ఒక జెఫ్రీ ఎప్ స్టీన్... 55 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు?

Publish Date:Feb 26, 2026

Advertisement

 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న..  జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు? సెక్స్ ట్రేడింగ్ తో రూ. 55 వేల కోట్లు ఎలా పుట్టించాడు? డబ్బు, అధికారం, రాజకీయం.. కలిస్తే న్యాయమూ మూగబోతుందా? జెఫ్రీ ఎప్‌స్టీన్‌కి  అంత వికారపు సంపద ఎలా వచ్చిందీ? బ్రిటన్ రాజుకి ఉన్న సంబంధమేమిటీ? అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో లింకేంటీ? ట్రంప్ సర్కార్ లేబర్ సెక్రటరీ పదవెందుకు ఊడిందీ? అన్ని తెలిసిన ఆ న్యాయమూర్తి ఆ మదాందుణ్ణి వదిలేసినందుకు ఎంత ముట్టిందీ? చివరికి అతడెందుకు కుక్కచావు చచ్చాడు? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానమే జెఫ్రీ ఎప్‌స్టీన్- ఫిల్తీ రిచ్ అనే డాక్యుమెంటరీ సీరీస్.

ప్రస్తుతం ప్రపంచ కుబేరులను వణికిస్తున్న పేరు జెప్రీ ఎప్‌స్టీన్. ఇతడి చీకటి సామ్రాజ్యంలో ఓలలాడిన వందలాది సుఖ పురుషుల రంకు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా పారుతోంది. ఇప్పటికి బయటికొచ్చిన 30 లక్షల పేజీల్లో ఎవరి పేరు ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియక బిక్కుబిక్కు మంటున్నారు. ఎప్‌స్టీన్‌తో పరిచయాల వల్ల ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఇండియా ఏఐ సమ్మిట్‌కి వచ్చినా ఎంట్రీ దొరక్క చెప్పా పెట్టకుండానే ఇంటిదారిపట్టారు. ఇండియాకి చెందిన ఓ కేంద్ర మంత్రి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.

సరిగ్గా ఇటువంటి దశలో నెట్ ఫ్లిక్స్ ఇండియన్ సెక్షన్‌లో..  జెఫ్రీ ఎప్‌స్టీన్- ఫిల్తీ రిచ్  అనే డాక్యుమెంటరీ సంచలనం రేకెత్తిస్తోంది. ప్రైవేట్ జెట్‌లు, విలాసవంతమైన భవంతులు, ఎలైట్ క్లాస్ డిన్నర్లు, హైక్లాస్ విందులు, వినోదాలు, వాటి వెనుక దాగి ఉన్న లైంగిక దోపిడీ వంటి  వ్యవహారాలతో నిండి ఉంటుందీ సీరీస్. ఎప్ స్టీన్ జీవితం ఒక వ్యక్తికి సంబంధించిన నేరగాథ కానే కాదు. వ్యవస్థల వైఫల్యానికి ఒక మచ్చు తునక. ఇది కేవలం క్రైమ్ కథ కాదు- ఇదో అధికారపు నీడలో దాగిన చీకటి కోణాల సమాహారం. డాక్యుమెంటరీలు మామూలుగా ఏదైనా ఒక ఘటనను చెబుతాయి. కానీ ఈ ఫిల్తీ రిచ్ సీరీస్ అంతకు మించి  నిజాలను విడమరచి చెబుతుంది. వ్యవస్థల వైఫల్యాన్ని, అధికారం ఎలా రక్షణ కవచంగా మారుతుందో ఎత్తి చూపుతుంది. 

ఈ సిరీస్ లో హీరో, విలన్ రెండూ అతడే. ఎప్‌స్టీనే. యూదు మూలాలున్న ఇతడిది ఒక సాదాసీదా కుటుంబం. తండ్రిది మరీ చిన్న వ్యాపారం, తల్లి ఓ స్కూలు టీచర్. అతనికో అన్న. ఇక ఈ సీరీస్ హీరో- విలన్ ఎప్ స్టీన్- వాక్ చాతుర్యంగల వ్యక్తి. ఇతరులను బురిడీ కొట్టించడంలో దిట్ట. డిగ్రీ కూడా లేకుండానే సైంటిస్ట్ అయిపోతాడు. ఫేక్ స్టాక్ బ్రోకర్ అవుతాడు. అధికార, అనధికార వర్గాల అవసరాలు తీర్చడమే పరమావధిగా బతుకుతుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే  సుఖ భోగ లాలసత్వానికిదో బ్రాండ్ అంబాసిడర్. రెండు ప్రైవేటు విమానాలు, విలాసాలకు సకల సౌకర్యాలున్న రెండు  ఐలాండ్స్ , ఫ్లోరిడా తీరంలో మరెవరికీ లేనటువంటి విలాస సౌదాలు, చీమచిటుక్కుమన్నా పసిగట్టే గూఢచారులు, గోడల్లోనే బిగించిన నిఘా నేత్రాలు..  ఇలా ఒకటేమిటీ.. అతనికి లేనిది లేదంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఈ తళుకు బెళుకుల  వెనుక ఉన్నది మైనర్ బాలికల విన్యాసాలు. వందలాది మంది అభం శుభం తెలియని ఆడపిల్లల శరీరాలు.

బాధితుల స్వరం- నిందితుల స్వర్గం కలవడమే ఈ కథనానికి అత్యంత కీలకం.. ఈ డాక్యుమెంటరీలో అత్యంత క్రియాశీలమైనది బాధితుల ప్రత్యక్ష వాంగ్మూలం. ముఖ్యంగా వర్జీనియా జెఫ్రీ వంటి మహిళలు తమ అనుభవాలను నిర్భయంగా వెలిబుచ్చడం సిరీస్‌ వాస్తవితకు అద్దం పడుతుంది . ఈ సీరీస్ ను తెరకెక్కించినందుకు లేడీ డైరెక్టర్ లిసా ప్రయాంట్ ఎంతో శ్రమించినట్టు కనిపించింది ఆ డాక్యుమెంటరీల్లో స్పష్టంగా కనిపిస్తుంది.   సెన్సేషన్ వైపు వెళ్లకుండా ఏ మాత్రం తడబాటు లేకుండా.. బాధితుల అనుభవాలను గౌరవంగా, నెమ్మదిగా చెబుతుంది. ఎందుకంటే నిజం చెప్పడానికి జ్ఞాపకశక్తి అవసరం లేదని ఎలా అంటారో.. మెరుగులు దిద్దడం కూడా అంతే అనవసరంగా చెప్పాలి. 

సరిగ్గా అలాగే ఉంటుందీ సీరీస్. కెమెరా బాధితుల ముఖాలపై ఎక్కువ సేపు నిలిపి, మింగుడు పడని ఓ నిజాన్ని నేరుగా ప్రేక్షకుడికి చెబుతున్నట్టు కనిపిస్తుంది. ఇంత దారుణం  మీ పిల్లలకు జరిగితే..  అనే ప్రశ్న వేయకుండానే మనం జవాబు చెప్పుకునేలా చేస్తుంది. ఈ డాక్యుమెంటరీ ఓ వ్యక్తి పాపాల చిట్టా కాదు. ఇది మూడు వ్యవస్థల దారుణ అవస్థ. డబ్బు, అధికారం, పలుకుబడి ప్రభావం. ఈ మూడు కలిస్తే బాధితుల గొంతు  బొంగురుపోతుంది. ఎప్‌స్టీన్ చావు- అనేక ప్రశ్నలకు జవాబు లేకుండా చేసినా బాధితుల వాంగ్మూలాలను చరిత్రకెక్కించడం ఈ డాక్యుమెంటరీ గొప్పదనం.  

ఈ సీరీస్ నాలుగు ఎపిసోడ్లు. ప్రతి ఎపిసోడ్ సుమారు 55-57 నిమిషాలు. తొలి ఎపిసోడ్ లో ఎప్‌స్టీన్ ఆడపిల్లలకు ఎలా వల వేస్తాడు అనేది డీల్ చేస్తుంది. 1996 నుంచి మొదలవుతుందీ కథ. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మైనర్ బాలికలను టార్గెట్ చేయడం ఇందులో ఉంటుంది. మనకు తెలిసిన పిరమిడ్ యోగం, ధ్యానానికి సంబంధించింది. కానీ ఎప్‌స్టీన్ పిరమిడ్ స్కీమ్ మాత్రం గొలుసుకట్టు రిక్రూట్మెంట్. చైన్ లింక్ మార్కెట్ లాంటిది. ఒకరు ఇంకొకర్ని తీసుకురావాలి. వాళ్లు ఇంకొందర్ని తీసుకురావాలి. బాధితులను ఒకరికొకరు రిక్రూట్ చేయించడం ఇతని వ్యవస్థకు మూలం. ఎప్‌స్టీన్ కబంధ హస్తాల నుంచి బయటపడిన వారి ఇంటర్వ్యూలతో మొదలవుతుంది. ఎలా వంచనకు గురయ్యారో, ఎలా భయపెట్టారో డీల్ చేస్తుంది ఈ భాగం.

ఇక రెండో ఎపిసోడ్ ఫాలోద మనీ. ఎప్‌స్టీన్ కి సంపద ఎలా వచ్చింది, అది ఎలా అతనికి రక్షణ కల్పించిందనేది విడమరచి చెబుతుంది.. డబ్బుతో దేన్నైనా కొనగలను అనే ధైర్యం రావడానికి కారణమేంటో వివరిస్తుంది. 3వ ఎపిసోడ్- ది ఐలాండ్. ఎప్‌స్టీన్ కి రెండు సొంత ద్వీపాలు ఎలా వచ్చాయో, అవి టార్చర్ హౌసెస్ గా ఎలా రూపు దిద్దుకున్నాయో ఎత్తి చూపు చెబుతుంది. ఇక్కడ ఆడపిల్లలు అరిచే అరుపులు ఎలా ఆర్తనాధాలవుతాయో చూస్తుంటే మనం గిలగిల్లాడాల్సిందే. మరియా ఫార్మర్ లాంటి బాధితులు తమ ఐలాండ్ అనుభవాలను వివరిస్తుంటే మనసున్నఎవరికైనా కళ్ల వెంబడి నీరు కారాల్సిందే. 

ఈ సీరీస్‌ మొత్తంలో మోస్ట్  డిస్ట్రబింగ్ ఎపిసోడ్ ఇది. ఇక ముగింపుగా చూపే 4వ ఎపిసోడ్ ఫైండింగ్ జస్టిస్ లో బాధితుల న్యాయ పోరాటం, 2019లో మియామి హెరాల్డ్ జర్నలిస్ట్ జూలీ  బ్రౌన్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఎప్‌స్టీన్‌ను మళ్లీ అరెస్టు చేయించిందీ, న్యూయార్క్ జైల్లో అనుమానాస్పద చావును చూపుతుంది. ఆశ నిరాశల మధ్య న్యాయం ఇంకా చచ్చిపోలేదన్న సందేశంతో ముగిసినా అంతు చిక్కని ప్రశ్నలు, జవాబులు ఇంకా ఎన్నో, ఎన్నెన్నో..

ఇన్ని ఘోరాలు చేసినా తాను అమాయకుణ్ణని తప్పించుకునేందుకు ఎప్‌స్టీన్ కోర్టు విచారణలో చూపే హావభావాలు, ఆ బాడీ లాంగ్వేజ్ మనకు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఒంటి నిండా పట్టిన కొవ్వుతో పాటు పట్టిన డబ్బు మదం, అహంకారంతో గతంలో తప్పించుకున్నట్టే 2019లోనూ తప్పించుకునేందుకు చేసే ప్రయత్నం, అతని చుట్టూ కుక్కపిల్లల్లా తిరిగే అమెరికన్ టాప్ మోస్ట్ లాయర్లు, వాళ్ల భాష చూస్తే మనకు ఒళ్లు గగుర్పొడుస్తుంది. కోపం కట్టలు తెంచుకుంటుంది. తీవ్ర ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఫిల్తీ రిచ్ సీరీస్ కేవలం ఒక డాక్యుమెంటరీ కాదు. అధికారం, హోదా, సంపద, న్యాయ వ్యవస్థ కలిసి చేసే దుర్మార్గాలు ఎలా ఉంటాయనే దానికి నిదర్శనం. ఇది చూసిన తర్వాత ప్రేక్షకుల్లో కట్టలు తెంచుకుంటుంది. కీచు గొంతుకలు కూడా పెద్దగా అరిచి చెప్పగలవన్న సత్యం గుండెలను తాకుతుంది.   

అమెరికా న్యాయశాఖ జనవరి 30న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదల చేసిన నాటి నుంచి ఆ దేశంతో పాటు.. యూరప్‌లోనూ తీవ్ర అలజడి చెలరేగింది. రూ.30 లక్షల ఇ-మెయిల్‌ సంభాషణలు, లక్షకు పైగా ఫోటోలు, వేయికి పైగా వీడియో క్లిప్పింగులతో కూడిన ఈ పత్రాల విడుదలతో ఘోరమైన నేరమయ చర్యలు బయటపడ్డాయి. అయితే ఈ ఘోరాల పర్వం మొత్తం ఎప్‌స్టీన్‌ పాత్ర చుట్టూనే తిప్పుతూ తనే లక్ష్యంగా చర్చ సాగుతోంది. అయితే ఎప్‌స్టీన్‌ అమానుష  దురాగతాలు అతడేదో వంటరి వ్యక్తిగా చేసినవి కావని తెలుస్తూనే వుంది. ఒక వ్యవస్థీకృత వాతావరణంలోనే ఇవన్నీ జరిగినట్టు కనిపిస్తుంది.  ఈ తప్పులు దశాబ్దాల పాటు సాగుతూ వచ్చాయి.  2008లో వ్యక్తిగత స్థాయిలో చేస్తూ వచ్చిన ఆరోపణలు, తర్వాత ఉన్నత స్థాయిలో వారి వారి నేరాలపై ఒక దర్యాప్తుగా మారింది. తర్వాత ఎప్ స్టీన్ అరెస్టు చేయడం, 2019లో ఎప్‌స్టీన్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.


 

By
en-us Political News

  
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.