Publish Date:Mar 27, 2026
కల్వకుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా. అలా తన తండ్రి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏప్రిల్ 27, 2001లో స్థాపించగా.. కూతురు కవిత, పాతికేళ్ల తర్వాత.. అంటే 2026, ఏప్రిల్ 25న పార్టీ ప్రకటనకు సుముహుర్తం ఎంపిక చేసినట్టు ప్రకటించారు.ఇంతకీ ఈ పార్టీ పేరు ఏమై ఉంటుంది? అంటే, తెలంగాణ ప్రజా జాగృతి అని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తెలంగాణ జాగృతి అనే సామాజిక సంస్థను నడుపుతున్నారు. దీనికే ప్రజా అనే పదం చేర్చుతూ దాన్ని రాజకీయ పార్టీగా మార్చుతున్నట్టు కనిపిస్తోంది.
ఇక పార్టీ గుర్తులు ఏవి ఉంటాయో పరిశీలిస్తే.. ధర్మ గంటను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జెండా, అజెండా ఎలాంటివో గమనిస్తే ఇప్పటికే జాగ్రత్తికంటూ తెలుపు, లేత పచ్చతో కూడిన జెండా రంగులున్నాయి. వీటికి అజెండాను జోడిస్తే.. సామాజిక తెలంగాణ లేదా తెలంగాణ ఫస్ట్.. ఆమె తీసుకున్న రాజకీయ విధానంగా సమాచారం. ఇక యువత, మహిళలు, అణగారిన వర్గాల హక్కులు, మరీ ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడ్డం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక బీసీ సంగతి సరే సరి. మహిళల రిజర్వేషన్లపై పోరాటం కూడా ఆమె తీసుకుంటున్న పొలిటికల్ లైన్లలో భాగమే.
వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్లో భాగంగా తెలంగాణ నియోజకవర్గాలు సైతం పెరగనుండటంతో ఆమె పార్టీ నుంచి కూడా ఎందరో కొత్త రాజకీయ నాయకులు పుట్టుకొచ్చేలా తెలుస్తోంది.ఇక ఏప్రిల్ 25న ఎందుకు? ఈ ముహుర్తం ఖరారు చేయడం వెనక ఉన్న ఉద్దేశమేంటో పరిశీలిస్తే.. కొన్ని జ్యోతిష శాస్త్ర పరమైన అంశాలు ఇందులో దాగి ఉన్నట్టు సమాచారం. ఏప్రిల్ ఇరవై ఐదున రాజయోగాన్నిచ్చే గ్రహగతుల సంచారం కనిపిస్తోందని అంటారు పండితులు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సుదినంగా చెబుతున్నారు.
దానికి తోడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి కూడా ఈ తేదీతో కొంత సంబంధముంది. పాతికేళ్ల క్రితం కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించారు కవిత తండ్రి కేసీఆర్. అదే తేదీకి అటు ఇటుగా తెలంగాణ ప్రజా జాగృతి ప్రారంభిస్తున్నారు కేసీఆర్ తనయ కవిత. ఆ పార్టీ ఆనాడు ఎంతగా ఎదిగిందో, తన పార్టీ కూడా అంతేలా ఎదుగుతుందని బలంగా విశ్వసిస్తున్నారు కవిత. ఉగాది తర్వాత వచ్చే శ్రీరామనవమి వేడుకల అనంతరం తన పార్టీ జెండా ఎగురవేయడం ద్వారా.. ప్రజల్లోకి బలంగా వెళ్లవచ్చన్న నమ్మకాలు కూడా కవితకు ఉన్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. అలాంటి వారికి తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని అంటున్నారు కవిత. ఇక చట్టసభల్లో మహిళా సాధికారతను తీసుకొచ్చేలా 33 శాతం రిజర్వేషన్లకు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రత్యేకించీ యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు.. నిరుద్యోగ సమస్యలపై రాజీలేని పోరాటం కూడా కవిత తన విధానంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కవిత పార్టీ ఎఫెక్ట్ ఎంత? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి దీటుగా ఆమె పార్టీ టీపీజే ఎదిగే అవకాశం ఎంత? దక్షిణాది నుంచి జయ తర్వాత ఆ స్థాయిలో ఒక మహిళగా ఆమె రాజకీయంగా ఎదిగి సీఎం కాగలరా? తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavithas-new-party-launching-on-april-25th-25-216294.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.