రాజకీయాలకు కేసీఆర్.. వీ(బీ)ఆర్ఎస్?

Publish Date:Mar 14, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్ర రాజకీయాల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారా? తీసుకునే ఆలోచన చేస్తున్నారా? లేదా ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాలు అవుననే అంటున్నాయి. అవును  టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్ర రాజకీయాలనే కాదు  పరిపాలన వ్యవహారాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని అటు పార్టీ ముఖ్యులు, ఇటు అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది. అందుకే, ముఖ్యమంత్రి వద్ద పెండింగ్ ఫైల్స్  కొండలా పెరిగిపోతున్నాయని  అధికారులు ప్రైవేటు సంభాషణల్లో చెపుతున్నారని అంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్  పార్టీ  ప్రభుత్వ బాధ్యతలు పూర్తిగా మంత్రి కేటీఆర్ కు అప్పగించి,  ఆయన తెర వెనక సలహాదారు పాత్రకు పరిమితం అయ్యారని  పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

నిజానికి  ముఖ్యమంత్రి కేసీఆర్  జాతీయ రాజకీయాలపై చర్చించే సమయంలో ఒకానొక సందర్భంలో సరదాగానే కావచ్చును రాష్ట్ర రాజకీయాలపై తనకు ఆసక్తి తగ్గిపోతోందని (బోర్ కొడుతోందని) మీడియా సమావేశంలో అన్నారు.  అలాగే 2018లో రెండవ సారి అధికారంలోకి వచ్చింది మొదలు  పార్టీ ప్రభుత్వ పగ్గాలు వారసుడు మంత్రి కేటీఆర్ కు అప్పగించే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అనేక సందర్భాలలో మంత్రులు  ఇతర ముఖ్య నేతలు కేటీఆర్ ను కాబోయే ముఖ్య్మంత్రిగా సంభోదించడమే కాకుండా  ముఖ్యమంత్రితో సమాన గౌరవాన్ని ఇవ్వడం కూడా మీడియా దృష్టికి వస్తూనే వుంది. మీడియా చూపుతూనే వుంది. అయితే  కారాణాలు ఏవైనా కేటీఆర్ పట్టాభిషేకం ముహూర్తం వాయిదాపడుతూ వచ్చింది. వస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయ ఎజెండా తెరపైకి తెచ్చి రాష్ట్ర రాజకీయ, ప్రభుత్వ బాధ్యతల కేతీఆర్ కు అప్పగించి, తాను మెల్లమెల్లగా తెర వెనక్కి తప్పుకుంటున్నారని అంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న రెండు కీలక పరిణామాలను అందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం లో చిక్కుకున్న కవితను ఈడీ విచారించిన సమయంలో  మాములుగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్  స్వయంగా ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పుతారని అందరూ అనుకున్నారు. కానీ  ముఖ్యమంత్రి ఆ బాధ్యతను కేటీఆర్ కు అప్పగించారు. కేటీఆర్ ను ఢిల్లీ పంపిచారు.  అఫ్కోర్స్  ఆయన వెంట మాజీ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావుతో పాటుగా మరి కొందరు మంత్రులను కూడా ఆయన వెంట పంపినా  మెయిన్ టాస్క్ మాత్రం కేటీఆర్ చేతుల మీదగానే కానిచ్చారు. అందుకే ఫైనల్ గా,  ఢిల్లీలో చక్రం తిప్పిన కేటీఆర్  అంటూ మీడియాలో ప్రచారం జరిగింది. 

అంతే కాకుండా, ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే బాధ్యతను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు అప్పగించారని అంటున్నారు. ఢిల్లీ ఎపిసోడ్ తర్వాత  కేటీఆర్ పార్టీ మీద దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు అయన స్వయంగా తీసుకుంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే కొద్ది నెలల్లో విస్తృతంగా కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఎన్నికల్ రోడ్ మ్యాప్  ను సిద్డంచేశారు. ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు కేటీఆర్‌ వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. అలాగే, వివిధ స్థాయిల్లో సమన్వయం పై దృష్టి సారించారు. పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు సమన్వయం కొనసాగేలా కార్యక్రమాలను రూపొందించారు.

అందులో భాగంగా తక్షణమే ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నారు. అందు కోసం ప్రత్యేకంగా జిల్లాల వారీగా కొత్తగా ఇన్‌చార్జీలను నియమించారు.  అలాగే జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు షెడ్యులు ఖరారు చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే కేసీఆర్  పార్టీ, ప్రభుత్వ పగ్గాలను  వారసుడు కీటీఆర్ కు అప్పగించి తాను రాష్ట్ర  రాజకీయాల నుంచి వీఆర్ఎస్ తీసుకునే దిశగా అడుగులు వేస్తున్న వైనం కనిపిస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.