Publish Date:Jun 19, 2022
చదువుకునే పిల్లలకు కావలసినవి సమకూర్చనపుడు ప్రభుత్వాలెందుకు? ఇప్పుడు అంతటా వినపడుతోన్న ప్రశ్న ఇదే.
బాసర ట్రిపుల్ఐటిలో అనేక సమస్యల పరిష్కారం గురించి విద్యార్ధులు అనేక రోజులుగా గోడు పెడుతున్నారు. వైస్ ఛాన్సలర్ లేకపోవడం, లైబ్రరీలో పుస్తకాలు లేకపోవడం .. ఇలా అనేకం. వాటికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కావలసినవి సమకూర్చడంలో విఫలమయింది.
తెలంగాణాలో విద్యార్ధిలోకం కూడా పూనుకుంటేనే రాష్ట్రం ఏర్పడిందన్నది టిఆర్ ఎస్ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయింది. కాకున్నా, విద్యర్దులు కాకమ్మ కోరికలేమీ కోరడం లేదు. మౌలిక సదుపాయాల గురించి తలెత్తిన సమస్యలు పరిష్కరించమనే గోడు పెడుతున్నారు. వాటని అవేమీ పెద్ద అంశాలు కానట్టు, అసలు వారి గోలను పెద్దగా పట్టించుకోన వసరం లేనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకే తీవ్రస్థాయిలో విద్యార్ధులు మండి పడి భారీ నినాదాలతో ముఖ్యమంత్రికి, విద్యా శాఖ మంత్రికి బాసర ట్రిపుల్ ఐటిలో పరిస్థితులు బాగా తెలిసేలా బాగా వినిపించేలా ఉద్యమి స్తున్నారు. కానీ విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిగారికి వారి పరిస్థితులు, సమస్యలు చాలా చిన్నవిగా కనపడటమే విడ్డూరం.
ముఖ్యమంత్రితో సంప్రదించి వెంటనే వారి సమస్యలు పరిష్కరించాల్సిందిబోయి అవి చిన్న సమస్యలే, వాటి గురించి ఆందోళనకు దిగడం మంచిది కాదు, ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా చేయరాదని మంత్రిగారు ఒక లేఖలో విద్యార్ధులను కోరడంలో అర్ధ మేమిటో మంత్రి గారే సెలవియ్యాలి. అంతే కాకుండా బాసర ట్రిపుల్ఐటీ అన్న విషయమే విద్యామంత్రి సబిత గారికి తెలియదు. అందుకే కాబోలు బాసర ఐఐటి అని ప్రస్తావించారు. బాసరలో వున్నది ఐఐటి కాదు త్రిబుల్ ఐటి! ఈ విషయాన్ని కూడా విస్మరించారు. మొన్నటివరకూ ఎంతో ప్రతిష్టాత్మకమయినది,
ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎంతో పేరు తెస్తున్న సంస్థ అంటూ పొగిడినవారే విద్యా ర్ధుల మౌలిక వస తుల గురించి పట్టించుకొనకుండా కేవలం రాజకీయ ప్రసంగాలతో మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడంలో అర్ధమే మిటని విద్యార్ధి లోకం ప్రశ్నిస్తోంది. ఐఐఐటికి శాశ్వత వైస్ ఛాన్సలర్ను నియమించడానికి మీనమేషాలు లెక్కించడాన్ని రాజకీయ దురుద్దేశం గానే తీసుకోవాలా? ఎందుకు ఇంత నిర్లక్ష్యమని అడుగుతున్నారు. తల్లిలా తాను చెబుతున్న మాటలు విద్యా ర్ధులు చెవికెక్కిం చుకోని ఉద్యమించడం ఆపేయాలని అడుగుతున్న మంత్రి మరి ఇన్ని రోజులు తన బిడ్డలవంటి విద్యార్ధుల గోడు వినడానికి సమయం ఇవ్వకపోవడమేమిటి? విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వాలు కలకాలం నిలవవు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పటికైనా తెలంగాణా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారనే ఆశిద్దాం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/basara-tripleit-not-iit-39-137972.html
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.