతంలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని పబ్లిక్ గా చెప్పిన నాయకులతో సహా తెరాస నాయకులు గత కొంత కాలంగా ఇదే విషయం చెపుతూ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు  కొత్త సచివాలయంలోకి ముఖ్యమంత్రిగా ఆయనే కాలు పెడతారని తెరాస నేతలు టీవీ చర్చలలో ఇతరత్రా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కేటీఆర్ స్వయంగా అదే విషయాన్ని శంఖంలో పోశారు.  సో .. అప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పటికైతే కేటీఆర్ ముఖ్యమంత్రి ‘కుర్చీ’ కోరికకు కళ్ళెం వేసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.పార్టీలోనూ అదే చర్చ జరుగుతోందని అంటున్నారు. 

అయితే ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది? కొద్ది రోజుల క్రితం వరకూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళతారని ఫ్రంట్ కాదంటే జాతీయ పార్టీ పెట్టేసి, ఢిల్లీ వెళ్లి పోతారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ కి అప్పగిస్తారని, అదనీ, ఇదనీ చాలా చర్చ జరిగింది. చాలా చాలా  ఉహాగానాలు వినిపించాయి. ఉహాగానాలు కూడా కాదు స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు జాతీయ ఆలోచనలను బహిరింగంగానే వినిపించారు.  మరోవంక  ఎక్కడా పెద్దగా ఖండనలు రాలేదు. తెరాస నాయకులు  ఎవరూ ఉహాగానాలను  కాదనలేదు. ఖండించలేదు. మరోవంక, అవును అది నిజమే అనే సంకేతాలు ఇస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ కూడా దూకుడు పెంచారు. వేషం కాకపోయినా భాష మార్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు స్వయంగా అయనే తీసుకున్నారని, తీసుకుంటున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి.  

కానీ, ఇప్పుడు కేటీఆర్ ఎందుకు  ‘యు’ టర్న్ తీసుకున్నారు? అంటే  అందుకు సర్వేలే కారణమని అంటున్నారు. ముఖ్యంగా  ప్రశాంత్  కిశోర్ బృందం పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం ఏమిటి? అనే విషయంగా నిర్వహించిన ‘ప్రత్యేక’ సర్వేలలో, తెరాసను వ్యతిరేకిస్తున్న వారిలో అత్యధిక శాతం ప్రజలు, కుటుంబ పాలనకు వారసత్వ రాజకీయాలకు పెద్ద పీట వేశారు.  పీకే సర్వేతో పాటుగా ఇతర  సర్వేలలోనూ, తెరాసను వ్యతిరే కిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది, ప్రదానంగా కుటుంబ వారసత్వ రాజకీయాలను. కుటుంబ అవినీతిని  వ్యతిరేకిస్తున్నట్లు తేలిందని అంటున్నారు. అలాగే, కేంద్ర సంస్థలు నిర్వహించిన సర్వేలలోనూ కుటుంబ పాలన, కుటుంబ అవినీతిని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున విషయం తేట తెల్లమైందని  తెలుస్తోంది.

ఈ నేపధ్యంలోనే ప్రధాన మంత్రి నరెంద్ర మోడీ కూడా, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలపై దృష్టి పెట్టాలని, రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు, రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా వినవస్తోంది.  ఈ నేపధ్యంలోనే, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, కుటుంబ అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు,ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే కేటీఆర్ ముఖ్యమత్రి  రేసు నుంచి తప్పుకున్నారని అంటున్నారు. అంతే కాకుండా, మహారాష్ట్ర పరిణామాల అనంతరం, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే మాట బహిరంగంగా వినిపిస్తున్న నేపధ్యంలో  ఇప్పడు నాయకత్వ మార్పు జరిగితే,  బీజేపీ సహకారంతో  తెరాసలో షిండేలు పుట్టుకు రావచ్చనే అనుమానాల చేతనూ  ప్రస్తుతానికి, యథాతథ స్థితి కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ మేరకు  కేసీఆర్, కేటీఆర్ ఒక అంగీకారానికి వచ్చారని అంటున్నారు.

అదొకటి అలా ఉంటే, నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలంగా కుటుంబంలో ఎంతగా వత్తిడి వచ్చినా, కేటీఆర్ కి పగ్గాలు అప్పగించక పోవడానికి కూడా ఇదే కారణంగా అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కోరుకున్నదే ప్రశాంత్  కిశోర్  సర్వేలు చెప్పాయి. మరో వంక, మహారాష్ట్ర పరిణామాలు కూడా కలిసొచ్చాయి. అలా కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపి, కేటీఆర్ నోటి నుంచే ‘హ్యాట్రిక్’ పలుకులు పలికించారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. అవును  కేసీఆర్  రాజకీయ చతురత గురించి, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన  అవసరం లేదు. కానీ, చెప్పుకోక తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఅర్  చాలా కాలంగా కుటుంబంలో చాలా చాలా సమస్యలు ఎదుర్కున్నా, చివరాఖరుకు కుటుంబ రాజకీయాల్లోనూ పై చేయి సాధించారని, కేటీఆర్  కోరికలకు కళ్ళెం వేయడంలోనూ అయన సక్సెస్ అయ్యారని అంటున్నారు.

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-20
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించి, ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి కలిగిస్తున్నది కడప లోక్ సభ నియోజకవర్గం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె ఎంట్రీతో కడప లోక్ సభ నియోజకవర్గ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు అధికారికంగా జూన్ 4న వెలువడతాయి. ఆ లోగా ఏ పార్టీని విజయం వరిస్తుందన్న అంచనాలతో జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంతే అంత కంటే ముందు రాష్ట్రంలో విజయం తెలుగుదేశం కూటమిదా? వైసీపీదా అన్న విషయాన్ని సాధికారికంగా ఎవరూ చెప్పే అవకాశం లేదు.
భార‌త‌ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జ‌వాన్ అయిన‌ ప్రకాశ్ కాప్డే (39).. సచిన్ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఆయన ఇటీవలే విధులకు సెలవు పెట్టి స్వ‌గ్రామానికి వెళ్లాడు. ప్ర‌స్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నాడు. 
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హింస చెలరేగింది. పోలింగ్ పూర్తి కాకముందే పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మాచర్ల,తాడిపత్రి,చంద్రగిరి,నరసరావుపేటలో చోటు చేసుకున్న ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీలో వైసీపీకి ఓటర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫలితాలు వెలువడకుండానే ఓటమి ఖాయమైందని వైసీపీ నేతలు తలలు పట్టుకునేలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తి ఒటేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక, కక్షపూరిత పాలనను కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు పోలింగ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీశారు.
ఓటమి భయంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నాని పులివర్తి నాని అన్నారు.  టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న, పెద్ద, ముసలి, ముతకను పట్టుకుని చితక బాదారని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పులివర్తి నాని చెప్పారు.
రాష్ట్రమంతటా ఒకెత్తు.. పాలకొల్లు ఒక్కటీ ఒకెత్తు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి నిమ్మల రామబానాయుడి విజయంపై విపక్ష వైసీపీ అభ్యర్థికి కూడా ఎలాంటి అనుమానం లేదు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తాజాగా జ‌రిగిన అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్ వివ‌రాల‌ను సీఈవో ముఖేష్ కుమార్ బుధ‌వారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో పంచుకున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ న‌మోదైంద‌ని తెలిపారు. పోలింగ్ శాతంతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకున్న ప‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, భ‌ద్ర‌తా ప‌రంగా తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి వివ‌రించారు. హింస చోటుచేసుకున్న చోట వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు.
పవన్ విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని పెద్దాయన మాటిచ్చారు. ఆ మాటపై ఆయన నిలబడతారనే నమ్మకం తమకుంది. కాపులంతా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, దీన్ని విజయవంతం చేయాలని, కాకపోతే మీ ఉప్మా, కాఫీలు మీరే తెచ్చుకోవాలంటూ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తి అయిన మరునాటి నుంచి వైసీపీ నేతల స్వరం మారిపోయింది. పరోక్షంగా ఓటమిని ఒప్పకుంటూ, వారికి మాత్రమే సాధ్యమైన విధంగా తమ ఓటమికి కారణం తెలుగుదేశం కారణమని చెప్పుకుంటున్నారు.
తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఏడు కొండల్లోని అడవుల్లో ఉండే చిరుతలు కొంత కాలంగా నడక మార్గం వద్దకు వచ్చేస్తున్నాయి. గత ఏడాది భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు భక్తులను భయభ్రాంతులకు గురి చేశాయి. తాజాగా మరోసారి చిరుత కలకలం చెలరేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిరుతను వెంటనే పట్టుకోవాలని అధికారులను భక్తులు కోరుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.