కేంద్రమంటే కేసీఆర్ కు భయమా?

Publish Date:Jun 4, 2021

Advertisement

మాజీ మంత్రి ఈటల రాజేందర్, తెరాస ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు.ఇది అనూహ్య పరిణామం కాదు. అనుకున్నదే జరిగింది. అలాగే, తమ నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా, సహజంగానే  ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే, గతంలో ఇవే విమర్శలు మరొకరు చేసినప్పుడు, ఈయనే ఆ విమర్శలను ఖండించారు. ఇప్పుడు ఈయన చేసిన విమర్శలను, తెరాస ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర రెడ్డి ఖండించారు. అయితే కేసీఆర్’ని ఈటల విమర్శించడం ఎంత సహజమో, ఈటలను పల్లా ఓ పట్టుపట్టడం కూడా అంతే సహజం. ఈటల ప్రధానంగా తెరాసలో తమ ఆత్మగౌరవానికి భంగంకలిగిందని, అంటున్నారు. నిజంగా అంతగా ఆయన ఆత్మగౌరవానికి భంగం కలిగిందే నిజం అయితే,  మెడ పట్టి గెంటే వరకు చూరుపట్టుకు ఎందుకు వెళ్ళాడారు,అనే ప్రశ్నకు ఈటల దగ్గర సమాధానం లేదు. అందుకే, ఆయన ఆ ఒక్కటి పక్కన పెట్టి మిగిలిన విషయాలు అన్నీ మాట్లాడుతున్నారు.  

అదలా ఉంటే, పల్లా రాజేశ్వర రెడ్డితో పాటుగా ఇతర తెరాస నాయకులు కూడా ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆస్తుల రక్షణ అని మండిపడ్డారు. అక్రమంగా సంపాందించిన తన ఆస్తులను కాపాడుకునేందుకు ఈటల అత్మగౌరవం, ట్యాగ్ తగిలింఛి నాటకాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. అయితే, ఈటల ఆత్మగౌరవం వంటి పెద్ద పెద్ద అంతాలు మాట్లాడి ఉన్న గౌరవం పోగొట్టుకున్నట్లుగానే, ఈటల అక్రమాస్తుల విషయం ప్రస్తావించి, తమ పరువు తామే తీసుకున్నారు.  అందుకే, తెరాస నేతల ఆరోపణలు నిజమే అయితే , ఆ ఆరోపణలకు  ఈటల కంటే ముందు అదికార పార్టీ నేతలే సమాధానం ఇవ్వవలసి ఉంటుందని, అంటున్నారు.  

ఈ నేపధ్యంలో తెరాస నాయకుల మాటలను విశ్లేషించుకుంటే,  తెరాస మంత్రిగా ఉంటూ, ఈటల రాజేందర్ అవినీతికి పాల్పడ్డారు.. లక్షలు కోట్లు వెనకేసుకున్నారని తెరాస నాయకులే అంగీకరించినట్లు అవుతుంది. అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రి వర్గం అవినీతిమయం అని విపక్షాలు చేస్తున్న విమర్శలను పాక్షికంగా అయినా అంగీకరించినట్లు అవుతుంది. ఎవరైనా ఈ తీగ పట్టుకు లాగి,ఏ ‘పిల్లో’  (ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేస్తే, మొత్తంగా ఏడేళ్ళలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి డొంకంతా కదిలే ప్రమాదం లేక పోలేదు.నిజానికి ఈటల మీద వచ్చిన ఆరోపణలకు మించిన ఆరోపణలు ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్ల్యేల పై కూడా ఉన్నాయి. భూకబ్జాకేసుల్లో ఇరుకున్నఇతర పార్టీల ఎమ్మెల్యేలను భయపెట్టి పార్టులోకి లాక్కున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇవ్వనీ పబ్లిక్ డొమైన్’ ఉన్న విషయాలే. ఇప్పుడు, ఆ లోతుల్లోకి వెళితే, సూది కోసం సోది కెళితే, పాత తప్పుడు తిరుగుళ్ళు   బయట పడ్డాయి అన్నట్లు, అవుతుందని అంటున్నారు. 

అదలా ఉంటే, ఈటలల పై పోటాపోటీగా విమర్శలుచేసే  ఉత్సాహంలో తెరాస నాయకులు మరో సెల్ఫ్ గోల్ కూడా చేసుకున్నారని, విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈటల తమ అక్రమాస్తులను రక్షించుకుకునేందుకే, బీజేపీ పంచన చేరారని పల్లా రాజేశ్వర రెడ్డి చేసిన ఆరోపణని విశ్లేషించుకుంటే, అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలు బీజేపీలో చేరితే, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏమీ చేయలేదని, సర్కార్ తరపుయన్ రాజేశ్వర రెడ్డి చేతులెత్తేసారా, అని ప్రశ్నిస్తున్నారు.అలాగే, కేంద్రానికి కేసీఆర్ భయపడుతున్నారని  ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కూడా ఈ వ్యాఖ్యలు బలం చేకురుస్తున్నాయని  వివిశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే కేంద్రానికి ఎందుకు భయాడుతున్నారు? అన్న ప్రశ్న కూడా బలంగ్ వినవస్తోంది. 

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు, రైతు చట్టాలకు సంబంధించి కరీంనగర్, నిజామబాద్ సభల్లో మోడీ మీద ఓ రేంజిలో రెచ్చిపోయిన కీసీఅర్, తర్వతా ఢిల్లీ వెళ్లి కాళ్ళ బేరానికి వచ్చారని, ఇక అక్కడి  నుంచి రైతు చట్టాల ఊసే లేదని  విపక్షాలు ఎప్పటినుంచో విమర్శిస్తున్నాయి. ఇప్పుడు, పల్లా పలుకులతో నిజంగానే కేసీఆర్ కేంద్రానికి భయపడుతున్నారు అనుకోవలసి వస్తోందని అంటున్నారు. అయితే, ఎందుకు భయడుతున్నారు .. అదేమీ రహస్యం కాదు .. దాల్ మే కుచ్’ నహీ .. బహుత్ ... బహుత్  కాలాహై.

By
en-us Political News

  
ఉన్నత విద్య, ఉద్యోగాల  కోసం విదేశాలకు వెళ్లి అర్థాంతరంగా తనువు చాలిస్తున్న భారత విద్యార్థుల ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 403 మంది భారత విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం  ఇటీవల వెల్లడించింది
ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. ఎక్క‌డా చిన్న బొట్టు ర‌క్తం కూడా కార‌లేదు. రాళ్లు రువ్వుకోలేదు.. పోలీసుల‌ను కూడా కొట్ట‌లేదు. క‌నీసం లాఠీ చార్జి ఘ‌ట‌న‌లు కూడా వెలుగు చూడ‌లేదు. మ‌రి అంత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లోనే అంత ప్ర‌శాంతంగా ఎన్నిక‌లుజ‌రిగిన‌ప్పుడు.. ఏపీలో ఎందుకు..
వైసీపీ ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి బాగా అలవాటైన వైనాట్ తోనే ఈ నినాదం కూడా మొదలౌతోంది. ఔను జగన్ ఎప్పుడో ఆరు నెలల కిందటే వైనాట్ 175 అంటూ ఓ నినాదం ఇచ్చి.. పార్టీ శ్రేణుల్లో వైసీపీ మరో సారి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ప్రోది చేయాలని భావించారు. అప్పట్లోనే ఆ నినాదం నవ్వుల పాలైంది.
వయసుతో పాటు అభిమానుల సంఖ్యనూ, సినిమా సినిమాకీ స్టార్‌డమ్‌నీ పెంచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రజినీకాంత్
ఈ ఎమ్మెల్యే చాలా మంచోడు ముఖ్యమంత్రి జగన్ సర్టిఫికెట్ ఇచ్చిన మాచర్ల ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సీరియస్ అయిన ఎన్నికల సంఘం ఆయనపై చర్యలకు ఆదేశించింది. దాదాపు ఏడేళ్లు జైలు శిక్ష పడేలా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసలు ఆయనను అరెస్టు చేయడానికి బయలు దేరారు.
ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పతాకం రెపరెపలాడనుంది. దీనికి సింబాలిక్‌గా టీడీపీ ఫ్లాగ్ గ్రేట్ ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. హోరాహోరీ ప్రచార యుద్ధం ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత చెలరేగిన హింసాకాండతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఆ ఉద్రిక్తతలు ఇప్పటికీ చల్లారలేదు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో పందెం రాయుళ్ల దృష్టంతా రెండు నియోజకవర్గాలపైనే ఉంది. దర్శి, చీరాల నియోజకవర్గాలలో వైసీపీదే పై చేయి అని ముందు నుంచీ ఒక భావన ఉంది. పోలింగ్ పూర్తి అయిన తరువాత నుంచీ ఈ నియోజవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు శుక్రవారం కొద్ది సేపు హల్ చల్ చేశాయి. అయితే ఆ తరువాత తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ నాని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది పక్కన పెడితే కొడాలి నానికి ఇంతకు ముందు నుంచీ కూడా ఆరోగ్య సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే.
మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు పారిపోయిన సంగతి తెలిసిందే.
నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంకులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం వద్ద జరిగిన 2568వ బుద్ధ జయంతి వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న టిబెటన్ బౌద్ధ భిక్షువులు (విజయపురి సౌత్) అనుపు వద్దగల బౌద్ధ కట్టడాలను సందర్శించారని బుద్ధవనం కన్సల్టెంట్ మరియు ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-12
చత్తీస్ గడ్ లోని  నారాయణ పూర్  భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.