జ‌న్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు.. రంగంలోకి కేసీఆర్!

Publish Date:Oct 27, 2024

Advertisement

తెలంగాణ రాజ‌కీయాల్లో జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసు సంచ‌ల‌నంగా మారింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ‌మ‌రిది రాజ్ పాకాల‌కు చెందిన జ‌న్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జ‌రిగిదంటూ సైబ‌రాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 35మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పురుషులు, మ‌హిళ‌లు ఉన్నారు. అక్క‌డ విదేశీ మ‌ద్యం స‌హా భారీగా మ‌ద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ యాక్ట్ సెక్ష‌న్ 34 కింద కేసు న‌మోదు చేశారు. అయితే, ఈ పార్టీలో కొంద‌రు డ్ర‌గ్స్ ను కూడా వినియోగించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. పార్టీలో పాల్గొన్న కొంద‌రికి డ్ర‌గ్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఓ వ్యాపార‌వేత్త‌  కొకైన్ తీసుకున్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. దీంతో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించారు.  పోలీసుల విచార‌ణ‌లో కేటీఆర్ బావ‌మ‌రిది ఆఫ‌ర్ చేస్తేనే తాను కొకైన్ తీసుకున్న‌ట్లు ఆయన చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇంతకూ కొకైన్ రాజ్ పాకాలకు ఎక్కడి నుండి వ‌చ్చింది.. దీని వెనక ఉన్న ముఠా ఎవరు? ఎన్నేళ్ల నుండి డ్రగ్స్ సరఫరా అవుతుందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఫామ్‌హౌస్ పార్టీ కేసులో ఏ1గా ఫామ్‌హౌస్ సూప‌ర్‌వైజ‌ర్ కార్తిక్‌, ఏ2గా రాజ్ పాకాల‌ను చేర్చారు.  అయితే, రాజ్ పాకాల ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసులో విష‌యంలో ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయం, 2గంటలకు మోకిలా పోలీస్ స్టేషన్ విచారణకు రావాల‌ని రాజ్ పాకాలకు పోలీసులు ఆదేశించిన‌ప్ప‌టికీ ఆయ‌న   డుమ్మా కొట్టారు. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసుకుని అందుబాటులోకి రాలేదు. దీంతో  రాయ‌దుర్గంలోని ఓరియ‌న్ విల్లాలో రాజ్ పాకాల ఉన్న‌ట్లు స‌మాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించేందుకు అక్క‌డికి వెళ్ల‌గా.. విల్లాకు తాళంవేసి ఉండ‌టంతో వారు కొద్దిసేపు అక్క‌డే వేచి ఉన్నారు. స‌మీపంలోని మ‌రో విల్లాలో ఉన్నార‌ని స‌మాచారం రావ‌డంతో అధికారులంతా అక్క‌డికి వెళ్లారు. ఈలోగా భారీ సంఖ్య‌లో బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అక్క‌డికి చేరుకొని ఆందోళ‌న‌కు దిగారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా త‌నిఖీ చేస్తార‌ని ప్ర‌శ్నించారు.

ఫామ్‌హౌస్ కేసుపై కేటీఆర్ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌ పాల‌నపై ప్ర‌శ్నించినందుకే రాజ‌కీయంగా స‌మాదానం చెప్ప‌లేక ఇలాంటి కుట్ర‌ల‌కు తెర‌తీస్తున్నార‌ని, మా ధైర్యాన్ని దెబ్బ‌తీయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా దావ‌త్ చేసుకోవ‌డం త‌ప్పా..?  గృహ ప్ర‌వేశం సంద‌ర్భంగా బంధువుల‌ను పిలిచి దావ‌త్ ఇచ్చారు. కొంద‌రు రేవ్ పార్టీ అని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేవ‌లం అది కుటుంబ పార్టీ మాత్ర‌మేన‌ని.. అందులో చిన్న పిల్ల‌ల‌తో పాటు వృద్ధులు, కుటుంబాల‌కు చెందిన భార్యాభ‌ర్త‌లు పాల్గొన్నార‌ని కేటీఆర్ అన్నారు.  

జ‌న్వాడ ఫామ్‌హౌస్ పార్టీలో డ్ర‌గ్స్ వినియేగించార‌నే వార్త‌లు రావ‌డంతోపాటు.. కేటీఆర్ స‌తీమ‌ణికూడా పాల్గొన్నార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డం  రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. బీజేపీ ఎంపీలు బండి సంజ‌య్‌, ర‌ఘునంద‌న్ రావులు మీడియా స‌మావేశాలు ఏర్పాటు చేసి కీల‌క‌ వ్యాఖ్య‌లు చేశారు. బండి సంజ‌య్ మాట్లాడుతూ.. ఫాంహౌజ్ లో రేవ్ పార్టీ కేసును కేసును కాంగ్రెస్ ప్ర‌భుత్వం నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నద‌ని ఆరోపించారు. పార్టీలో పాల్గొన్న వారంద‌రి పేర్ల‌ను బ‌హిర్గ‌తం చేయాల‌ని, డ్ర‌గ్స్ వినియోగం విష‌యంపై నిగ్గుతేల్చాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య రాజ‌కీయ అనుబంధం కార‌ణంగానే ఈ కేసులో విష‌యాల‌ను బ‌య‌ట‌కు రాకుండా కాంగ్రెస్ పెద్ద‌లు పోలీసు ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంద‌ని అన్నారు. ర‌ఘునంద‌న్ రావు మాట్లాడుతూ.. ఫామ్ హౌస్, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో సీసీ కెమెరా పుటేజ్‌ల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. మ‌రోవైపు కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు మీడియా ముందుకొచ్చి కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నద‌ని బీఆర్ఎస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయంగా కేటీఆర్‌ను ఎదుర్కోలేక కుటుంబ స‌భ్యుల‌ను టార్గెట్‌గా చేసుకొని అస‌త్య‌  ప్ర‌చారం చేస్తున్నార‌ని, రాజ‌కీయాల్లో ఇలాంటి ప‌రిణామాలు స‌రికాదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, ఈ కేసుపై ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు మీడియా ముఖంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు. దీంతో నిజంగానే పార్టీలో డ్ర‌గ్స్ వినియోగం జ‌రిగిందా అనే అంశం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఆయ‌న పార్టీ కార్యక్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే, తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసుకు సంబంధించి కేసీఆర్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాల గురించి స్వయంగా రాష్ట్ర డీజీపీకి కేసీఆర్ ఫోన్ చేసి ఆరా తీశారు. పార్టీ కేసుకు సంబంధించి   ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాల, అతని కుటుంబ సభ్యుల గృహాలపై పోలీసులు ఉ  తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలపై డిజిపితో ఫోన్లో కేసీఆర్ మాట్లాడుతూ .. సర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎందుకు చేస్తున్నారని, వెంటనే సోదాలను ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్ పాకాల, అతని సోదరుడు శైలేంద్ర గృహాలలో సోదాలను నిర్వహిస్తున్న తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ‌త కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉంటున్న కేసీఆర్ ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై రియాక్ట్ కావ‌టంతో ఆయ‌న ఇక నుంచి పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతార‌ని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేసీఆర్ కుటుంబాన్ని బ‌ద‌నాం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నద‌ని, వారికి స‌రైన గుణ‌పాఠం చెప్పేందుకు కేసీఆర్ మ‌ళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ కాబోతున్నార‌ని బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

అధికారం కోల్పోయిన త‌రువాత కేసీఆర్ ఒక్క‌సారి కూడా కాంగ్రెస్ నేత‌ల‌కు ఎదురుప‌డ‌లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కు డుమ్మా కొట్టారు. కేవలం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన రోజు మాత్ర‌మే అసెంబ్లీకి కేసీఆర్ వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన బ‌డ్జెట్ పై అసంతృప్తి వ్య‌క్తం చేసి.. ఇక నుంచి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాన‌ని హెచ్చ‌రించారు. అయితే, ఆ త‌రువాత కూడా కేసీఆర్ ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. తాజాగా జ‌న్వాడ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి కేసీఆర్ స్పందించ‌డంతో.. ఇక‌నుంచి ఆయ‌న పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతార‌నే చ‌ర్చ జ‌రుగుతున్నది.

By
en-us Political News

  
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.