జూబ్లీలో గెలవాలి ..ఎలా అందరి నోట అదే మాట

Publish Date:Jun 27, 2025

Advertisement

 

గెలవాలి .. గెలిచి తీరాలి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా అభ్యర్ధి ఎవరైనా,  కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి ... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ పార్టీ నాయకులకు ఇచ్చిన ఆదేశం, కాదంటే చేసిన సూచన ఇది. అవును, ఇటీవల జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో మీనాక్షీ నటరాజన్ జూబ్లీ ఉప ఎన్నిక పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. నగర నేతలందరినీ సమీకరించి, శక్తి యుక్తులు అన్నిటినీ జోడించి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు.

అలాగే అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా, కాంగ్రెస్ నాయకులు కసరత్తు ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ అయితే ఇప్పటికే టికెట్ తనకే అని, తానే అభ్యర్ధినని  ప్రకటించుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడ, అజారుద్దీన్ గత ఎన్నికల్లో పోటీ చేశారు, కాబట్టి, మరోసారి టికెట్ ఆశించడంలో తప్పులేదు కానీ, చివరకు అభ్యర్ధి ఎవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. మరో వంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అభ్యర్థి ఎంపికకు సంబంధించి, ఎవరూ మాట్లాడవద్దని హుకుం జారీ చేశారు.

నాయకుల నోళ్లకు తాళాలు వేశారు. అయితే, ఇప్పటికే, అజారురుద్దీన్, గతంలో ఎంఐఎం టికెట్ ఫై పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్ సహా మరో ఇద్దరు ముగ్గురు,ముఖ్య నేఅల వారసులు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంఐఎం మద్దతు విషయం తేలితేనే కానీ, కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనేది తేలదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా వుంది. అయితే, ముస్లిమేతర (నాన్ ముస్లిం) అభ్యర్ధిని బరిలో దించితేనే, ఎంఐఎం మద్దతు ఉంటుందని, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ షరతు విధించినట్లు చెపుతున్నారు. నియోజక వర్గంలో ముస్లిం ఓటు బ్యాంక్ లక్షకు పైగా ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే, ఎంఐఎం మద్దతు అనివార్యమని భావిస్తోంది. సో .. ఒవైసీ షరతుకు కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించక తప్పదని అంటున్నారు. 

వరసగా మూడు సార్లు ఓడిపోయినా నియోజక వర్గంలో ఒంటరిగా పోటీ చేసే సాహసం కాంగ్రస్ చేయక పోవచ్చని సో ..తొందరపడి ముందుగానే  కర్చీఫ్ వేసిన అజారుద్దీన్‌కు మొండి చేయి తప్పక పోవచ్చని అంటున్నారు. అదెలా ఉన్నా, హస్తం పార్టీ జూబ్లీ సీటు మీద చాలా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఓ వంక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్, మరో వంక పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్, ఇంచుమించుగా ప్రతి రోజు ఎంతో కొంత సమయాన్ని జూబ్లీ ఉప ఎన్నికకు కేటాయిస్తున్నారు. సందర్భంతో సంబంధం ఉన్న లేకున్నా ఉప ఎన్నిక ప్రస్తావన చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, రాష్ట్రరాజధానిలోనూ ‘జీరో’ కు పరిమితమైన నేపధ్యంలో, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ వరసగా మూడు సార్లు సింగిల్ సీటు కూడా గెలవలేదు. ఉప ఎన్నికల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశ పడుతోంది. ఇప్పటికే ఉపఎన్నికల్లో ఒక సీటు (కంటోన్మెంట్) గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ 

జూబ్లీని తమ ఖాతాలో చేర్చుకోవాలని ఆశ పడుతోందని అంటున్నారు. అయితే, జూబ్లీలో కాంగ్రెస్ గెలుపు సాధ్యమేనా అంటే, అప్పుడే ఒక అంచనాకు రావడం కుదరదు కానీ, కాంగ్రెస్ పార్టీ జూబ్లీలో పాగా వేయడం అంత ఈజీ కాదాని పరిశీలకులు అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీకే కాదు, బీఆర్ఎస్, బీజేపీలు సహా, ఏ పార్టీకి కూడా జూబ్లీ అంత ఈజీ’ గా చిక్కే సీటు కాదని అంటున్నారు.   కాంగ్రెస్ కథ అలా ఉంటె, బీఆర్ఎస్’ తమ పార్టీ  సిట్టింగ్ ఎమ్మెల్యే,మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన సీటును ఎలా అయినా నిలబెట్టులోవాలని ఆశ పడుతోంది. ముఖ్యంగా, గులాబీ బాస్, కేసీఆర్ కూడా మీనాక్షీ నటరాజన్’ కంటే ఎక్కువగా జూబ్లీ గెలిచి తీరాలన పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. అంతేకాకుండా మాగంటి ఫ్యామిలీ నుంచే అభ్యర్ధిని నిలబెట్టాలని కేసీఆర్ మొదటి నుంచి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. 

నిజానికి బీఆర్ఎస్ టికెట్ కోసం మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, విష్ణువర్ధన్  రెడ్డి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డితో పాటుగా, మరి కొందరుపోటీ పడుతున్నారు. అయితే, చివరకు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి, మాగంటి సునీత బరిలో దిగడం ఖాయమని అంటున్నారు. నిజానికి మొదట్లో పోటీకి ఆమె అంత సుముఖంగా లేక పోయినా ఇప్పడు మనసు మార్చుకున్నారని, పార్టీ వర్గాల సమాచారం. నిజానికి, ఇంతవరకు రాజకీయాలకు దూరంగా ఉన్న మాగంటి సునీత, ఇటీవల  చనిపోయిన, బొరబండ డివిజన్’ బీఆర్ఎస్ మైనారిటీ సెల్’ అధ్యక్షుడు మహమ్ముద్ సర్దార్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకులు, దాసోజు శ్రవణ్, విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి’తదితర నాయకులతో కలిసి పరామర్శించారు. 

దీంతో,ఆమె క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టడం, ఉప ఎన్నికల్లోపోటీ చేయడం ఖాయమని అంటున్నారు. జూబ్లీ ఉపఎన్నిక బరిలో నిలిచేందుకు కమలం పార్టీ కూడా సిద్దమవుతోంది. కాగా, గత  ఎన్నికల్లో  పోటీచేసి ఓడిపోయిన లంక దీపక్ రెడ్డి, మహిళా నాయకురాలు కీర్తి రెడ్డి, ఎన్వీ సుభాష్.. మరో కార్పొరేటర్ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఇంతవరకు మూడు నాలుగు స్థానాలు పరిమితమైన బీజేపీ, ఉప ఎన్నికల్లోనూ ఆటలో అరటి పండుగా మిగులుతుందని అంటున్నారు. ఏమైనా, జూబ్లీ ఉప ఎన్నిక, సిటీ రాజకీయాలలోనే కాదు రాష్ట్ర రాజకీయల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అలాగే,జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయలపైనా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.