తె.దే.పాను ‘కాపు’ కాస్తాం...

Publish Date:Dec 30, 2013

Advertisement

 

 

 

రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో... వచ్చే ఎన్నికల్లో ఊహించని విధంగా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఓ కులం మద్ధతు టోకున లభించనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయవిశ్లేషకులు. ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కాపు సామాజికవర్గం తదనంతరం దశలవారీగా చోటుచేసుకున్న పరిణామాలలో కొంచెం కొంచెంగా ఆ పార్టీకి దూరమైంది. తె.దే.పాతో కాపు కులం వైరానికి విజయవాడలో వంగవీటి రంగా హత్య తొలి బీజం వేసింది. అక్కడ నుంచి కాపు కులస్థులు రాజకీయంగా మరింత ప్రాధాన్యతను కోరుకోవడం, సహజంగానే కమ్మ సామాజికవర్గం డామినేషన్‌ ఉన్న తెదేపాలో తాము ఎదగలేమనే భయంతో... స్వంతంగా ఎదిగే ప్రయత్నం చేయడం వంటివి ఈ దూరాన్ని మరింత పెంచాయి. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్‌కు మద్ధతిచ్చిన కాపు కులస్థులు ఆ పార్టీ కూడా తమను ఓటుబ్యాంకుగానే చూస్తోందని గ్రహించి నిరాశలో కూరుకుపోయారు. అదే సమయంలో 2009లో రాజకీయనగారా మోగించిన చిరంజీవిలో వారికి ఆపద్భాంధవుడు కనిపించాడు. అంతే ఆస్థులూ, ఆభరణాలూ సైతం తాకట్టు పెట్టి చిరంజీవికి అన్ని విధాలుగా సహకరించారు. నిజానికి చిరంజీవికి పడిన 70లక్షల ఓట్లలో కాపు కులస్థుల ఓట్లే అత్యధికం అనడంలో సందేహం లేదు. ఆ ఎన్నికల్లో చిరంజీవి అధికారంలోకి రాకపోయినా వారు పెద్దగా ఇబ్బంది పడేవారు కాదేమో కాని... నమ్మినవారిని నట్టేట ముంచుతూ ఆయన కాంగ్రెస్‌ బోటెక్కేశారు. దీంతో మరోసారి, అదీ గతంలో ఎన్నడూ లేనంత పెద్దస్థాయిలో మోసపోయినట్టు భావించారు కాపులు.

 

వీటన్నింటి నేపధ్యం, ప్రస్తుత రాజకీయపరిస్థితులు బేరీజు వేసుకుంటున్న కాపు సామాజికవర్గం తెలుగుదేశం పార్టీ  వైపు మొగ్గు చూపుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా తమను మోసం చేయడమే కాకుండా చిరంజీవి అనే ఏకైక నాయకుడ్ని కూడా తమకు కాకుండా చేసిన కాంగ్రెస్‌ తప్పులు రాష్ట్ర విభజనతో పరాకాష్టకు చేరాయని కాపుల భావన అనీ, ఈ నేపధ్యంలో ఎలాగైనా ఆ పార్టీని ఓడిరచాలని  ఆ సామాజికవర్గం  ఆత్రుతగా ఎదురు చూస్తోందంటున్నారు. రాష్ట్రజనాభాలో దాదాపు 35శాతంగా ఉన్న కాపుల ఓట్లు గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనేది  తెలిసిందే.




కాంగ్రెస్‌, సోనియాలను ఎదిరించినందుకు గాను విభజనకు ముందు కాపులు  వైకాపా వైపు, జగన్మోహన్‌రెడ్డి వైపు మొగ్గు చూపినా విభజనానంతరం వారిలో జగన్‌ వైఖరి పట్ల భ్రమలు తొలగిపోయాయి. జగన్‌ కూడా  తర్వాత తర్వాత కాంగ్రెస్‌లో కలవక తప్పదని, ఇదంతా  కాంగ్రెస్‌ ఆడిస్తోన్న నాటకం అని భావిస్తున్న కాపు వర్గం... ఈ కుట్రలను ఛేధించాలని, దీంతో తమ పాత మిత్రుని చెంతకే చేరాలని నిశ్చయించుకుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దీనికి నిదర్శనంగానే విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కన్నబాబు వంటి పలువురు కాపు నేతలు తె.దే.పా లోకి దూకేందుకు సిద్ధమవడాన్ని వీరు చూపుతున్నారు.  ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా  మలచుకునేందుకు కాపులకు మరింత దగ్గరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ కూడా  ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

By
en-us Political News

  
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.