బతకనేర్చిన తనమంటే ఇదేనా జూనియర్?

Publish Date:Sep 26, 2022

Advertisement

బతకనేర్చిన వాడు అనిపించుకోవడం చాలా సులువు. అయితే  ఆ మాట తిట్టుగానూ, పొగడ్తగానూ కూడా వాడుతుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను అందరూ బతకనేర్చినవాడుగా అభివర్ణిస్తున్నారు. సందర్భాన్ని బట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అందరూ అంటున్న ఈ మాట ఏ విధంగా చూసుకున్నా కితాబని అనుకోవడానికి లేదు. రాజకీయాలకు చాలా కాలం నుంచీ జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు.

ఎప్పుుడో 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథంపట్టారు. అన్నగారు ఎన్టీఆర్ మనవడిగా ఆయనను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు జనం ఎగబడ్డారు. ఆయన ప్రచారం బ్రహ్మాండంగా క్లిక్ అయ్యింది. కారణాలేమైతేనేం.. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలైంది. అంతే ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు కనీసం చూడను కూడా చూడలేదు. పూర్తిగా సినిమాలకే పరిమితమైపోయారు. సినిమాలలో బానే క్లిక్ అయ్యారు. ఎన్టీఆర్ మనవడిగా ఆయన సినీమా లాంఛ్ బ్రహ్మాండంగా జరిగింది. బాల రామాయణంలో రాముడిగా  మెరిసాడు. ఆ తరువాత కొంత  పెద్దయ్యాకా బ్లాక్ బస్టర్ లాంటి హిట్లతో స్టార్ హీరో హోదా సంపాదించుకున్నారు. ఆయన ఒక హీరో... ఆయన హీరోయిజం చూసే అనేక మంది ఎన్టీఆర్ కు వీరాభిమానులయ్యారు.

హీరోయిజం తెరకే పరిమితమైందా అన్న విమర్శలను ఇప్పుడు జూనియర్ ఎదుర్కొంటున్నారు. ఏ మనిషైనా సరే కూడలి వచ్చినప్పుడు అటో ఇటో ఎటో అటు నడవాలి. ఆ నడక నీ దారి ఏమిటన్నది  తేలుస్తుంది. అంతే కానీ అటూ ఇటూ కాకుండా గోడమీద బల్లిలా ఉండిపోతానంటే.. అది బతక నేర్చిన తనం అవుతుందేమో కానీ మనిషి తనం, ధీరోదాత్త గుణం అని ఎంత మాత్రం అనిపించుకోదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారూ వ్యతిరేకిస్తుంటే.. ఆయన మనవడిగా ఎన్టీఆర్ స్పందన గోడమీద పిల్లి వాటాన్నే స్ఫురింప చేసింది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఎన్టీఆర్ మనవడు అన్న హోదాతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో స్పందించిన తీరు అటూ ఇటూ కాని విధంగా ఉందనీ, తన తాత ద్వారా స్టార్ డమ్ వచ్చేసింది కనుక ఇప్పుడు తన తాత ఇమేజ్ ను మసకబార్చే యత్నాలు చేస్తున్న వారిని ఖండించి వారికి దూరమవ్వడం బతక నేర్చిన తనం కాదనుకున్నారా అన్నట్లు ఆయన స్పందన ఉంది.  

ఆయన స్పందన ఆయన హీరోయిజం కేవలం వెండితెరకే పరిమితం అని ఒ  తేటతెల్లం చేసేసింది. తాత గౌరవం కంటే.. తన సినీ కెరీర్ ను కాపాడుకోవడమే ఎన్టీఆర్ కు ముఖ్యమని తేలిపోయింది హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఎన్టీరామారావును , వైఎస్‌తో పోలుస్తూ జూనియర్ చేసిన ట్వీట్ వెనుక ఉన్నది జగన్  అని  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పును తప్పుపట్టేవారికి చెక్ అన్నట్లుగా  జగన్ సూచన మేరకు, జగన్ కు రాజకీయంగా ప్రయోజనం చేకూరేలా ఎన్టీఆర్ వ్యవహరించారన్న ఆరోపణలకు వెల్లువెత్తుతున్నాయి.  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో జూనియర్ స్పందనను సమర్ధిస్తున్న వారంతా వైసీపీ వర్గీయులే కావడమే ఇందుకు ప్రబల నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఎన్టీఆర్ స్పందనను తమ నిర్ణయానికి ప్రజా మద్దతుగా చూపించుకోవాలన్న వైసీపీ వ్యూహం ప్రకారమే ఇదంతా జరిగిందన్న విశ్లేషణలకు కూడా  వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ స్పందనను బలపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.  ఎన్టీఆర్-వైఎస్‌ను ఒకేగాట కట్టిన ఎన్టీఆర్ స్పందన పట్ల తెలుగుదేశం, ఎన్టీఆర్ అభిమానులే కాదు.. తెలుగు వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ప్రభావం ఆయన సినిమాల మీద కూడా పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. అంటు ఇప్పటికిప్పుడు బాయ్ కాట్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ హ్యాష్ టాగ్ క్యాంపెయిన్ ప్రారంభం కాకున్నా... సినిమా బాగోగులతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ మనవడు అన్న అభిమానంతో ఆయన సినిమాలకు మద్దతు తెలిపే పరిస్థితి ఇక ముందు ఎంత మాత్రం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  
సరే.. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ మార్పు వ్యవహారంలో, ఎన్టీఆర్-వైఎస్‌ను జూనియర్ ఒకే గాట కట్టడాన్ని  సోషల్‌మీడియాలో టీడీపీ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తోంది. రాజకీయ ఓనమాలు తెలియని జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఔన్నత్యాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. పేదవాడి అన్నం గిన్నెలా ప్రజల హృదయాలలో అనితర సాధ్యమైన సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న ఎన్టీఆర్ ఎవరికీ తలవంచని ధీరోదాత్తుడనీ, ఆయన మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రతి అడుగూ భయమే, ప్రతి మాటా భయమే అన్న రీతితో వ్యవహరిస్తున్నారనీ అంటున్నారు. జూనియర్ తన అనుంగు స్నేహితుడిగా చెప్పుకునే కొడాలి నాని అసెంబ్లీలో భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దీటుగా ఖండించడానికి కూడా భయపడిన సంగతిని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఆ తాత మనవడిని అంటూ అవకాశం వచ్చిన ప్రతి సారీ ప్రగల్బాలు పలికే జూనియర్.. ఆ తాత గౌరవాన్ని తగ్గించేలా ఆయన పేరు మీద ఉన్న హెల్త్ వర్సిటీ పేరు మారుస్తుంటే దీటుగా స్పందించడానికీ వెనుకాడిన విషయాన్ని ఎత్తి చూపుతూ  విమర్శలు సంధిస్తున్నారు.  అలాగే తన తాత పేరుమీద ఉన్న అన్న క్యాంటీన్లను రద్దు చేయడమే కాకుండా, ఆ పేరుతో క్యాంటీన్లు నడుపుతున్న వారిపై దాడిచేసి,వాటిని ధ్వంసం చేసిన పార్టీ నిర్ణయాన్ని సమర్ధించడమేమిటని నిలదీస్తున్నారు.    ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు  మార్పు వ్యవహారంలో జూనియర్  స్పందన ఆయనను ఎవరికీ కాకుండా చేసిందనడంలో సందేహం లేదు.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.