తెలుగు తేజం జయప్రకాశ్ నారాయణ చొరవ ఫలించేనా

Publish Date:Sep 11, 2013

Advertisement

 

రాష్ట్ర విభజన ప్రకటనతో రాష్ట్రం అల్లకల్లోలం అయ్యింది. అదేవిధంగా కాంగ్రెస్, తెరాస, తెదేపా, బీజేపీ, వైకాపాల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ సమస్య నుండి బయటపడటానికి రాజకీయ పార్టీలు ఇరుప్రాంత ప్రజల మధ్య మరింత విద్వేష బీజాలు నాటుతున్నాయి తప్ప, వాటిలో ఏ ఒక్కటీ కూడా ఈ సమస్యను శాంతియుతంగా సామరస్యంగా పరిష్కరించేందుకు ముందుకు రాలేదు. తత్ఫలితంగా ఇరుప్రాంతల ప్రజల మధ్య ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టే సూచనలు కనబడటం లేదు. అంతిమంగా ఈ పరిణామాలన్నీ ప్రజల జీవితాలను దుర్భరం చేయడమే కాకుండా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలను మంటగలుపుతున్నాయి. అయినప్పటికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు దీనినుండి రాజకీయ లబ్దికోసం ప్రాకులాడుతూనే ఉన్నాయి.

 

ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, అంటూ వ్యాదులు, ఆర్ధిక సమస్యలు వంటివి ఎన్నిటినో ఎదుర్కొని తట్టుకొని నిలబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నేడు రాజకీయ నాయకుల, పార్టీల స్వార్ధ రాజకీయాలు, అనాలోచిత నిర్ణయాలు, సమస్యను పరిష్కరించడంలో ప్రయత్నలోపం కారణంగా అత్యంత దయనీయమయిన స్థితిలో విలవిలాడుతోంది. బహుశః రాష్ట్ర చరిత్రలో ఇటువంటి దుర్భర పరిస్థితులు ఎన్నడూ ఏర్పడి ఉండవు.

 

నిజాన్ని నిర్భయంగా చెప్పగల దైర్యవంతుడు, నిజాయితీ పరుడు, మేధావి అయిన లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ భాద్యత గల పౌరుడిగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తలపెట్టారు. ఆయన ఈనెల 14 నుండి కోస్తాంధ్ర, రాయలసీమలలో ‘తెలుగు తేజం’ పేరిట యాత్రకు సిద్దమవుతున్నారు. ఆయన తన యాత్రను కర్నూలులో ప్రారంభించి అనంతపురం, కడప, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, విశాఖ, విజయనగరంల మీదుగా సాగి ఈనెల 27న శ్రీకాకుళంలో ముగిస్తారు.

 

ఈ సందర్భంగా ఆయన పలు బహిరంగ సభలు, రౌండ్‌టేబుల్ భేటీలవంటివి నిర్వహించి రాష్ట్ర విభజనలో లోక్ సత్తా పార్టీ గుర్తించిన ఐదు ప్రధాన సమస్యలను ప్రజలకు వివరించి, అందరికీ ఆమోదయోగ్యంగమయిన పరిష్కారాల కోసం కృషి చేస్తారు. ఆయన తన యాత్రలో రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతిని ప్రజలకు తెలియజేస్తూనే, దాని వల్ల ఏర్పడే సమస్యలను, వాటికి పరిష్కారాలను ఆయన సూచించే ప్రయత్నం చేస్తారు.

 

సమైక్యాంధ్ర కోరుతూ గత నలబై రోజులుగా ఉద్యమిస్తున్న ప్రజలకు ఈవిధంగా నచ్చజెప్పబోవడం నిజంగా సాహసోపేతమే. అయితే వాస్తవ పరిస్థితులను వివరించి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయవలసిన భాద్యత కూడా తమపై ఉందని ఆయన బలంగా నమ్ముతున్నదునే ఈ యాత్రకు సిద్దపడుతున్నారు.

 

మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులకు క్లాసిక్ సినిమాతో మెప్పించడం ఎంత కష్టమో, అదేవిధంగా తెరాస, కాంగ్రెస్, వైకాపా, తెదేపాల పసందయిన ఘాటు విమర్శలతో కూడిన ప్రసంగాలు వినేందుకు అలవాటుపడిన ప్రజలను జయప్రకాశ్ నారాయణ సమస్యలు-పరిష్కారాలు అంటూ మాట్లాడి మెప్పించడం కూడా అంతే కష్టం. అయితే ఇది సరయిన దిశలో వేస్తున్నతొలి అడుగు. గనుక విజ్ఞులయిన ప్రజలు కూడా ఆయన చెప్పే చేదు వాస్తవాలను, వాటికి ఆయన సూచించే పరిష్కారాలను స్వీకరించి తదనుగుణంగా ప్రతిస్పందించితే ఎప్పటికయినా రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.