Publish Date:Jul 15, 2022
ఇంజనీరింగ్ అద్బుతంగా, టీఆర్ఎస్ ప్రభుత్వ ఘన విజయంగా కేసీఆర్ ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వస్తున్న కాళేశ్వరం బండారం భారీ వర్షాలకు బట్టబయలైంది. చాలా కాలంగా కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరం అవినీతి మయం అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎమ్ అంటూ దుయ్యబడుతూనే ఉన్నారు. ఆ విమర్శలను, ఆరోపణలనూ ఇంత కాలం ఖండిస్తూ వచ్చిన టీఆర్ఎస్ ఇటీవలి వర్షాలకు కాళేశ్వరం పంప్ హౌస్ మునిగిపోయి నీటిని ఎత్తిపోయడానికి వీల్లేనంతగా ధ్వంసమవ్వడంతో ఇప్పుడు కేసీఆర్ సర్కార్ డిఫెన్స్ లో పడింది.
చాలా కాలంగా ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరు చెప్పి కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శిస్తూ వస్తున్న విపక్షాలు ఇప్పుుడు వారి విమర్శలకు మరింత పదును పెట్టాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు కేసీఆర్ అవినీతిని బ్లాక్ అండ్ వైట్ లో బయటపెట్టేశాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునిగిపోయి మరో మూడు నాలుగేళ్ల వరకూ ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాళేశ్వరం మునకకు ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతే కారణమని ధ్వజమెత్తారు. వరద ముంపులో బాధితులు అష్టకష్టాలూ పడుతున్నా రాష్ట్రం వారికి సహాయ సహకారాలందించే విషయంలో మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు.
కాంగ్రెస్ శ్రేణుులు వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గురువారం మీడియాలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైందనీ, బాధితులను ఆదుకునేందుకు వెంటనే తక్షణ సాయం కోసం కేంద్రానికి లేఖ రాయాలనీ డిమాండ్ చేశారు. వరద ప్రబావిత ప్రాంతాలలో తాను ఈ నెల 17న పర్యటిస్తానని రేవంత్ చెప్పారు.
అంతకు ముందు రాహుల్ చేపట్టనున్న భారత్ జోడో యాత్రపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ సర్కార్ దేశాన్ని మతాలు, కులాల వారీగా విభజించి విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 150 రోజుల పాటు 3600 కిలోమీటర్లు సాగే రాహుల్ గాంధీ జోడో యాత్ర మక్తల్ వద్ద తెలంగాణలో ప్రవేశించి జుక్కల్ మీదుగా నాందేడ్ కు వెళుతుందన్నారు.
రాహుల్ యాత్రను తెలంగాణలో బ్రహ్మాండంగా నిర్వహిస్తామని రేవంత్ అన్నారు. కేసీఆర్ ను విమర్శిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎందుకు ఆగ్రహం వస్తోందో ప్రజలు గ్రహించాలన్నారు. ఆ రెండూ పార్టీలూ కలిసే రాజకీయ డ్రామాలాడుతున్నాయన్నారు. బండి సంజయ్ కార్యక్రమం పెట్టుకున్న సమయంలోనే రేవంత్ కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించడమేమిటని బండి సంజయ్ విమర్శించడాన్ని రేవంత్ తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో క్రియాశీలంగా ఉందనీ, ఎవరి కోసమే కాంగ్రెస్ తన కార్యాచరణను ఆపదని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kaleswaram-pump-house-drown-with-heavy-rains-and-floods-25-139770.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.