Publish Date:Aug 16, 2022
కేసీఆర్ చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు అని ఆయన ప్రత్యర్థులు, రాజకీయ వ్యతిరేకులు అంటుంటారు. అందుకు తగ్గట్టుగానే కేసీఆర్ వ్యూహాలు కూడా ఉంటాయి. ఆయన ఏదైతే చెబుతారో దానికి అమలు చేయరు.. అమలు చేయకపోవడమే కాదు.. తన వాగ్ధాటితో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించే వారి నోళ్లు మూయించడమే కాదు..సామాన్యులు ఆయనను అలా ఎలా ప్రశ్నిస్తారు అని ఆశ్చర్య పోయేలా చేస్తారు.
ప్రత్యేక తెలంగాణకు తొలి సీఎంగా దళితుడిని పీఠం ఎక్కిస్తానని ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానాన్ని, చెప్పిన మాటను కాదనీ, ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి అయ్యారు. అదేమని అడిగిన వారికి కొత్త రాష్ట్రం అనుభవజ్ణుడు అయిన ముఖ్యమంత్రి అవసరం కనుక తాను ఈ పీఠం అధిరోహించానని చెప్పారు. రాష్ట్రంలో భూమి లేని రైతులందరికీ మూడెకరాల భూమి అని వాగ్దానం చేసి ఆనక రాష్ట్రంలో పంచేందుకు అంత భూమి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇలా ఏ వాగ్దానం తీసుకున్నా కేసీఆర్ ది అదే తంతు. ఇప్పుడు తాజాగా ఆయన రాజ్ భవన్ తో ప్రగతి భవన్ కు ఉన్న అగాధాన్ని మరింత ప్రస్ఫుటంగా చాటేలా మరో సారి మాట తప్పారు. చెప్పేదొకటి.. చేసేదొకటి తన విధానమని చాటారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ఇచ్చిన ఎట్ హోం విందు కర్యక్రమానికి గైర్హాజర్ అయ్యారు. అయితే మామూలుగా అయితే అదో విషయమూ కాదు, విశేషమూ కాదు. కానీ కేసీఆర్ ఈ కార్యక్ర్మానికి హాజరౌతున్నారని రాజ్ భవన్ కు సమాచారం అందింది. స్వయంగా ఆయనే ఈ సమాచారాన్ని పంపారు. కానీ ఆయనీ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దాదాపు 20 నిముషాల సేపు ఆయన కోసం గవర్నర్, ఇతర ముఖ్యులు వేచి చూశారు. అప్పుడు తాపీగా కేసీఆర్ రావడం లేదనీ, ఆయన ఎట్ హోమ్ కు హాజరయ్యే కార్యక్రమం రద్దైందని సమాచారం వచ్చింది.
ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సందర్భాలలో రాజ్ భవన్లో ‘ఎట్ హోమ్’ పేరుతో గవర్నర్ ఇస్తూంటారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాజ్భవన్ నుంచి ఆహ్వానం వెళ్తుంది. అందరూ పాల్గొంటూ ఉంటారు. ఇదొర సాంప్రదాయంగా వస్తూనే ఉంది. గవర్నర్తో అభిప్రాయభేదాలు ఉన్నా.. ఇలాంటి సందర్భంలో వాటిని పట్టించుకోకుండా హాజరవ్వడం మర్యాద. అయితే కేసీఆర్ ఆ కనీస మర్యాదను కూడా పాటించలేదు. ఆయన గవర్నర్ ను తన చర్య ద్వారా అవమానించానని భావించి ఉండవచ్చు. కానీ వాస్తవానికి ఆయన అవమానించింది. సంప్రదాయాన్ని, వ్యవస్థను, రాజ్ భవన్ ను అని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-escapes-at-home-prigrammee-last-miniute-25-142008.html
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.