షర్మిలకే జై కొట్టిన కడప ఓటరు

Publish Date:May 15, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించి, ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి కలిగిస్తున్నది కడప లోక్ సభ నియోజకవర్గం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె ఎంట్రీతో కడప లోక్ సభ నియోజకవర్గ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

గత రెండు ఎన్నికలలో అంటే 2014, 2019 ఎన్నికలలో వైసీపీ ఆధిపత్యం కొనసాగిన కడపలో షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగడంతో వైసీపీ ఆధిపత్యానికి భారీగా గండి పడింది. గత రెండు ఎన్నికలలో కూడా షర్మిల వైసీపీ విజయం కోసం శ్రమించారు. ప్రచారం చేశారు. ఆ రెండు ఎన్నికలలో వైఎస్ కుటుంబం ఏకతాటిపై నిలిచి వైసీపీకి అండగా నిలిచారు. అయితే ప్రస్తుతానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. వైఎస్ కుటుంబం మొత్తం షర్మిల వెనుక నిలబడింది. 

వీటన్నిటి కంటే ప్రధానంగా చెప్పుకోవలసింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య.   వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ అన్న జగన్ పై వార్ ప్రకటించిన షర్మిలకు, వివేకా కుమార్తె డాక్టర్ సునీత అండగా నిలిచారు. దీంతో కడప లోక్ సభ స్థానం నుంచి రెండు సార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ పై కన్నేసిన అవినాష్ రెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురౌతున్నాయి.  

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి.. షర్మిల విమర్శలు, ప్రశ్నల ధాటికి ఉక్కిరిబిక్కిరై.. వాటిని అడ్డుకునేందుకు  కడప కోర్టును ఆశ్రయించి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో షర్మిల సెంటిమెంట్ ను ఆశ్రయించారు. వైఎస్ బిడ్డను కొంగుచాచి అడుతున్నా అంటే ఓటర్లకు చేసిన అభ్యర్థన కడప వాసుల హృదయాలను నేరుగా తాకిందని విశ్లేషకులు అంటున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని అర్థం చేసుకున్న జగన్ చెల్లెలి చీర రంగును సైతం కామెంట్ చేస్తూ షర్మిల తెలుగుదేశం పలుకులు పలుకుతోందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కడపలో వైసీపీకి తీరని నష్టం చేకూర్చాయి. పార్టీలకు అతీతంగా షర్మిలకు మద్దతు వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నియోజవర్గంలో పోలింగ్ సరళిని నిశితంగా గమనించిన పరిశీలకులు కడప ఓటర్లు షర్మిలకే జై కొట్టారని విశ్లేషిస్తున్నారు. అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం ఓట్లు లోక్ సభ స్థానానికి వచ్చేసరికి షర్మిలకు, అసెంబ్లీ స్థానం వరకూ సొంత పార్టీకీ పడ్డాయని అంటున్నారు. అదే వాస్తవమైతే కడపలో షర్మిల విజయం నల్లేరు మీద బండినడకేనని చెబుతున్నారు. 

By
en-us Political News

  
సార్వత్రిక ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి వ్యక్తమౌతోంది. బాధ్యతగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆ ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే హక్కు ఉంటుంది.
పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ రాజధాని క్వెట్లా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 28 మంది మరణించారు.
అవినీతిని కూకటి వేళ్లతో పీకి వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అవినీతి చేపలను ఏరివేసే పనిలో నిమగ్నమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును బుధవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
సరిగ్గా వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఏదన్నది తేలిపోతుంది. వైసీపీ మరో సారి అధికారపగ్గాలు అందుకుంటుందా? లేక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న ఉత్కంఠకు వచ్చే నెల 4న తెరపడుతుంది.
ఎన్నికల ఫలితాలు వైసీపీ వాళ్ళకి బీపీ భారీగా పెంచే అవకాశం వుంది. హార్ట్ ఎటాక్‌లు ఎటాక్ అయ్యే ఛాన్సుంది. అధికారం, పదవులు పోతే పోయాయి.. కనీసం ప్రాణాలన్నా మిగలాలి కదా..  బతికుండే బలుసాకు తిని బతకొచ్చు
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజులూ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన దగ్గర్నుంచి ఆయన చేసిన హత్యలు, అన్ని వర్గాల వారి మీద చేసిన దాడులు, కబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు... వీటన్నిటినీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. పిన్నెల్లి బాహాటంగా చేసిన ఘోరాలలో కొన్నిటిని మాత్రమే ఈ పుస్తకంలో పబ్లిష్ చేశారు.
రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు, శాపనార్ధాలు సహజం. అయితే ఓటమి భయం తలకెక్కిన పార్టీ నేతలు మాత్రం ఆ విమర్శలు, తిట్లను సానుభూతిగా మార్చుకునేందుకు ప్రయత్నించడం కద్దు. అయితే ఆ ప్రయత్నంలో తాము ప్రత్యర్థులపై చేసిన విమర్శలను కన్వీనియెంట్ గా మరిచి పోతారు. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి ఆకాశాన్నంటిటే పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే అవినీతిని పాతాళంలో తొక్కేయడానికి పావులు కదుపుతోంది.
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం బుధవారం (మే 29) ఉదయం సీఎం చంద్రబాబు అన్న నినాదాలతో మారుమోగిపోయింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి కంపోజ్ చేయడంపై బీఆర్ఎస్ చేస్తున్న అనవసర రాద్ధాంతం ఇప్పటికే దిగజారిన ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత దిగజారుస్తోంది.
వారం రోజులు.. సరిగ్గా వారం రోజులు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి రాష్ట్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఏది అన్నది తేలిపోతుంది.
వైసీపీ ఆవిర్భావం నుంచి ఒక ఒరవడిలో వెడుతోంది. తన తప్పులు, తప్పిదాలు, తన దౌర్జన్యాలూ, దాష్టికాలూ అన్ని ప్రత్యర్థులపై నెట్టేసి చేతులు దులిపేసుకోవడమే ఆ ఒరవడి. విపక్షంలో ఉండగానూ అదే చేసింది. గత ఐదేళ్ల అధికారంలోనూ దానినే ఫాలో అయ్యింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.