Publish Date:Apr 24, 2022
కల్వకుంట్ల చంద్రశేఖరరావు...బీజేపై పోరాటంలో తానే చాంపియన్ అని రుజువు చేసుకుని బీజేపీ యేతర కూటమికి సారథ్యం వహించాలని కలలు కంటున్నారు. అయితే కాంగ్రెసేతర బీజేపీ యేతర కూటమి పట్ల ఇరత పార్టీలేవీ అంత సుముఖంగా లేకపోవడంతో ఆయన బాటలో ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నారు.
ఎవరూ కలిసి రావడం లేదన్న నిర్వేదంతో ఒకో సారి ఆయన ఫ్రంటూ లేదు గింటూ లేదంటూ నిర్వేదం ప్రదర్శించినా...ఏ మూలో ఆయనకు మోడీని దీటుగా ఎదుర్కొనే నేత తానేనన్న విశ్వసం ఇంకా తొలగిపోలేదు.
అయితే మోడీని బలంగా ఢీ కొనాలన్న ఆత్రంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు అంతిమంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికే దోహదపడుతుండటం గమనర్హం.
ఒక విధంగా చెప్పాలంటే...తెలంగాణలో సొంత బలం చాలా పరిమితంగా ఉండే బీజేపీ ఈ రోజున ఈ స్థితిలో ఉందంటే అది కచ్చితంగా కేసీఆర్ పుణ్యమే.
బండి సంజయ్ ఒక రోజు దీక్ష భగ్నం నుంచి తీసుకుంటే...ఆయన రాష్ట్రంలో కమలం పార్టీని నిలువరిస్తున్నానన్న పేరుతో చేసిన ప్రయత్నం, చేపట్టిన ప్రతీ చర్యా ఆ పార్టీకి బలం చేకూరడానికే దోహదపడింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రోజు దీక్ష భగ్నం కోసం పోలీసుల ప్రయోగం...ఆ పార్టీ పట్ల సానుభూతి పెరగడానికే దోహదపడింది. ఆయన అధికార కార్యాలయం గేట్లను గ్యాస్ కట్టర్ తో తొలగించి మరీ పోలీసులు లోనికి వెళ్లి అరెస్టు చేశారు. ఇది ఆశించిన దానికి ప్రతి కూల ఫలితమే ఇచ్చింది. అలాగే రైతులను పరామర్శించడానికి బండి సంజయ్ వెళ్లిన సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
ఒక వైపు రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ఏ నిరసన కార్యక్రమం సజావుగా సాగేందుకు వీలు లేకుండా అడ్డంకులు కల్పిస్తూ, అనుమతులు నిరాకరిస్తూ వస్తున్న ప్రభుత్వం..అదే అధికార పార్టీ కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా, ఇంకా చెప్పాలంటే యథేచ్ఛగా చేసుకోవడానికి దార్లు బార్లా తెరిచిన పరిస్థితి.
ఈ పరిస్థితే రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళనలు చేసుకునే హక్కు, నిరసనలు తెలిపే హక్కు విపక్షాలకు లేదా అన్న సందేహం జనంలో కలగేలా చేసింది.
అదే విధంగా ధాన్యం కొనుగోలు విషయాన్ని విపరీతమైన రాద్దాంతం చేసి రైతుల్లోనూ బిజెపికి విస్తృత ప్రచారం కలిగేందుకు కేసీఆర్ తీరు దోహదపడింది. అదే సమయంలో ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని బిజెపి సద్వినియోగం చేసుకుని.. తెలంగాణలో క్రమంగా బలపడుతోంది. కేసీఆర్ బిజెపి అణచివేసేందుకు అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారంటే కమలం పార్టీ ప్రజలలో ప్రచారం చేసుకుంటోంది. ఆ అవకాశాన్ని స్వయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత తమ చర్యలతో పువ్వుల్లో పెట్టి కమలానికి అందించారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీ పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించిన కేసీఆర్ ఒక్క సారిగా ఇంత వ్యతిరేకత ప్రదర్శించడం వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగి ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ప్రణాళికా బద్ధంగా బీజేపీ బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-deeds-to-control-bjp-became-plus-to-bjp-25-134872.html
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.
వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అడ్డు ఎవరు వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఆనవాయితీ. స్వంత బాబాయి వివేకానందరెడ్డి హత్య చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వంత బాబాయిని హత్య చేయించిన ఘనుడు జగన్ అని చెల్లెలు వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆమెను చిక్కులు తెచ్చి పెట్టింది.
ఉత్తరాంధ్రలో అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఈ ప్రాంతంలోని మూడు జిల్లాలలోనూ వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విశాఖలో అయితే ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గత ఎన్నికలలో వైసీపీ నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఆ జిల్లాలోని మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలలోనూ విజయకేతనం ఎగుర వేసింది. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి వైసీపీ పరిస్థితి జిల్లాలో పూర్తిగా దిగజారింది. పరిశీలకుల విశ్లేషణలైతే జిల్లాలో గత ఎన్నికలలో వచ్చిన ఫలితం ఈ సారి రివర్స్ అయినా ఆశ్చర్యం లేదన్నట్లుగా సాగుతున్నాయి.
తమకంటే వేరే ఎవరూ గొప్పగా, ఛరిష్మా కలిగిన వ్యక్తుల్లా వుండటం ఇష్టం వుండదు. అలా ఎవరికైనా తనకంటే ఎక్కువ ఛరిష్మా వుంటే, అలాంటి వాళ్ళని తన కాళ్ళ దగ్గరకి రప్పించుకుంటాడు.
సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజకవర్గాలలో ఈ విడతలో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాటు చేసింది.
జనసేనాని పవన్ కల్యాణ్ కు పిఠాపురంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని పరిశీలకులు నియోజకవర్గ పరిస్థితులను ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ దాడులకు పాల్పడుతూ తన పరపతిని మరింత దిగజార్చుకుంటోంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం (మే7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులను డైరెక్ట్ లైన్ ద్వారా అనుమతిస్తున్నారు.