Publish Date:Jun 19, 2022
దారిన వెళుతూంటే హఠాత్తుగా ఎవరన్నా కిందపడితే పరుగున వెళ్లి లేవడానికి సాయం చేస్తాం. ఏదన్నా పిల్లో, కుక్కపిల్లో గాయ పడితే దాన్ని పక్కకు తీసికెళ్లి తెలిసిన చికిత్సా చేస్తాం లేదా వాటి యజమానికి అప్పజెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భా ల్లో మనకే గాయమయితే నోరులేని జీవాలు గదా అని వాటిని వదిలేసి దగ్గర్లో ఆస్పత్రికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడం జరుగుతుంది. తప్ప ఆ జీవాల యజమానితో గొడవ పడతామా? వాళ్లు పట్టించుకుంటారా? పట్టించుకున్నా కేవలం సారీ చెప్పి పంపించేస్తారు. అంతకన్నా మనమూ ఏమీ ఆశించం. కానీ అమీ సోమ్లిక్ అందుకు పూర్తి విరుద్ధంగా చేసింది.
ఆ మధ్య ఒకరోజు అనీ అలా షికారుగా వెళుతోంది. ఆమెకు ఓ కుక్క పిల్ల రోడ్డు పక్కనే వున్న కాలవలో పడిపోవడం చూసింది. అంతే ఆమె పరుగున వెళ్లి దాన్ని పట్టుకుని గట్టు మీదకి లాగింది. కుక్క పిల్ల అలా బతికిపోయింది. ఈ క్రమంలో అనీకి గాయాల య్యాయి. కానీ ఆమె దగ్గరలో వున్న ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడంతోనే ఆగలేదు. తను ఎంతో కష్టపడి ఆ కుక్కపిల్లను రక్షించానని, తానూ గాయపడినందుకు ఆ కుక్కపిల్ల యజమాని తన ఖర్చుల డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసింది. తీరా చూస్తే ఆయన ఆమె పక్కింటి వాడే! అయినా సరే తనకు ఖర్చలకింద డబ్బు చెల్లించాల్సిందేనని మొండి కేసింది. కుక్కపిల్లను రక్షించినందుకు ఎంతో థాంక్స్. నీ సేవకు నేను మెచ్చుకుంటున్నానని ఆయన చాలా స్నేహపూర్వకంగానే చెప్పాడు. కానీ అనీ అదేమీ పట్టించుకోలేదు. ఆయనకూ కోపం వచ్చింది. తిట్ట లేదు గానీ ఐదు పైసలిచ్చేది లేదని తెగేసి చెప్పేడు.
అమీకి అంతులేని కోపం వచ్చి కోర్టుకెళ్లింది. మా పక్కింటాయన కుక్కపిల్లను కాలవలో పడి చావకుండా కాపాడాను. ఆ సమయంలో ఎంతో గాయపడ్డాను. అందుకు తగిన ఖర్చులు ఇప్పించాలని కోరింది. కోర్టులో అంతా ఘొల్లున నవ్వారు. జడ్జి గారికీ నవ్వు ఆగలేదు. పొట్టచెక్కలయ్యేలా నవ్వేడాయన! ఏమమ్మా ఏం డిమాండ్ చేస్తున్నావో అర్ధమవుతోందా? అని ప్రశ్నిం చాడాయన. మీరు సరిగానే విన్నారు, నేను అడిగింది అర్ధవంతమయినదే కుక్కపిల్ల యజమాని నుంచి నాకు నష్టపరిహారం ఇప్పించండి అని మళ్లీ కోర్టులో అందరూ వినేలా అరిచి మరీ చెప్పింది. మళ్లీ కోర్టంతా గొల్లున నవ్వారు. ఇలా చిన్న చిన్నవాటికి కోర్టు మెట్లు ఎక్కకూడదు. నువ్వు ఆ మూగజీవి పట్ల ఎంతో ప్రేమతో మంచి పనే చేశావు, దాన్ని చావకుండా బతికించేవు అందు కు కోర్టు నిన్ను మంచి సిటజన్గా అభినందిస్తున్నది అన్నాడాయన.
కానీ అమీ మాత్రం మొండికేసింది. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నప్పుడు గాయపడినవారికి నస్టపరిహారం ఇప్పిస్తుంటారు గదా మరి ఈ కేసులో నాకు నష్ట పరిహారం ఇవ్వడానికి ఎందుకు కాదంటున్నారని కోర్టును అమీ నిలదీసింది. ఇది కేవలం మూగజీవుల రక్షణ విషయంలో నిన్ను అభినందించడం తప్ప ఆ యజమానిని కోర్టుకు ఈడ్చడానికి కుదరదని తేల్చి చెప్పింది. ఇలాంటి అర్ధంలేని వాదనలు చేయవద్దని హెచ్చరించింది. నీకు గాయమయింది. అందుకు కుక్కపిల్ల యజమానితో మాట్లాడి నీవే ఆయన నుంచి ఏదయినా పొందవచ్చుగాని ఇలా కోర్టుకు ఎక్కడంలో అర్ధంలేదని జడ్జి కేసును కొట్టేసి ఆమెను మందలించి పంపించేసేరు. ఇది న్యూజెర్సీ వాసులు చాలారోజులు గుర్తు తెచ్చుకుంటూ సరదాగా నవ్వుకుంటారేమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/judge-cint-stop-laughing-in-that-case-25-137970.html
Publish Date:Apr 10, 2026
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.