సీఎం కేసీఆర్ పరమ దుర్మార్గుడు.. బండి

Publish Date:Aug 31, 2022

Advertisement

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరమ దుర్మార్గుడిగా అభివర్ణించారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణిస్తే వారిని కనీసం పరామర్శించకుండా రాజకీయ పర్యటన కోసం బీహార్ వెళతారా అని విమర్శించారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళలకు మరణించడానికి కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం, మూర్ఖత్వమే కారణమని నిందించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ బుధవారం పరామర్శించారు. ఆ సందర్బంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బాధితులను పరామర్శించకుండా బీహార్ వెళ్ళటం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలోని పేదలను వదిలేసి పంజాబ్, బీహార్‌లో డబ్బులు పంచటం దారుణమన్నారు.

ఆపరేషన్లు వికటించి మరణించిన   మహిళల పిల్లల చదువు, భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని   డిమాండ్ చేశారు.   రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. సీఎం సర్కార్‌కు పేదల ప్రాణాల కంటే పేరు ప్రఖ్యాతలే ముఖ్యమా అని నిలదీశారు.

 రాష్ట్ర సీఎంకు పేదల ఉసురు కచ్చితంగా తగులుతుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుంటామంటే అంగీకరించేది లేదన్నారు.  బెదిరించి ఆపరేషన్లు చేశారని చికిత్స పొందుతోన్న మహిళలే స్వయంగా చెప్తున్నారని బండి సంజయ్ అన్నారు. 

By
en-us Political News

  
ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌త్యేకంగా ట్వీట్స్ చేశారు. అసెంబ్లీ స‌హా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాల‌ని మోదీ పిలుపునిచ్చారు. మ‌రోవైపు తెలుగు సంస్కృతిని, గౌర‌వాన్ని కాపాడే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.   
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ సోమవారం (మే13) ప్రారంభం అయింది. నాల్గోవిడతలో దేశ వ్యాప్ంగా 10 రాష్ట్రాలలో  96 లోక్‌సభ స్థానాల్లో   ఓటింగ్‌ జరుగుతోంది.
మంగళగిరిలో ఓటు హక్కును  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి తన సతీమణితో కలిసి వచ్చారు.
మంత్రి పెద్దిరెడ్డి మంచీ చెడూ, ఉచ్ఛం, నీచం వదిలేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలోకి తొక్కి పోలింగ్ రోజున కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. యర్రాతివారిపల్లి 187 నంబర్ పోలింగ్ బూత్‌లో పెద్దిరెడ్డి ఓటు వేశారు.
ఉద్యోగులకు చెల్లించాల్సిన కరవు భత్యం, ఇతర బకాయిల మొత్తాన్ని ఈ రోజు తెల్లవారు ఝామునే వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల ఉత్సాహం మీద పలు చోట్ల ఈవీఎంలు నీళ్లు చల్లుతున్నాయి. రాష్ట్రంలో ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు పోలంగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్ లలో వేచి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటు వేసే వంతు కోసం క్యూలైన్లలో నిలుచున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు వేయాలన్న పట్టుదల, సంకల్పం జనంలో కనిపిస్తోంది.
ఆంద్రప్రదేశ్‌లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులు, కిడ్నాపుల ఘటనలు జరిగాయి.
ఏపీలో అధికార పార్టీ వైసీపీ సరిగ్గా పోలంగ్ రోజున కాడె వదిలేసిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే ఫేక్ హామీలు, ఫేక్ వాగ్దానాలు చేసిందన్న తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ తాజాగా ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఫేక్ వీడియోలకు తెరలేపింది.
తెలుగురాష్ట్రాలలో ఓటింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిలుచుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటామన్న పట్లుదల కనబరిచారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన నాయకులే తన్నుకున్నారు. వైసీపీకి చెందిన రెండు వర్గాల వారు పోలింగ్ బూత్‌లో మా వర్గం వారే ఏజంట్‌గా వుండాలంటే, మావర్గం వారే ఏజెంట్‌గా వుండాలంటూ తన్నుకున్నారు.
అవినాష్ రెడ్డి పైన పేర్కొన్న దుర్మార్గాలన్నీ చేయడానికి ప్రిపేర్ అయినట్టు అర్థమైపోయింది. ఎన్నికల కమిషన్, పోలీసులు అప్రమత్తంగా వుండాలి.
జగన్ పార్టీ ఎన్నికల హింసకు శ్రీకారం చుట్టింది. మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్‌పై జగన్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ రత్నాకర్ తీవ్రంగా గాయపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.