క్రమ శిక్షణకు మరో పేరు అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ తన పంథా మార్చినట్లు కనబడుతోంది. ఆ పార్టీలో వాక్ స్వేచ్చ ఇటీవలి కాలంలో కాస్తా ఎక్కువయ్యింది. వాక్ స్వాతంత్రానికి ఆ పార్టీలో నూకలు చెల్లు అనే టాక్ కూడా ప్రస్తుతం వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరు ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా విమర్శించవచ్చు. వాళ్ల మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం అత్యంత అరుదు.
కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతుండగా బిజెపిలో కొత్తగా చేరికలు ఉండడం లేదు. ఉన్నవారినే కాపాడుకోవడం గగనమైంది కెసీఆర్ కూతురు కల్వ కుంట్ల కవితను అరెస్ట్ చేస్తే తప్ప తమ పార్టీ అధికారంలో రావడం కల్ల అని చేవెళ్ల మాజీ ఎంపీ, బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచార సమయంలో బిఆర్ ఎస్ మూడోసారి అధికారంలో రాదని తమ పార్టీ మాత్రమే అధికారంలో రాగలుగుతుందని బిజెపి నేతలు గొప్పగా చెప్పేవారు. కానీ కర్ణాటక ఫలితాల తర్వాత బిజెపి పరాజయంతో తెలంగాణ బిజెపి నేతలు జోరు తగ్గించారు. కవితను అరెస్ట్ చేస్తేనే తెలంగాణలో బిజెపి అధికారంలో రాగలుగుతుందని ప్రచారం చేస్తున్నారు. బిజెపి జాతీయ నేత ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో 40 మంది బిజెపి అభ్యర్థులు దొరకడమే గగనమన్నారు. మా పార్టీకి అభ్యర్థులు కరవయ్యారు అని సంచలన కామెంట్ చేశారు. అతనిపై ఇప్పటి వరకు పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. గతంలో ఇంద్ర సేనారెడ్డి చేరికల కమిటీలో ఉండి చేరికలను ప్రోత్సహించారు. ప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేరికల కమిటీకి సారథ్యం వహిస్తున్నారు. గమ్మత్తు అయిన విషయం ఏమిటంటే చేరికల కమిటీ చైర్మన్ హోదాలో ఆయన పొంగులేటి, జూపల్లిలకు ఆహ్వానం పలికారు.
కవితను అరెస్ట్ చేయలేని మీ పార్టీ ప్రభుత్వం మేము చేరితే ప్రజలు మమ్మల్ని ఓడగట్టడం ఖాయమన్నారు. మేమే కొత్త పార్టీ పెడుతున్నాం మీరే మా పార్టీలో చేరండి అని పొంగులేటి, జూపల్లిలు ఈటెలను ఆహ్వానించారు. చేసేదేమి లేక ఈటెల వెనుదిరిగిపోయారు. బిజెపిలో చేరికల కమిటీకి బదులు ఎగ్జిట్ కమిటీ పెట్టి బిజెపినుంచి బయటకు వెళ్లే వారిని కాపాడుకోవాలని రాజకీయ విశ్లేషకుడు ఒకరు వాఖ్యానించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/joinings-in-bjp-nil-25-156267.html
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.