జగన్, కేసీఆర్ లతో జైరామ్ యుద్ధం దేనికి?

Publish Date:May 4, 2014

Advertisement

 

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజల వద్దకు విభజనలో ప్రముఖ పాత్ర పోషించిన జైరామ్ రమేష్ ను ప్రచారానికి పంపడం ఆత్మహత్యతో సమానమని కాంగ్రెస్ తెలియదనుకోలేము. రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితుడు, మంచి ప్రజాకర్షణ గల చిరంజీవి వంటి వ్యక్తికే రాష్ట్ర ప్రజల నుండి తిరస్కారం ఎదురవుతుంటే, దగ్గరుండి రాష్ట్ర విభజన చేసిన జైరామ్ రమేష్ ని చూస్తే ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో, దానివలన కాంగ్రెస్ పై ఎటువంటి ప్రభావం పడుతుందో ఎవరయినా ఊహించవచ్చును.

 

కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఏరికోరి ఆయననే ఎందుకు పంపింది? కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన కలిగి, ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారని చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఎందుకు అంతలా విరుచుకుపడుతున్నారు? బెయిలుపై బయటకు వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవడం తాను జీర్ణించుకోలేకపోతున్నాని, జగన్ తిరిగి జైలుకు వెళ్ళక తప్పదని ఆయన ఎందుకు పదేపదే చెపుతున్నారు? అని ప్రశ్నించుకొంటే, ఇదంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రజలతో ఆడుతున్న ‘మైండ్ గేమ్’ లేదా ‘డబుల్ గేమ్’ అని చెప్పుకోవచ్చు.

 

అదెలాగ అంటే, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణాలో 17యంపీ సీట్లు సాధించుకొనేందుకే, సీమాంద్రాలో పార్టీని, తమ భవిష్యత్తుని కూడా పణంగా పెట్టిందని కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలే చెప్పారు. సీమాంద్రాలో జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం ఉందని కూడా వారే చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే తెలంగాణాలో తెరాస, సీమాంద్రాలో వైకాపా గెలవడం చాలా అవసరం. కాంగ్రెస్ తొలి ప్రాధాన్యత తను తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడమే కానీ ఆంధ్రా, తెలంగాణాలలో అధికారం చెప్పడం కాదు. ఈసారి ఎన్నికలలో గెలిచి కేంద్రంలో ఆహికారం హస్తగతం చేసుకోలేకపోతే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ అంధకారం అవుతుందని అందరికీ తెలుసు. అందుకే, దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రత్యేక వ్యూహాలు అమలుచేస్తోంది. సీమాంద్రాకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సిద్దం చేసిన వ్యూహం గురించి ఇప్పటికే ప్రజలందరికీ బాగా తెలుసు.

 

కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేఖత ఉందనే సంగతి ప్రజలకే కాదు, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా బాగా తెలుసు. అందువల్ల ఇప్పుడు ఆ వ్యతిరేఖతను మరింత పెంచుకోగలిగితేనే, కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి బదిలీ అవుతాయి. అందుకు నోటి దురద ఉన్న జైరామ్ రమేష్ వంటి వ్యక్తికంటే అర్హుడు, సమర్ధుడు మరొకరు ఉండబోరు.

 

ఆయన తెలంగాణాలో మంచి ప్రజాధారణ ఉన్నకేసీఆర్ కి వ్యతిరేఖంగా మాట్లాడుతూ పరోక్షంగా తెరాసకు ఏవిధంగా మేలు చేకూర్చేడో అందరికీ తెలుసు. ఇప్పుడు అదేవిధంగా సీమాంద్రాలో కూడా ప్రజాధారణ ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేఖంగా అవాకులు చవాకులు వాగుతూ ప్రజల దృష్టిలో తాను, తన కాంగ్రెస్ పార్టీని విలన్లుగా మార్చి, జగన్మోహన్ రెడ్డిని హీరో చేసే పనిలోపడ్డారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారంటే, వారు ప్రత్యర్ధులు గనుక అది సహజమేనని ఎవరయినా భావిస్తారు. కానీ ఎన్నికల తరువాత తమ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబోయే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను జైరామ్ రమేష్ వంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నేతే స్వయంగా తిట్టడం, విమర్శించడం కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న అతితెలివికి అద్దం పడుతోంది.

 

సాధారణంగా ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎవరయినా విమర్శిస్తే, అటువంటి వారిపట్ల వ్యతిరేఖత కనబరుస్తూ తమకు నచ్చిన వారివైపు మరింత బలంగా ఆకర్షితులవుతారు. గత ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి విషయంలో ఇది రుజువు అయ్యింది కూడా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా అటువంటి వ్యూహమే అమలు చేస్తోంది. అందుకే, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కూడా పక్కనబెట్టి, చూసి రమ్మంటే కాల్చి వచ్చే జైరామ్ రమేష్ ను ప్రత్యేకంగా పంపింది. ప్రస్తుతం ఆయన తనకు అప్పజెప్పిన పనిలో చాల వరకు సవ్యంగానే పూర్తి చేసారనే చెప్పవచ్చును. కాంగ్రెస్ పన్నిన ఈ పద్మవ్యూహాన్ని ప్రజలు తమ ఓటు అనే వజ్రాయుధంతో చేధించుకొని బయటపడగలరో లేదో త్వరలోనే తేలుతుంది.

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.