Publish Date:Jan 25, 2022
కేంద్ర ప్రభుత్వం మీద దండు కట్టి దండోరా మోగిద్దాం అంటున్న రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ కూడా చేరిపోయింది. మోదీ పాలన నియంతృత్వ పోకడలు పోతోందంటూ గత కొంతకాలంగా విమర్శిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈసారి డోసు పెంచి ఏకంగా మోడీ మీదికి లెటర్ బాంబ్ సంధించారు. 1950 ల నుంచి అమల్లో ఉన్న ఆలిండియా సర్వీస్ రూల్స్ ను ఇప్పుడు మార్చడం వెనుక నియంతృత్వ పోకడలే ఉన్నాయని కేసీఆర్ ఘాటుగా విమర్శిస్తున్నారు. గతంలో ఏ సర్కారు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, ఇది ఫెడరల్ స్ఫూర్తికే విఘాతమని ఆయన ఆక్రోశిస్తున్నారు.
ఆర్టికల్ 312 ప్రకారం 1951 ఆలిండియా సర్వీస్ రూల్స్ ను పార్లమెంటే ఆమోదించిన విషయం తనకు తెలుసని, కానీ 1954 లో వచ్చిన ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్ఎస్ అధికారుల రూల్స్ ను కేంద్ర సర్కారు మార్చేందుకు పూనుకోవడం మాత్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమంటూ మోడీని దెప్పి పొడుస్తున్నారు. ఆనాటి రూల్స్ ప్రకారం బ్యూరోక్రాట్స్ ను డిప్యూటేషన్ మీద బదిలీలు చేసే వెసులుబాటు పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనే ఉందని, దాని ద్వారా తమ విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, కానీ ఇప్పుడు సవరిస్తున్న సర్వీస్ రూల్స్ ప్రకారం రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే నేరుగా రంగంలోకిి దిగి బ్యూరోక్రాట్స్ బదిలీలు, డిప్యుటేషన్ ల మీద నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఉన్నతాధికారులు తమ విచక్షణ మేరకు పని చేసే ఆస్కారం ఉండదంటున్నారు. ఇది రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించడమేనని, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసి పరిపాలనాంశాల్లో డైరెక్టుగా కేంద్రమే జోక్యం చేసుకునే కుట్ర జరుగుతోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. కాబట్టి మోడీ సర్కారు ఇలాంటి చర్యలకు పూనుకోరాదని, అలాంటి ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే బీజేపీయేతర ప్రభుత్వాలు తప్పు పడుతున్నాయి. పశ్చిమబెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ క్రమంలో మోడీకి నేరుగా లేఖాస్త్రాల ద్వారా తమ అసమ్మతిని వ్యక్తం చేశాయి. ఇప్పుడా వరుసలో కేసీఆర్ కూడా చేరిపోయారు. మొత్తానికి బీజేపీయేతర రాష్ట్రాలు కూడబలుక్కొని ఈ లేఖాస్త్రాలు సంధిస్తున్నాయని, రానున్న రోజుల్లో వీరి ఆధ్వర్యంలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరిగే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-letter-to-pm-modi-39-130689.html
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.