Publish Date:Jun 19, 2022
దారిన వెళుతూంటే హఠాత్తుగా ఎవరన్నా కిందపడితే పరుగున వెళ్లి లేవడానికి సాయం చేస్తాం. ఏదన్నా పిల్లో, కుక్కపిల్లో గాయ పడితే దాన్ని పక్కకు తీసికెళ్లి తెలిసిన చికిత్సా చేస్తాం లేదా వాటి యజమానికి అప్పజెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భా ల్లో మనకే గాయమయితే నోరులేని జీవాలు గదా అని వాటిని వదిలేసి దగ్గర్లో ఆస్పత్రికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడం జరుగుతుంది. తప్ప ఆ జీవాల యజమానితో గొడవ పడతామా? వాళ్లు పట్టించుకుంటారా? పట్టించుకున్నా కేవలం సారీ చెప్పి పంపించేస్తారు. అంతకన్నా మనమూ ఏమీ ఆశించం. కానీ అమీ సోమ్లిక్ అందుకు పూర్తి విరుద్ధంగా చేసింది.
ఆ మధ్య ఒకరోజు అనీ అలా షికారుగా వెళుతోంది. ఆమెకు ఓ కుక్క పిల్ల రోడ్డు పక్కనే వున్న కాలవలో పడిపోవడం చూసింది. అంతే ఆమె పరుగున వెళ్లి దాన్ని పట్టుకుని గట్టు మీదకి లాగింది. కుక్క పిల్ల అలా బతికిపోయింది. ఈ క్రమంలో అనీకి గాయాల య్యాయి. కానీ ఆమె దగ్గరలో వున్న ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడంతోనే ఆగలేదు. తను ఎంతో కష్టపడి ఆ కుక్కపిల్లను రక్షించానని, తానూ గాయపడినందుకు ఆ కుక్కపిల్ల యజమాని తన ఖర్చుల డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసింది. తీరా చూస్తే ఆయన ఆమె పక్కింటి వాడే! అయినా సరే తనకు ఖర్చలకింద డబ్బు చెల్లించాల్సిందేనని మొండి కేసింది. కుక్కపిల్లను రక్షించినందుకు ఎంతో థాంక్స్. నీ సేవకు నేను మెచ్చుకుంటున్నానని ఆయన చాలా స్నేహపూర్వకంగానే చెప్పాడు. కానీ అనీ అదేమీ పట్టించుకోలేదు. ఆయనకూ కోపం వచ్చింది. తిట్ట లేదు గానీ ఐదు పైసలిచ్చేది లేదని తెగేసి చెప్పేడు.
అమీకి అంతులేని కోపం వచ్చి కోర్టుకెళ్లింది. మా పక్కింటాయన కుక్కపిల్లను కాలవలో పడి చావకుండా కాపాడాను. ఆ సమయంలో ఎంతో గాయపడ్డాను. అందుకు తగిన ఖర్చులు ఇప్పించాలని కోరింది. కోర్టులో అంతా ఘొల్లున నవ్వారు. జడ్జి గారికీ నవ్వు ఆగలేదు. పొట్టచెక్కలయ్యేలా నవ్వేడాయన! ఏమమ్మా ఏం డిమాండ్ చేస్తున్నావో అర్ధమవుతోందా? అని ప్రశ్నిం చాడాయన. మీరు సరిగానే విన్నారు, నేను అడిగింది అర్ధవంతమయినదే కుక్కపిల్ల యజమాని నుంచి నాకు నష్టపరిహారం ఇప్పించండి అని మళ్లీ కోర్టులో అందరూ వినేలా అరిచి మరీ చెప్పింది. మళ్లీ కోర్టంతా గొల్లున నవ్వారు. ఇలా చిన్న చిన్నవాటికి కోర్టు మెట్లు ఎక్కకూడదు. నువ్వు ఆ మూగజీవి పట్ల ఎంతో ప్రేమతో మంచి పనే చేశావు, దాన్ని చావకుండా బతికించేవు అందు కు కోర్టు నిన్ను మంచి సిటజన్గా అభినందిస్తున్నది అన్నాడాయన.
కానీ అమీ మాత్రం మొండికేసింది. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నప్పుడు గాయపడినవారికి నస్టపరిహారం ఇప్పిస్తుంటారు గదా మరి ఈ కేసులో నాకు నష్ట పరిహారం ఇవ్వడానికి ఎందుకు కాదంటున్నారని కోర్టును అమీ నిలదీసింది. ఇది కేవలం మూగజీవుల రక్షణ విషయంలో నిన్ను అభినందించడం తప్ప ఆ యజమానిని కోర్టుకు ఈడ్చడానికి కుదరదని తేల్చి చెప్పింది. ఇలాంటి అర్ధంలేని వాదనలు చేయవద్దని హెచ్చరించింది. నీకు గాయమయింది. అందుకు కుక్కపిల్ల యజమానితో మాట్లాడి నీవే ఆయన నుంచి ఏదయినా పొందవచ్చుగాని ఇలా కోర్టుకు ఎక్కడంలో అర్ధంలేదని జడ్జి కేసును కొట్టేసి ఆమెను మందలించి పంపించేసేరు. ఇది న్యూజెర్సీ వాసులు చాలారోజులు గుర్తు తెచ్చుకుంటూ సరదాగా నవ్వుకుంటారేమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/judge-cint-stop-laughing-in-that-case-39-137969.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో యూనిట్ ఇంఛార్జ్లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.