జయలలిత అనే కోమలవల్లి గురించి... మీకీ సంగతులు తెలుసా?

Publish Date:Dec 6, 2016

Advertisement

 

మనం జయలలిత అంటోన్న పురుచ్చి తలైవీ అసలు పేరు కోమలవల్లి!


తమిళనాడు ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన ఆమె పుట్టింది మాత్రం కర్ణాటకలో!


జయలలితకు హైద్రాబాద్ లోని కొంపెల్లి ప్రాంతంలో ఫామ్ హౌజ్ వుందంటారు. అక్కడే ఆమె అప్పుడప్పుడూ సేద తీరేదట!


నటిగా, రాజకీయ నాయకురాలిగా జయ అందరికీ తెలుసు. కాని, ఆమె అద్భుతంగా భరతనాట్యం కూడా వచ్చు. అయిదో ఏట నుంచే నృత్యం నేర్చుకుంది!


సినిమాలంటే పెద్దగా ఇష్టం లేని జయలలిత తల్లి బలవంతం మీద 15ఏళ్ల వయస్సులో గ్లామర్ ప్రపంచంలోకి వచ్చింది. మొదటి సినిమాలో యంగ్ విడో క్యారెక్టర్ వేసింది. అయితే, అప్పటికి జయలలిత చదవుల్లో టాప్! మెట్రిక్ లో ఆమె స్టేట్ ర్యాంకర్! జయలలిత నిజమైన ఆశయం... లాయర్ అవ్వాలని!


అందాల హీరోయిన్ గా తమిళుల చేత కవర్చి కన్ని అని పొగిడించుకున్న ఆమె మొదటి సినిమాకే ఏ సర్టిఫికెట్ వచ్చింది! దాంతో అప్పటికి 15ఏళ్లే వున్న జయ ఆ అడల్ట్స్ ఓన్లీ రేటింగ్ వచ్చిన సినిమా చూడలేకపోయింది!


జయలలిత , శోభన్ బాబుల ప్రేమ గురించి అనేక కథనాలు ప్రచారంలో వున్నాయి. వాళ్ల లవ్ నిజమో కాదోగాని... కొందరైతే జయకు శోభన్ బాబుతో ప్రియ మహాలక్ష్మీ అనే కూతురు కూడా వుందంటారు. కాని, ఈ గాసిప్స్ కి ఎలాంటి ఆధారం వున్నట్టు కనిపించదు...


ఇంగ్లీష్ పుస్తకాలు చదవటం అంటే జయలలితకు చాలా ఇష్టం. అంతే కాదు, ఆమె రచయిత్రి కూడా! ఎస్టరియర్ అనే తమిళ వీక్లీలో థాయ్ పేరుతో ఆమె రచనలు ప్రచురించేది!


తమిళంలో ఆమె 85సినిమాలు చేసింది. అందులో 80సూపర్ హిట్! చాలా వరకూ సిల్వర్ జూబ్లీ సినిమాలు కూడా...


తెలుగులో 28సినిమాలు చేసిన జయ హిందీలో ఇజ్జత్ అనే సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ చేసింది!
జయలలితకు ఒక అన్న. ఆయన పేరు జయకుమార్. 1995లో మరణించాడు. 

తమిళనాడు తొలి మహిళా ప్రతిపక్ష నేత, రెండో మహిళా సీఎం జయలలితే! అంతే కాదు, 43ఏళ్లకే మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె... ఇప్పటి వరకూ అత్యంత పిన్న వయస్కురాలైన తమిళ సీఎం! 


బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తండ్రి నవాబ్ అలీఖాన్ పటౌడీ అంటే జయలలితకు ఎక్కడలేని పిచ్చి. ఆయనను చూడటానికే క్రికెట్ మ్యాచ్ లకు వెళ్లేదట!


జయ తన పెంపుడు కొడుకు పెళ్లిలో లక్షన్నర మందికి ఆతిథ్యం ఇచ్చింది! ఇది గిన్నిస్ రికార్డ్... 
అమ్మ తన దత్త పుత్రుడి వివాహానికి 100కోట్లు ఖర్చు చేసిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. కాని, ఐటీ శాఖ 10కోట్లు ఖర్చు అయ్యాయని తేల్చింది... 


జయలలిత జీవితంలో వరం, శాపం రెండూ ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళే అంటారు చాలా మంది! శశికళతో ఆమె సాన్నిహిత్యంపై అనేక ప్రచారాలున్నాయి. అయితే, అదే శశికళని జయ ఒక దశలో దూరం పెట్టింది. అప్పుడే శశికళ కుట్ర చేసి స్లో పాయిజన్ ప్రయోగించిందంటారు పడని వారు! దీనికి ఎలాంటి ఆధారాలు లేకున్నా ఆ తరువాత నుంచే పురుచ్చి తలైవీ సంపూర్ణంగా ఏనాడూ కోలుకోలేదట!


1989లో అసెంబ్లీలోనే కరుణానిధి అనుచరుల చేతిలో  జయ ఘోర పరాభవానికి లోనయ్యారు. 


1992లో కుంభకోణంలో ఆమె ప్రత్యేక పూజలు, స్నానాలు చేశారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 50మంది చనిపోయారు... 


1992 సంవత్సరంలోనే అప్పటి గవర్నర్ చెన్నారెడ్డి తనతో అమర్యాదగా ప్రవర్తించాడని జయ ఆరోపించారు!


1996లో సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టినప్పుడు బయటపడ్డ ఆస్తులు 66 కోట్లు. అయితే, అందరినీ ఆకర్షించినవి 12,000 చీరెలు, 30 కిలోల బంగారం, 2,000 ఎకరాల భూమి, 750 జతల చెప్పులు, 8 క్వింటాళ్ల వెండి… 


1997లో ఆస్తుల జప్తు జరిగినప్పుడు, ఇక ఆభరణాలు ధరించనని ఒట్టు పెట్టుకుని, తిరిగి అధికారంలోకి వచ్చాకే 2011లో ధరించింది… 


పాలనలో ఆమె నియంత. విమర్శలు చేసినా, వార్తలు రాసినా ఎడాపెడా పరువునష్టం కేసులు పెట్టించేది.  


జయలలిత ముందు ప్రదర్శించాల్సిన విధేయత విషయంలో పాతకాలం చక్రవర్తుల రాజ వైభోగం కూడా దిగదుడుపే. అమ్మకు మంత్రులు, ఎమ్మెల్యేల పాదాభివందనాలు చాలా కామన్… 
ఆమె కళ్లల్లోకి నేరుగా చూడొద్దనీ, బొకే ఇచ్చేసి, వెనక్కి తిరిగి వీపు చూపకుండా, వెనక్కి వెనక్కి నడిచిరావాలని గన్ మెన్ చెప్పేవారట…


తమిళ సూపర్ స్టార్, అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ మొదట్లో జయను అనుమానించేవాడట. ఆమె ప్రతి కదలికపై నిఘా వేసి ఉంచేవాడట. వీడియో పార్లర్ నడుపుకునే శశికళను కూడా గూఢచర్యం కోసమే ఎంజీఆర్ జయలలిత వద్ద ఉంచాడట… 


1982లో రాజకీయాల్లోకి వచ్చిన జయ 1983లో రాజ్యసభ సభ్యురాలైంది. కాని, వెంటనే  రాజకీయ జీవితాన్నిచ్చిన ఎంజీఆర్ కోపానికీ గురైంది…


1984లో ఎంజీఆర్ కు స్ట్రోక్ వచ్చి, అనారోగ్య సమస్యల్లో ఉంటే... ఈమె రాజీవ్ ను, గవర్నర్ ఖురానాను కలిసి తనను సీఎంను చేయమని అడిగిందంటారు! 


1986లో ఎంజీఆర్ తో పడకపోవటంతో పోటీగా జయలలిత పెరవై అనే సమాంతర ఆర్గనైజేషన్ ను కూడా స్టార్ట్ చేసింది!


ఎంజీఆర్ మరణం తరువాత తిరుగులేకుండా ఎదిగిన జయ 34ఏళ్లలో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు! 

 

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.