Publish Date:Mar 14, 2023
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పుడు అందరి దృష్టీ ఈడీ దర్యాప్తుపైనే కేంద్రీకృతమై ఉంది. మరో రెండు రోజుల్లో (మార్చి 16) ఈడీ కవితను మరోమారు విచారించనుంది. తొలి సారి కవితను విచారించిన సందర్బంగా అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో హై డ్రామా నడిచింది. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో సౌత్ గ్రూపు పాత్రపై కవితను తదుపరి విచారణ సందర్భంగా లోతుగా ప్రశ్నించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురి వాంగ్మూలాలు రికార్డు చేసిన ఈడీ ఇక ముందు ముందు దర్యాప్తును మరింత ముమ్మరం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఈ కేసు ఒక కొలిక్కి రావాలంటే సౌత్ గ్రూప్ ప్రమేయాన్ని పకడ్బందీగా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నది ఈడీ భావనగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా ఇప్పటికే కొంత మేర పురోగతి సాధించిన ఈడీ ఈ గ్రూపుతో సంబంధం ఉన్న అరబిందో ఫార్మా ఫుల్టైమ్ డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవను అరెస్టు చేసింది. అలాగే ఇప్పటికే ఒక సారి విచారించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రెండో మారు విచారించనుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సౌత్ గ్రూపుదే కీలక పాత్ర అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కిక్బ్యాక్ రూపంలో ముడుపులు అందినట్టు కూడా నిర్ధారించుకుందని అంటున్నారు. ఆ సొమ్ము ఎలా చేతులు మారిందన్న విషయంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించిందని చెబుతున్నారు. దీంతో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జోరు పెంచింది. బ్యాంకు స్టేట్మెంట్లు, కంపెనీల ఆడిట్ రిపోర్టులు, వ్యక్తిగత ఆస్తుల వివరాలు, ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులు తదితరాలన్నింటినీ సమర్పించాల్సిందిగా సౌత్ గ్రూప్ సభ్యులకు చెబుతోంది. వాటి ఆధారంగానే విచారణ కొనసాగిస్తోంది. ఆధారాలను ఒక్కొక్కరి ముందు పెట్టి విడివిడిగా విచారణ తరువాత ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి విచారించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
అందులో భాగంగానే పిళ్లై కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది సౌత్ గ్రూపులోని వ్యక్తులను మనీ లాండరింగ్ కోణం నుంచి ప్రశ్నించాల్సి ఉన్నదని, ఈ గ్రూపులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ప్రతినిధిగా ఉన్న ఆడిటర్ బుచ్చిబాబును సైతం ఈ నెల 15న ప్రశ్నించడానికి నోటీసులు ఇచ్చామనీ, అలాగే పిళ్లైని అతనితో కలిసి విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. వీటన్నిటినీ బట్టి చూస్తే మద్యం కుంభకోణంలో రానున్న రోజులలో మరిన్ని అరెస్టులు అనివార్యమన్న భావనను న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆ అరెస్టులలో కవిత అరెస్టు కూడా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavita-to-face-ed-again-39-152531.html
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.