Publish Date:Jul 31, 2013
కాంగ్రెస్ అధిష్టానం నిన్న తెలంగాణా ప్రకటన చేసిన వెంటనే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత దిగ్విజయ్ సింగ్ చేసిన పార్టీ విలీనం వ్యాక్యలకు స్పందిస్తూ “తాను మాట తప్పే మనిషిని కాదని, అయితే, పార్టీ విలీనం గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఆయన కోరారు. ఆ తరువాత ఆ పార్టీ రాష్ట్ర విభజనను ఏవిధంగా చేయాలనుకొంటున్నదో, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గురించి తన ఉద్దేశ్యాలు ఏమిటో వంటి విషయాలను స్పష్టం చేయాలని కోరారు. అది గాక, పార్టీ విలీనం చేసేందుకు రెండు పార్టీల మధ్య తగిన ఒప్పందం జరిగిన తరువాతనే సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ విలీనం చేయడానికి అభ్యంతరం ఏమి లేదన్నట్లే ఆయన మాట్లాడారు.కానీ, తెలంగాణాలో పునర్నిర్మాణంలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడం గమనిస్తే, వీలయితే తన పార్టీ అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే కోరిక ఆయనలో ఉందని అర్ధం అవుతోంది.
అయితే, కాంగ్రెస్ తన ప్రమేయం లేకుండానే తెలంగాణా ప్రకటన చేయడంతో ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీదే పైచేయి అవుతుందని ఆయనకీ తెలుసు. మారిన పరిస్థితుల్లో బలపడిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో డ్డీకొని మొక్కుబడిగా సీట్లు సంపాదించుకొని ప్రతిపక్ష బెంచీలకి పరిమితమయి పోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తన ప్రాభల్యం తగ్గిపోవడం ఖాయం. అంతకంటే, కాంగ్రెస్ లో తెరాసను విలీనం చేసి రానున్న ఎన్నికలకి తన పార్టీ నేతలకి వీలయినన్ని ఎక్కువ టికెట్స్ దక్కేలా చూసుకొంటే, కాంగ్రెస్ తో పోటీపడేబదులు దాని బలమయిన మద్దతు కూడా పొంది అధికార పార్టీలో చక్రం తిప్పవచ్చును. ఒకవేళ కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనాలని భావించినా కూడా మారిన రాజకీయ పరిస్థితుల్లో, ఆపార్టీలో నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని తెరాస నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలుపెడితే ఇక వారిని ఆపడం ఆయన తరం కాదు. అప్పుడు ఆయన ఎటువంటి షరతులు పెట్టకుండా తెరాసను కాంగ్రెస్ లో విలీనానికి ముందుకు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ అందుకు అంగీకరించక పోవచ్చును. అంతకంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే మేలని అర్ధం చేసుకొన్నకేసీఆర్ విలీనం గురించి సానుకూలంగా స్పందించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-39-24785.html
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.