జనవాణి ఈ వారమూ రద్దు..? పవన్ కల్యాణ్ ఎక్కడ?

Publish Date:Jul 30, 2022

Advertisement

జనసేనాని అధినేత రాజకీయ ప్రస్థానం ముందుకూ కదలడం లేదు.. అలాగని వెనక్కూ వెళ్లడం లేదు. ఏ కార్యక్రమమైనా ఆర్భాటంగా ప్రారంభించడం.. ఆ తరువాత అర్ధంతరంగా మానేయడం. గతంలోనూ జరిగింది. ఇప్పుడూ అలాగే జరుగుతుందా అన్న అనుమానాలు జనసేన శ్రేణుల్లోనే వ్యక్తమౌతుంది. ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం కోసం తూర్పుగోదావరి జిల్లా పర్యటన అనంతరం అనారోగ్యం కారణంగా జనసేనాని విశ్రాంతి తీసుకుంటున్నారు.

జనసేన వర్గాలే ఈ విషయాన్ని చెప్పి గత ఆదివారం జరగాల్సిన జనవాణి కార్యక్రమం రద్దైనట్లు ప్రకటించారు.  అప్పుడే తదుపరి జనవాణి జూలై 31వ తేదీన విశాఖలో నిర్వహిస్తామనీ అప్పట్లోనే ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అయతే ఆ తరువాత ఇప్పటి వరకూ అందుకు సంబంధించిన వివరాలేవీ వెల్లడించలేదు. అంతే కాదు ఈ వారం రోజులలో ఎక్కడా పవన్ కల్యాణ్ కనిపించింది లేదు. మాట్లాడింది లేదు.

కాపు నేస్తం కార్యక్రమంలో జనసేనానిపై చేసిన విమర్శలపై జనసేన శ్రేణులు స్పందించాయి కానీ పవన్ కల్యాణ్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం కూడా జనవాణి కార్యక్రమం రద్దైనట్లేనని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సినంత ఆనారోగ్యం ఏమిటన్నది అంతుపట్టకుండా ఉందని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా ఎలాంటి సమాచారం లేకుండా రద్దవ్వడం పట్ల జనసేన శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవవుతోంది.  రాష్ట్రం ఒక వైపు భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమైపోతుంటే బాధితులను పరామర్శించడానికి కూడా పవన్ కల్యాణ్ రాకపోవడం రాజకీయంగా పార్టీకి నష్టం అన్న భావన వ్యక్తం అవుతోంది.

అత్యంత కీలకమైన సమయంలో పవన్ కల్యాణ్ మౌనం కార్యకర్తలలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కష్ట సమయంలో బాధితులకు అండగా ఉన్నప్పుడే నాయకుడి పట్ల జనంలో విశ్వాసం కలుగుతుంది. అలా జనంలో విశ్వాసాన్ని చూరగొనే అవకాశాన్ని పనవ్ జారవిడిచారన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.