Publish Date:May 20, 2023
ఖమ్మం జర్నలిస్తులకు 23 ఎకరాల భూమిని బిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ చేసిన వినతికి ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రభుత్వం హడావిడిగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. పువ్వాడ అజయ్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన 70 ఎకరాల భూములకు ఇంత వరకు మోక్షం రాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో నిజాంపేటలో 32 ఎకరాలు, పేట బషీరాబాద్ లో 38 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యవసాయ భూములు అయిన నిజాంపేటలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరకు 1100మంది జర్నలిస్ట్ లు చెల్లించారు. అదే పేట్ బషీర్ బాద్ స్థలాలను చదరపు అడుగుల లెక్కన ప్రభుత్వానికి ఈ జర్నలిస్ట్ లు చెల్లించారు. కోర్టులో 15 ఏళ్ల పాటు కేసులు నడిచాయి. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ఇట్టి భూములను జవహార్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ తీర్పు చెప్పారు. 9 నెలల క్రితం ఈ తీర్పు వెలువడినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఏడేళ్ల క్రితం మధ్యంతర ఉత్తర్వుల్లో ఈ భూములను జవహార్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని తీర్పు చెప్పింది. అయితే ఇట్టి భూములను డెవలప్ చేసుకోవచ్చని, ఇళ్ల నిర్మాణాలను మాత్రమే చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి కెసీఆర్ మధ్యంతర ఉత్తర్వులపై స్పందిస్తూ హైదరాబాద్ లో భూములు కరువయ్యాయా బొచ్చెడు భూములు సుప్రీం తుది తీర్పు వచ్చాక హైదరాబాద్ జర్నలిస్ట్ లను చూసి ఈర్శ్య పడేలా పెద్ద జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. యూ ట్యూబ్ చానళ్లలో కెసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ దొరుకుతాయి. ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు ఇంతవరకు దిక్కు, దివాణం లేదు.
కాగా టియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద గురువారం చేపట్టిన మహాధర్నాలో వైఎస్ రాజశేఖరెడ్డి తనయ వైఎస్ షర్మిల పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వానికి కమిషన్లు అందకపోవడం వల్లే 70 ఎకరాలను జర్నలిస్ట్ లకు ఇవ్వడం లేదని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం కేటాయించిన ఈ భూములను కమిషన్ల కోసం బిఆర్ ఎస్ ప్రభుత్వం విక్రయించాలని చూస్తోందన్నారు. కొనుగోలు చేసిన జర్నలిస్ట్ లకు దక్కేలా తమ పార్టీ పోరాడుతుందని షర్మిల హామీ ఇచ్చారు. ఎన్నికలకు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో జర్నలిస్ట్ లు పోరాటస్పూర్తితో ఉద్యమిస్తే ఈ 70 ఎకరాలను సాధించుకోవడం పెద్ద కష్టమేమి కాదని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రశ్నించడం తమ హక్కు అని జర్నలిస్ట్ లు మరచిపోవడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తోంది. కోర్టు దిక్కారణ కేసు వేస్తే వీలయినంత త్వరగా భూములు వచ్చే అవకాశముందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు అన్నారు. సంప్రదింపులు, లాబీయింగ్ చేసి ఈ భూములను పొందడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మెజారిటీ జర్నలిస్ట్ లు కోర్టు దిక్కారణ కేసు బిఆర్ఎస్ ప్రభుత్వంపై వేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-once-again-cheated-journos-39-155639.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.