జూబ్లీహిల్స్ ‘రిచ్ కిడ్స్ ట్రాప్’లో మరో ఇద్దరి అరెస్ట్..!

Publish Date:Aug 11, 2026

Advertisement

 

సోషల్ మీడియాలో పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. వ్యక్తిగత వివరాల సేకరణ.. చివరకు బ్లాక్‌మెయిల్! హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ ‘రిచ్ కిడ్స్ ట్రాప్’ కేసులో దర్యాప్తులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్ చేయడంతో కేసు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. హఫీజ్‌పేటకు చెందిన కోడూరి మీనా కుమారి, విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వినీల్ చౌదరి అలియాస్ వినీల్ బాబు పోలీసులకు చిక్కారు. జూబ్లీహిల్స్‌లో మొదలైన పోలీసుల వేట.. చివరకు రాజస్థాన్‌లోని జైపూర్ వరకు సాగింది. బందర్సెంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరినీ అదుపులోకి తీసు కున్న పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

ఈ వ్యవహారంలో నిందితు లందరూ సోషల్ మీడియా నే ప్రధాన ఆయుధంగా ఉపయోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలికలు, యువతులను సోషల్ మీడియా ద్వారా పరిచ యాలు పెంచుకుని.. వారి కుటుంబ నేపథ్యం, వ్యక్తి గత వివరాలు, ఇతర సమాచారాన్ని సేకరించి నట్లు తెలుస్తోంది. పరిచ యం పెరిగిన తర్వాత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, అదే సమాచారంతో వారిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి గా పేర్కొంటున్న కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలి యాస్ అర్జున్‌తో పాటు పలువురిని పోలీసులు జూన్‌లోనే అరెస్ట్ చేశారు. అప్పట్లో మీనాకుమారి, వినీల్ చౌదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకు న్నప్పటికీ వారిని రిమాండ్‌కు పంపలేదు.

కానీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ పోలీసుల చేతికి మరిన్ని ఆధారాలు చిక్కాయి. దీంతో ఇద్దరినీ మరోసారి అరెస్ట్ చేసేం దుకు పోలీసులు ప్రయ త్నించగా.. అప్పటికే వారు పరారైనట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు నింది తుల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు. వారి ఆచూకీపై సమాచారం సేకరించి హైదరాబాద్‌ నుంచి రాజస్థాన్ వరకు వేట కొనసాగించారు. చివరకు జైపూర్‌లోని బందర్సెంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరి ఆచూకీ లభించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 

మీనాకు మారి, వినీల్ చౌదరి అరెస్ట్‌తో కేసు దర్యాప్తు మరో కీలక మలుపు తిరిగింది. ఈ ట్రాప్ వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ఎంతమంది బాలికలు, యువతులు బాధితులుగా మారారు? సోషల్ మీడియా ద్వారా ఎలా వల వేశారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేసినట్లు సమాచారం. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో మొదలైన పరిచయం.. చివరకు పోలీసుల వెంటాడే స్థాయికి వెళ్లిన ఈ వ్యవహారంలో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Jubilee Hills Rich Kids Trap, Social media, Vinyl Chowdhury, Arjun, Crime news, CP Sajjanar, Koduri Meena Kumari

By
en-us Political News

  
ఓటర్ల జాబితా పునఃపరిశీలన సమయంలో ఎన్నికల సిబ్బంది ఆయన పేర్కొన్న చిరునామాకు వెళ్లి విచారణ జరిపారు. ఆ సందర్భంగా సదరు అపార్ట్‌మెంట్‌లో ప్రకాష్ రాజ్ గడచిన నాలుగు సంవత్సరాలుగా నివసించడం తేలింది. నివాసం ఉండని వ్యక్తి పేరును ఆ ప్రాంత ఓటర్ల జాబితాలో కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. అధికారులు ఆయన పేరును చిరునామా మారిన ఓటర్ల కేటగిరీ కింద వర్గీకరించారు.
అధికారుల వేధింపులు, పని ఒత్తిళ్లే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ ఆశా వర్కర్ చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర ఘర్షణలకు, ప్రెస్ మీట్ల విమర్శలు-ప్రతివిమర్శలకు వేదికగా మారిన ముఖ్యమైన అంశాల్లో మెగా డీఎస్సీ ఒకటి..
సూర్యగ్రహణం వేళ కరెంట్ వాడకం తగ్గించిన వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆక్టోపస్ ఎనర్జీ ఆఫర్ ప్రకటించింది. సోలార్ పవర్ కొరత, గ్రిడ్ భద్రత మరియు నిపుణుల విశ్లేషణల పూర్తి వివరాలు ఇవే!
ప్రయాణాల్లో లేదా ఎక్కడైనా సులభంగా, అత్యంత ఉత్పాదకంగా పనిచేసేందుకు అవసరమైన బెస్ట్ రిమోట్ వర్కింగ్ గ్యాడ్జెట్లు, ల్యాప్‌టాప్ స్టాండ్‌లు, నోయిస్ కాన్సెలేషన్ హెడ్‌ఫోన్లు మరియు పవర్ బ్యాంక్స్ వివరాలు తెలుసుకోండి.
న్యూయార్క్‌ను ఊపేసిన రష్యన్ స్లీపర్ ఏజెంట్ ఆన్నా చాప్‌మ్యాన్ సంచలన నిజాలు తెలుసుకోండి. ఎఫ్‌బీఐ ఆపరేషన్ గోస్ట్ స్టోరీస్ నుండి ఛానల్ 4 డాక్యుమెంటరీ వరకు పూర్తి థ్రిల్లింగ్ వివరాలు ఇక్కడ చదవండి.
ఒక రూపాయి యూపీఐ చెల్లింపు వెనుక అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఏటా ₹20,000 కోట్ల వ్యయం, ప్రతి లావాదేవీకి 83 పైసల ఖర్చు మరియు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు వివరాలు మీకోసం.
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు మరియు మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి గల ముఖ్యమైన కారణాలు, రంగాలవారీ పనితీరు మరియు మార్కెట్ విశ్లేషణను వివరంగా తెలుసుకోండి.
టీసీఎస్, హెచ్‌సీఎల్ కంపెనీలపై సైబర్ దాడి ముప్పు వార్తల వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకోండి. స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఐటీ దిగ్గజాలు ఇచ్చిన స్పష్టత, 4 ఏళ్ల నాటి డేటా లీక్ వివరాలు మరియు చైనా, పాకిస్థాన్ల సైబర్ దాడుల నివేదికల పూర్తి విశ్లేషణ.
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఆర్డీ ఇండస్ట్రీస్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో దాదాపు 39 శాతం భారీ ప్రీమియంతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. 139 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన ఈ రీసైక్లింగ్ కంపెనీ ఐపీఓ వివరాలు, లిస్టింగ్ ధర మరియు ఆర్థిక వృద్ధి సమాచారం కోసం ఇప్పుడే చదవండి.
సింక్విఫీల్డ్ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించారు. ప్రపంచ ఛాలెంజర్ జావోఖిర్ సిందరోవ్‌ను 95 ఎత్తుల పోరులో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన సుదీర్ఘకాల ప్రేమికురాలు జార్జినా రోడ్రిగెజ్‌ను పోర్చుగల్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. 2017లో షాపింగ్ మాల్‌లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం, పెళ్లి పీటల వరకు ఎలా సాగిందో తెలుసుకోవడానికి ఈ వెబ్ స్టోరీ చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.