జగన్మాయ కోసం కేసీఆర్ అర్రులు.. అవినీతి కేసుల బెడద నుంచి బైట పడేయమంటూ వేడుకోలు

Publish Date:May 21, 2022

Advertisement

జగన్ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేతకు ఆపద్భాంధవుడిగా మారిపోయారా? జగన్ సహాయం కోసం కేసీఆర్ అర్రులు చాస్తున్నారా? జగన్ దావోస్ పర్యటనలో ఆకస్మిక బ్రేక్ తీసుకుని లండన్ లో ల్యాండ్ అవడానికి కారణం కేసీఆర్ కు తన వంతు సహాయం చేయడానికేనా, అందులో భాగంగానే  కేసీఆర్  తనయుడు కేటీఆర్ తో భేటీ అయ్యారా?  అన్న ప్రశ్నలకు అత్యున్నత స్థాయి అధికారుల నుంచి అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఔననే చెప్పాల్సి వస్తోంది. ఇంతకీ అసలు కథేమిటంటే..

ఇటీవలి కాలంలో కేసీఆర్ అవినీతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో కేసీఆర్ అరెస్టు కావడం తథ్యం అంటూ ఆయన చెబుతున్నది వట్టి ‘సోది’ కాదని కేసీఆర్ అవినీతి, అక్రమ సంపాదనపై ఈడీ, సీబీఐలు నజర్ పెట్టాయనీ అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారాన్ని కేసీఆర్ కు లీక్ చేసింది కూడా కేంద్రంలోని అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులేననీ కూడా అంటున్నారు.  దీంతో ఈడీ సోదాల నుంచీ, సీబీఐ దర్యాప్తు నుంచీ తప్పించుకోవడానికి ఏం చేయాలన్న యోచనలో కేసీఆర్ కు జగన్ ఆపద్బాంధవుడిగా కనిపించారని అంటున్నారు.

ఎందుకంటే జగన్ కూడా అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులలో సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు.ఈడీ దర్యాప్తునూ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ సోదాల నుంచి, సీబీఐ దర్యాప్తు నుంచి బయటపడటమెలా అన్న విషయంలో జగన్ సహాయ సహకారాలను కేసీఆర్ కోరినట్లు సమాచారం. అందుకు అంగీకరించిన జగన్ గత ఎన్నికలలో తన విజయానికి అన్ని విధాలుగా సహాయపడిన తన రాజకీయ స్నేహితుడిని ఆదుకోవడానికి తన అధికారిక విదేశీ పర్యటనలో అనధికార మార్పులు చేసుకుని మరీ లండన్ లో ల్యాండ్ అయ్యారనీ, అక్కడ ఈ విషయాలపై కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో సమావేశమై, ఈడీ, సీబీఐ ల నజర్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై సూచనలూ సలహాలూ ఇచ్చారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే జగన్, కేసీఆర్ రహస్య బంధం ఇక్కడితో ఆగిపోదనీ, అవినీతి ఆరోపణల నుంచి బయటపడేందుకు కేంద్రం పెద్దలను ఆశ్రయించి ఊరట పొందేందుకు కూడా కేసీఆర్ జగన్ సహాయం కోరారనీ ఆ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఎంటర్ టైన్ చేసే పరిస్థితి లేకపోవడం, తన ఢిల్లీ టూర్ లోకేసీఆర్ కేంద్ర  హోంమంత్రి అప్పాయింట్ కోరినా ఆయన ఇవ్వకపోవడంతో కేసీఆర్ జగన్ ను  ఆశ్రయించడంతో ఆయన బీజేపీలోని తనకు అనుకూల వర్గాల ద్వారా కేసీఆర్ ను ఈ ఇబ్బంది నుంచి బయటపడేసేందుకు అంగీకరించి ఆ దిశగా కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

జగన్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా రాష్ట్రాన్ని దివాళా దిశగా తీసుకువెళ్లేలా ఆర్థక ఉగ్రవాదానికి పాల్పడుతున్నా, చిన్నపాటి మందలింపులతో సరిపెట్టేసి రాష్ట్రానికి రుణ సహకారం అందిస్తున్న కేంద్రం, తెలంగాణ విషయంలో మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ అప్పుల విషయంలో తిప్పలు పెడుతోంది. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ ఆర్థిక విధానాలు నిబంధనలను దాదాపు కచ్చితంగా పాటిస్తున్నా..

ఏవో కొర్రీలతో కేంద్రం ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి దగ్గర కావాలన్నా... అవినీతి ఆరోపణలపై విచారణనుంచి తప్పించుకోవాలన్నా జగన్ ను ఆశ్రయించడమే మార్గమని నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడలో భాగమే లండన్ వేదికగా జగన్ తో కేటీఆర్ భేటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.