Publish Date:Apr 17, 2024
పదేళ్ళపాటు ఇష్టారాజ్యంగా నడిపించిన అధికారం పోయింది. బాత్రూమ్లో జారిపడ్డట్టు ఆడిన నాటకం పుణ్యమా అని ఇప్పుడు ఫామ్హౌస్లో బోలెడంత రెస్టు దొరుకుతోంది. ఫామ్హౌస్లో సాధారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం వేళలోనే వుంటాయి. అధికారంలో వున్నా, లేకపోయినా పార్టీ నాయకులెవరైనా పిలిస్తే ఫామ్ హౌస్కి వెళ్ళాలి తప్ప వాళ్ళంతట వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. దాంతో పింక్ దొరకి పగలంతా ఖాళీనే. ఈ ఖాళీని సద్వినియోగం చేసుకుంటూ కేసీఆర్ జ్యోతిషం నేర్చుకున్నట్టు అనిపిస్తోంది. తన జ్యోతిష ప్రవేశాన్ని, పరిజ్ఞానాన్ని పదునుపెట్టుకునే ప్రాక్టీసులో భాగంగా కేసీఆర్ భవిష్యత్తును ఊహించి చెబుతున్నారు.
కేసీఆర్ ఊహిస్తున్న దాని ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరం కూడా వుండే పరిస్థితి కనిపించడం లేదట. ఆయనకి అలా ఎందుకు అనిపిస్తోందో మాత్రం ఈ సిద్ధాంతి చెప్పడం లేదు. అదేవిధంగా ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 2 పార్లమెంటు స్థానాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం కనిపించడం లేదట. దేశంలో జరుగుతున్న సర్వేలన్నీ ఈసారి టీఆర్ఎస్కి రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చేది కూడా డౌటేనని కోడై కూస్తుంటే, ఈ సిద్ధాంతి మాత్రం కాంగ్రెస్కి రెండు స్థానాలకు మించి రావని భవిష్యత్తు వాణి వినిపిస్తున్నారు.
మొన్నటి ఎన్నికలలో కేసీఆర్ని తిప్పతిప్పి కొట్టి అధికార పీఠం నుంచి కిందకి లాగిన రేవంత్ రెడ్డి ఒక లిల్లీపుట్ అంట. ఈయన మాత్రం పెద్ద ఆజానుబాహుడైనట్టు. ప్రజలు ప్రలోభాలకు లొంగిపోయి కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపించారట. ఇప్పుడు తప్పు తెలుసుకుని బాధపడుతున్నారట.
నిన్న హైదరాబాద్ శివార్లలోని సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే ‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అనే సామెత కనిపెట్టిన వాడికి పొర్లు దండాలు పెట్టాలన్నంత గౌరవం ఏర్పడుతుంది. ఎందుకంటే, ఆ సామెతకి నిలువెత్తు నిదర్శనంగా ఆ సభలో కేసీఆర్ మరోసారి కనిపించారు. కేసీఆర్ మాటల్లో అదే అహంకారం, అవే అబద్ధాలు, అవే తిట్లు, శాపనార్థాలు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదట.. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలట. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.. దుర్మార్గమైన పాలన చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రజలు భావిస్తే ఎన్నికల సందర్భంలో ఎలాగూ బుద్ధి చెబుతారు. అప్పటిదాకా అన్నీ మూసుకుని రెస్టు తీసుకోకుండా కేసీఆర్కి ఈ జ్యోతిషాలు, తిట్టు, శాపనార్థాలు ఎందుకంట?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-learns-astrology-39-173998.html
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్ల సౌండ్తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కొత్తూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని... ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీడీవో సాయిలహరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
కరోనా టీకా కోవీషీల్డ్ వ్యవహారం ఎలా వుందంటే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా వుంది.
మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శృంగార లీలలు, సెక్స్ స్కాండల్ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు నిన్న విచారించింది.
పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది.
బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులే అల్లరి మూకలకు అప్పగిస్తే ఫలితం ఎలా వుంటుందో మణిపూర్ మహిళల అత్యాచార సంఘటన అద్దం పడుతుంది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జి షీటులో సీబీఐ కొందరు పోలీసుల పేర్లను చేర్చింది. బాధిత మహిళలను పోలీసులే స్వయంగా నిందితుల ముందు వదిలిపెట్టారని సీబీఐ పేర్కొంది. గతేడాది మే 4న కుకీ, మెయితీల మధ్య జరిగిన గొడవల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్లోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.