Publish Date:Nov 20, 2024
మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో బీజేపీ జయకేతనం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఈ సారి ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఈ సారి ఎన్నికలలో జార్ఖండ్ లో బీజేపీ 42నుంచి 48 స్థానాలలో విజయం సాధించి సాధారణ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించు కుంటుందని పేర్కొంది. 16 నుంచి 23 స్థానాలతో జార్ఖండ్ ముక్తి మోర్చా రెండో స్థానంలోనూ 8 నుంచి 14 స్థానాలతో కాంగ్రెస్ మూడో స్థానంలోనూ నిలుస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. అలాగే మహారాష్ట్రలో కూడా బీజేపీ నాయకత్వంలోని మహాయతి కూటమి 175 నుంచి 195 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని పేర్కొంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా.. బుధవారం అన్ని స్థానాలకూ కలిపి ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా జేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలతో కూడిన మహా వికాస్ అఘాడీ మధ్య పోరు సాగింది. తొలి అంచనాల ప్రకారం ఈ ఎన్నికలలో హోరాహోరీ తప్పదని అంతా భావించినా పోలింగ్ తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీ నేతృత్వంలోని మయాయతి కూటమి ఏకపక్ష విజయం సాధిస్తుందని తేలింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహాయత కూటమి 175 నుంచి 195 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ 85 నుంచి 112 స్థానాలకే పరిమితం ఔతుంది.
మహాయతి కూటమిలో బీజేపీ సొంతంగా 102 నుంచి 120 స్థానాలలోనూ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 46 నుంచి 51 స్థానాలలోనూ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 14 నుంచి పాతిక స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెస్ నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ సొంతంగా 24 నుంచి 44 స్థానాలలోనూ, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన 21 నుంచి 31 స్థనాలలలోనూ, శరద్ పవాన్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 28 నుంచి 41 స్థనాలలోనూ విజయం సాధిస్తుంది. ఇతరులు 6 నుంచి 12 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jarkhand-and-maharashtra-vote-for-bjp-39-188704.html
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.