Publish Date:Jul 18, 2025
ఈ మధ్య కవితక్క కొత్త కథ మొదలు పెట్టారు. అదేంటంటే.. కాంగ్రెస్ తీసుకొచ్చిన బీసీ ఆర్డినెన్స్ బాగుందని.. బీఆర్ఎస్ కూడా తన దారికి రావల్సిందేనంటున్నారు. నిజానికి.. కవిత ఇలా ఎందుకు అనాల్సి వచ్చిదంటే.. ఆమెపై కావచ్చు, ఆమె కుటుంబ సభ్యులపై కావచ్చు వరుస పెట్టున నమోదవుతున్న కేసుల మోత అలాంటిది.
తాజాగా చూస్తే హెచ్ సీ ఏలోనూ కవితక్క హస్తముందని అంటున్నారు. అంతగా ఆమె, ఆమె కుటుంబ సభ్యుల అవినీతి బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా నలు మూలలా విస్తరించిందని చెబతారు. మొన్న అరెస్టయిన జగన్మోహన రావు మరెవరో కారు.. హరీష్ రావు కి సోదరుడి వరుస అవుతారు. అంటే కవితకు బావ వరుస. ఈ లెక్కన చూస్తే ఇందు గలదు అందు లేదన్న సందేహంబు వలదు- కల్వకుంట్ల వారి అవినీతి కథ.. ఎందెందు చూసిన అందందే కలదన్న మాట వినిపిస్తోంది.
దీంతో కవితక్క కాంగ్రెస్ రాగం అందుకున్నారు. అందుకు బీసీ తాళం ఎంచుకున్నారు. తద్వారా ఛాన్స్ దొరికినపుడల్లా కాంగ్రెస్ కి తాన తందాన అనడానికి చిడతలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. మొన్నటి వరకూ ప్రో బీఆర్ఎస్ రాగం ఆలపించిన కవితక్క కొత్తగా ఈ కాంగ్రెస్ రాగమాలిక అందుకోవడం వెనుక ఉన్న అసలు కథ ఇదీ. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి తెలంగాణ నాలుగు చెరగులా విస్తరించిన విషయం తెలిసిందే. స్వయానా సొంత పార్టీయే ఆమెను సింగరేణి కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తొలగించింది. ఇక బయట సంగతి మాటేంటీ? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఒక పక్క ఢిల్లీ రేంజ్ లో లిక్కర్ కేసు మెడకు ఉచ్చులా తగులుకుని కనిపిస్తోంది. మరొక పక్క తెలంగాణలోనూ రకరకాల కేసులు. తాజాగా హెచ్ సీ ఏ కేసు. ఒకటీ రెండు కాదు ఏకంగా 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారమిది. ఇందులో కేటీఆర్ బావమరిదికే కాంట్రాక్టులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ దిశగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీఐడీకి కంప్లయింట్ చేసింది. దీంతో బీఆర్ఎస్ పెద్దలతో మీకున్న సంబంధమేంటన్న కోణంలో అరెస్టయిన జగన్మోహనరావును ఆరా తీస్తున్నారు విచారణాధికారులు. బీసీసీఐ ఇచ్చిన 600 కోట్లు ఎటు మళ్లించారని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు చూస్తుంటే తిరిగి ఈడీ చేతుల్లోకి వెళ్లేలా కనిపిస్తోంది. ఇక్కడ కూడా కవితక్క హస్తముననట్టుగా సమాచారం.
ఇన్నేసి కేసుల్లో పీకలోతు ఇరుక్కోవడంతోనే సడేన్ గా తెలంగాణ వాదం వినిపించడం, ఆపై బీసీల తరఫు పోరాటాలు.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఆర్డినెస్ కి కవిత జైకొట్టి ప్రభుత్వం తన పట్ల ఒకింత సానుకూలంగా వ్యవహరించేలా చూసుకుందాని కవిత భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముందు ముందు ఇంకెన్ని కవితక్క కథకళి నృత్యాలు వెలుగులోకి వస్తాయో ఇప్పుడిప్పుడే చెప్పలేం అంటున్నారు కొందరు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavitha-kalvakuntla-support-congress-bc-ordeinence-39-202212.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.