Publish Date:Jun 19, 2022
దారిన వెళుతూంటే హఠాత్తుగా ఎవరన్నా కిందపడితే పరుగున వెళ్లి లేవడానికి సాయం చేస్తాం. ఏదన్నా పిల్లో, కుక్కపిల్లో గాయ పడితే దాన్ని పక్కకు తీసికెళ్లి తెలిసిన చికిత్సా చేస్తాం లేదా వాటి యజమానికి అప్పజెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భా ల్లో మనకే గాయమయితే నోరులేని జీవాలు గదా అని వాటిని వదిలేసి దగ్గర్లో ఆస్పత్రికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడం జరుగుతుంది. తప్ప ఆ జీవాల యజమానితో గొడవ పడతామా? వాళ్లు పట్టించుకుంటారా? పట్టించుకున్నా కేవలం సారీ చెప్పి పంపించేస్తారు. అంతకన్నా మనమూ ఏమీ ఆశించం. కానీ అమీ సోమ్లిక్ అందుకు పూర్తి విరుద్ధంగా చేసింది.
ఆ మధ్య ఒకరోజు అనీ అలా షికారుగా వెళుతోంది. ఆమెకు ఓ కుక్క పిల్ల రోడ్డు పక్కనే వున్న కాలవలో పడిపోవడం చూసింది. అంతే ఆమె పరుగున వెళ్లి దాన్ని పట్టుకుని గట్టు మీదకి లాగింది. కుక్క పిల్ల అలా బతికిపోయింది. ఈ క్రమంలో అనీకి గాయాల య్యాయి. కానీ ఆమె దగ్గరలో వున్న ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడంతోనే ఆగలేదు. తను ఎంతో కష్టపడి ఆ కుక్కపిల్లను రక్షించానని, తానూ గాయపడినందుకు ఆ కుక్కపిల్ల యజమాని తన ఖర్చుల డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసింది. తీరా చూస్తే ఆయన ఆమె పక్కింటి వాడే! అయినా సరే తనకు ఖర్చలకింద డబ్బు చెల్లించాల్సిందేనని మొండి కేసింది. కుక్కపిల్లను రక్షించినందుకు ఎంతో థాంక్స్. నీ సేవకు నేను మెచ్చుకుంటున్నానని ఆయన చాలా స్నేహపూర్వకంగానే చెప్పాడు. కానీ అనీ అదేమీ పట్టించుకోలేదు. ఆయనకూ కోపం వచ్చింది. తిట్ట లేదు గానీ ఐదు పైసలిచ్చేది లేదని తెగేసి చెప్పేడు.
అమీకి అంతులేని కోపం వచ్చి కోర్టుకెళ్లింది. మా పక్కింటాయన కుక్కపిల్లను కాలవలో పడి చావకుండా కాపాడాను. ఆ సమయంలో ఎంతో గాయపడ్డాను. అందుకు తగిన ఖర్చులు ఇప్పించాలని కోరింది. కోర్టులో అంతా ఘొల్లున నవ్వారు. జడ్జి గారికీ నవ్వు ఆగలేదు. పొట్టచెక్కలయ్యేలా నవ్వేడాయన! ఏమమ్మా ఏం డిమాండ్ చేస్తున్నావో అర్ధమవుతోందా? అని ప్రశ్నిం చాడాయన. మీరు సరిగానే విన్నారు, నేను అడిగింది అర్ధవంతమయినదే కుక్కపిల్ల యజమాని నుంచి నాకు నష్టపరిహారం ఇప్పించండి అని మళ్లీ కోర్టులో అందరూ వినేలా అరిచి మరీ చెప్పింది. మళ్లీ కోర్టంతా గొల్లున నవ్వారు. ఇలా చిన్న చిన్నవాటికి కోర్టు మెట్లు ఎక్కకూడదు. నువ్వు ఆ మూగజీవి పట్ల ఎంతో ప్రేమతో మంచి పనే చేశావు, దాన్ని చావకుండా బతికించేవు అందు కు కోర్టు నిన్ను మంచి సిటజన్గా అభినందిస్తున్నది అన్నాడాయన.
కానీ అమీ మాత్రం మొండికేసింది. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నప్పుడు గాయపడినవారికి నస్టపరిహారం ఇప్పిస్తుంటారు గదా మరి ఈ కేసులో నాకు నష్ట పరిహారం ఇవ్వడానికి ఎందుకు కాదంటున్నారని కోర్టును అమీ నిలదీసింది. ఇది కేవలం మూగజీవుల రక్షణ విషయంలో నిన్ను అభినందించడం తప్ప ఆ యజమానిని కోర్టుకు ఈడ్చడానికి కుదరదని తేల్చి చెప్పింది. ఇలాంటి అర్ధంలేని వాదనలు చేయవద్దని హెచ్చరించింది. నీకు గాయమయింది. అందుకు కుక్కపిల్ల యజమానితో మాట్లాడి నీవే ఆయన నుంచి ఏదయినా పొందవచ్చుగాని ఇలా కోర్టుకు ఎక్కడంలో అర్ధంలేదని జడ్జి కేసును కొట్టేసి ఆమెను మందలించి పంపించేసేరు. ఇది న్యూజెర్సీ వాసులు చాలారోజులు గుర్తు తెచ్చుకుంటూ సరదాగా నవ్వుకుంటారేమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/judge-cint-stop-laughing-in-that-case-39-137969.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.