Publish Date:May 15, 2023
భారత రాష్ట్ర సమితి నాయకత్వం ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టనుంది.కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో బిఆర్ఎస్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి? అక్కడ ఉన్న స్థానిక రాజకీయాలు , ప్రధాన ప్రత్యర్థి బిజెపిని ఓడించడం, స్థానిక రాజకీయాల్లో పావులు కదపాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావిస్తున్నారు. కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం తర్వాత బిజెపి పాలిత రాష్ట్రాలలో ఏ విధంగా వ్యూహం ఉండబోతుంది అనే అంశం ప్రస్తుతం కెసీఆర్ ముందు ఉన్న సవాల్. కర్ణాటక ఫార్ములాను ప్రయోగించాలని ఆయన మదిలో బలంగా ఉంది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రభావం చూపబోదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. కర్ణాటక ఫలితాలు వచ్చినప్పుడు రామారావ్ యుకెలో ఉన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహపడకూడదన్నది ఆయన ఉద్దేశం కావొచ్చు. మంత్రి కెటి రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించే ముందే గాంధీభవన్ లో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను అడ్డుకోవడానికే కెటిఆర్ ఆ విధంగా స్టేట్ మెంట్ ఇచ్చి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి, జూపల్లి చూపులు కాంగ్రెస్ వైపే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్ మూడోసారి అధికారంలో రావాలని చూస్తోంది. మహరాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగే అవకాశముందని బిఆర్ఎస్ కు ఉప్పందింది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టింది.
తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో బిఆర్ఎస్ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయ. మెదక్, రంగా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు కర్ణాటక బార్డర్ లో ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ఈ జిల్లాల్లో బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి కప్ప గంతులు వేసే ప్రమాదముందని అధి నాయకత్వం గుర్తించింది. ఈ జిల్లా వాసులకు కర్ణాటకతో కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వాళ్లు ప్రతీరోజు కర్ణాటక రాష్ట్రానికి వెళుతుంటారు. కన్నడ వచ్చిన వారు ఈ జిల్లాల్లో ఎక్కువగానే ఉన్నారు. ఈ జిల్లాల్లో ఉన్న వోటర్ల మీద ఎటువంటి ప్రభావం ఉండకూడదన్న తలంపుతో బిఆర్ఎస్ చర్యలు తీసుకుంటోంది.
జూన్ రెండో తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చిన బిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ ఉత్సవాలల్లో స్థానికులను భాగస్వామ్యం చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశం మేరకు ఆయా రాష్ట్రాలలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారు. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి కారణమైన డెవలప్ మెంట్, వెల్ఫేర్ స్కీంలను అన్ని చోట్ల ప్రచారం చేయాలని ఇప్పటికే కేసీఆర్ పార్టీ క్యాడర్ ను ఆదేశించారు.
సర్పంచ్ నుంచి మొదలు ఎంఎల్ ఏ, ఎంపీల వరకు తమ నియోజకవర్గాల్లో అమలవుతున్న ప్రభుత్వ స్కీములను ప్రచారం చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. ఎందుకంటే వచ్చే డిసెంబర్ లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. సమయం ఎక్కువ లేదు. ప్రచారమే మన ముందున్న లక్ష్యమని కేసీఆర్ క్యాడర్ కు ఇప్పటికే పిలుపునిచ్చారు. అన్ని సినిమా హాల్స్ లో స్లైడ్స్ వేయాలని, టీవీలు, పత్రికల్లో ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ కార్యకర్తలకు ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-focuss-on-national-politics-39-155350.html
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.