కాశ్మీర్ టూ కేరళ… క్యాన్సర్ విస్తరిస్తోంది! కాలం మించిపోతోంది!

Publish Date:May 8, 2017

Advertisement

 

ఉగ్రవాదం… ఇప్పుడు మనొక్కరి సమస్య కాదు. యావత్ ప్రపంచం సతమతం అవుతోంది. అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ధనిక, పేద దేశాలు, ఖండాలు అన్నీ వణికిపోతున్నాయి. అయితే, ఇండియాకి టెర్రరిజమ్ కొత్త కాదు. దశాబ్దాలుగా మనం నెత్తురోడుతూనే వున్నాం. కాని, రాను రాను ఉగ్ర ముప్పు అన్ని దిక్కుల్లోంచి ముసురుకుంటోంది. ఉగ్రవాదం ప్రత్యక్ష యుద్ధం కాదు కాబట్టి… మనం నిజానికి ఇప్పుడు పరోక్ష యుద్ధంలోనే వున్నామని అర్థం. ప్రతీ రోజూ, ప్రతీ నిమిషం శత్రువు మనకు ఒక్కో అడుగు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఆధునిక టెక్నాలజీని టెర్రరిజమ్ వాడుకోవటం… మరింత ఆందోళనకారం!

 

గడిచిన కొన్ని గంటల్లో రెండు ఆందోళనకర వార్తలు వచ్చాయి మీడియాలో. వాట్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతగా ఉగ్రవాదం మనకు నిత్యకృత్యం అయిపోయింది. ఇక మొదటి వార్త ఏంటంటే… కాశ్మీర్లో ఓ లష్కరే ఉగ్రవాది ఎన్ కౌంటర్లో మరణించాడు. అతడి అంత్యక్రియల్లో ఇతర ఉగ్రవాదులు జనం మధ్యలో చొరబడ్డారు. గాల్లోకి కాల్పులు జరిపి సాల్యూట్ చేసి వెళ్లారు! అలా గన్ సాల్యూట్ ఎవరికి చేస్తారు? దేశం కోసం మరణించిన అమరులకి, ఉన్నత స్థానాలు అలంకరించిన నేతలకి చేస్తారు! కాని, మన దేశంలో ఉగ్రవాదులు నిర్భయంగా కెమెరాల ముందే గాల్లోకి కాల్పులు జరిపి తమ గౌరవం, భక్తి చాటుకున్నారు! కాశ్మీర్లో ఇలాంటి దుర్మార్గ స్థితి మనం ఊహించలేనిదేం కాదు. అక్కడ ఉగ్రవాదులు రాళ్లు మొదలు బుల్లెట్ల దాకా అన్నీ వాడుకుంటున్నారు. ఆవేశంలో వున్న కాశ్మీరీ యువతను కూడా తమ స్వార్థానికి వాడేసుకుంటున్నారు…

 

కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు, కలకలం ఎంత మాత్రం  విశేషం కాదు. నిజానికి కాశ్మీర్ లోయలో ఏదైనా ఒక రోజు కాల్పుల చప్పుళ్లు వినిపించకపోతే అదీ అసలు విశేషం! కాని, ఇప్పుడు మనం నిజంగా వణికిపోవాల్సింది ఎక్కడో దక్షిణాన వున్న కేరళలో కూడా ఉగ్ర కదలికలు బయటపడుతుండటమే! తాజాగా ఎన్ఐఏ బయటపెట్టిన సమాచారం ప్రకారం… కేరళలోని కొందరు ఒక వాట్సప్ గ్రూప్ ద్వారా అఫ్గనిస్థాన్ లోని టెర్రరిస్టులతో టచ్ లో వున్నారట! వాళ్లు ఇక్కడ నుంచే వెళ్లిన కేరళ భారతీయులు. ఐఎస్ఐఎస్ లో చేరారు. దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. వారితో వాట్సప్ సంబంధాలు కొనసాగిస్తున్నారు ఇక్కడి దేశ ద్రోహులు! ఇప్పటికే ఎంతో మంది ఐఎస్ఐఎస్ లో చేరి కూడా వుండొచ్చని జాతీయ భద్రతా అధికారులు అంచనా వేస్తున్నారు!

 

కాశ్మీర్ , కేరళ మాత్రమే కాదు… ఉగ్రవాదం ఇప్పుడు భారతదేశంలో నలుమూలలా విస్తరిస్తోంది. బీజేపి అధికారంలో వున్న రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ప్రాంతీయ పార్టీల ఏలుబడి సాగుతోన్న రాష్ట్రాల్లో అంతటా ఒకటే పరిస్థితి. పాక్ లోని, ఇతర ఇస్లామిక్ దేశాల్లోని ఉగ్రవాదులు ఇక్కడి మైనార్టీల మనసులు మారుస్తున్నారు. మన వార్నే మనకు శత్రువులుగా తయారు చేస్తున్నారు. అందుకోసం ఫేస్బుక్, వాట్సప్ లాంటి టెక్నాలజీ వాడుకుంటున్నారు. కాశ్మీర్ అల్లర్లకు వాట్సప్ గ్రూపులే కారణమంటోంది ఎన్ఐఏ. అలాగే, పట్టించుకునేవాడు లేకుండా ప్రసారమైపోయే ఎన్నో ఛానల్స్ కూడా దేశం పై పగని బోధిస్తున్నాయని తేలుతోంది! దీని వల్ల ఒకే దేశంలోని రెండు వర్గాలు ఒకర్ని ఒకరు అనుమానాస్పదంగా చూసుకోవాల్సిన దుస్థితి వస్తోంది!

 

కాశ్మీర్లో తాజాగా ఎన్ కౌంటరైన లష్కర్ ఉగ్రవాది ముస్లిమ్. అతడికి మద్దతుగా అంత్యక్రియల్లో పాల్గొన్నది కూడా ముస్లిమ్ లే. గన్నులతో కాల్పులు జరిపి కలకలం రేపిన వారు కూడా ముస్లిమ్ లే. అయితే, ఇక్కడే మరో కోణమూ వుంది. లష్కర్ ఉగ్రవాదిని ఎన్ కౌంటర్ చేయటంలో సాహసోపేతంగా పాలుపంచుకుని ప్రాణాలు కోల్పోయింది కూడా ముస్లిమ్ పోలీసే! మెహమూద్ అనే యువకుడు ఎన్ కౌంటర్లో అమరుడయ్యాడు! కాని, ఎవరో కొందరు ఆవేశపరులైన మైనార్టీ యువకులు చేస్తోన్న ఉగ్ర కార్యకలాపాల వల్ల వారి సమాజం మొత్తానికి అనుమానాస్పద చూపులు తప్పటం లేదు. ఇదే స్థితి ప్రపంచ ముస్లిమ్ లందర్నీ వేధిస్తోంది. ఇండియాలో చాలా వరకూ హిందూ, ముస్లిమ్ సంబంధాలు ఎంతో పటిష్టమనే చెప్పాలి.

 

దేశం మొత్తం క్యాన్సర్ లా విస్తరిస్తోన్న ఉగ్రవాదాన్ని ప్రధానంగా కేంద్రం ప్రభుత్వం అరికట్టాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాజకీయ శత్రుత్వాలు, లాభాలు పక్కన పెట్టి కేంద్రానికి తగిన సహకారం అందించాలి. మనలో మనకి ఎన్ని విభేదాలున్నా ఎవ్వరూ విభేదించకుండా వుండలేని ఉగ్రవాదం. తప్పకుండా ఉగ్రపోరులో దేశమంతా ఒక్కటి కావాలి. ఎందుకంటే, దేశం లోపలి ఉగ్రవాదం పాకిస్తాన్ కంటే ప్రమాదకరమైంది. అది వేటు వేయదు… వేయి గాట్లతో రక్తమోడేలా చేస్తుంది!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.