రామయ్యా.. రావాల్సిన అవసరం లేదయ్యా!

Publish Date:May 10, 2024

Advertisement

వేమన శతకం, సుమతీ శతకం తరహాలోనే భాస్కర శతకం కూడా వుంది. మారవి వెంకయ్య కవి 16వ శతాబ్దంలో ఈ శతకాన్ని రచించాడు. ఈ శతకంలోని ఒక పద్యం ఇలా చెబుతుంది...

దానముఁ జేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్
దానె పలాయనంబగుట తథ్యము; బూరుగు మ్రాను గాచినన్,
దాని ఫలంబులూరక వృథాపడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁగాక, యభోజ్యములౌట భాస్కరా!  

ఈ పద్యం అర్థం ఏమిటంటే, దానం చేయడం చేతగాని ధనికుడికి ఎంత సంపద వుండి ఏం లాభం? అడవిలో బూరుగుచెట్టు విరగ కాస్తుంది. కానీ, దాని కాయలు ఎవరికీ ఉపయోగపడవు. దాని కాయలు పగిలిపోయి దాంట్లో వున్న దూది మొత్తం గాలిలోకి ఎగిరి ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది.

ఈ పద్యం తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్‌కి వున్న జనాకర్షణ అడవిలో పుట్టిన బూరుగ చెట్టు మాదిరిగా అయిపోయింది. ఆయన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎంతమాత్రం ఉపయోగపడకుండా వృధా అయిపోయింది. అకారణంగా తెలుగుదేశం పార్టీ మీద అలిగిన జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా వుంటున్నారు. పార్టీకి దూరంగా వుండటమే కాకుండా, కొడాలి నాని లాంటి వ్యక్తులకు అండగా నిలిచి, వాళ్ళ నోరు ఎంత మాట అయినా అనడానికి ధైర్యం ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశం కావచ్చు, ఆయన సన్నిహితుల ఉద్దేశం కావచ్చు.. తెలుగుదేశం పార్టీని అర్జెంటుగా జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెట్టేయాలి. తెలుగుదేశం పార్టీలో అన్ని విషయాలూ జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించే జరగాలి. అలాంటి అవకాశం లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారు.

2019 ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయకుండా దూరంగా వున్నారు. ఏ నిమిషంలోనైనా అతని మనసు మారి ప్రచారానికి వస్తారేమోనని తెలుగుదేశం వర్గాలు ఎదురుచూశాయి. తమవంతు ప్రయత్నాలు చేశాయి. అయినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడం కూడా ఒక కారణం అని అనుకుంటూ ఆయన అభిమానులు ఆనందిస్తూ వుంటారు.. అది వేరే విషయం! ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం మాత్రమే కాకుండా, చంద్రబాబును విమర్శించడానికి నేనున్నానంటూ ముందుకు వస్తూ వుంటారు. దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఆమోదం లేదని ఎవరూ అనుకోరు.

ఈసారి ఎన్నికలలో పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం వర్గాలు అసలు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తే వున్నాడనే విషయాన్ని మరచిపోయారు. ఆయన ప్రచారం చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. గత ఎన్నికలలో రామయ్యా.. వస్తావయ్యా అన్న తెలుగుదేశం.. ఈసారి మాత్రం రామయ్యా.. రావాల్సిన అవసరం లేదయ్యా అని చెప్పకుండానే చెప్పింది. గత ఎన్నికల సందర్భంగా బెట్టు చేసి, బిల్డప్ ఇచ్చే అవకాశం ఈసారి జూనియర్ ఎన్టీఆర్‌కి రాలేదు. జూనియర్ ఎన్టీఆర్‌ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కోరుకోలేదు. కానీ వైసీపీ మాత్రం జూనియర్ పేరుతో ఫేక్ ప్రచారం చేసుకుంటోంది. జూనియర్ ఫొటో పెట్టుకుని, ఆయన వైసీపీకి మద్దతుగా స్టేట్‌మెంట్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆత్మానందం పొందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అయిన పార్టీకి ఉపయోగపడలేదు. కాని పార్టీ మాత్రం ఇలా ఫేక్ ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. 

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-1
ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న  ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్‌ని తిట్టడం ప్రారంభించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి జైలు పాలయ్యారు. బెయిల్ పై బయటకొచ్చి ఆయన ప్రజా మద్దత్తు ఉంటే మళ్లీ జైలుకు వెళ్లనని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పాత్ర కీలకమే అయినప్పటికీ పదేళ్ల తర్వాత ఆయన స్థితి పూర్తిగా దిగజారిపోయింది. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కెసీఆర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్‌తో ఆంధ్రప్రదేశ్‌కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి. 
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు  కాంగ్రెస్  పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు  నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్     నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.