ఢిల్లీ ఫలితాలతో జైలు సెంటిమెంట్ హుష్ కాకీ... కేటీఆర్ ఇప్పుడేం చేస్తారో?

Publish Date:Feb 10, 2025

Advertisement

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా రాజకీయ పార్టీల భ్రమలను పటాపంచలు చేసేశాయి. పలువురు నేతల ఆశలను అడియాశలు చేసేశాయి. మరీ ముఖ్యంగా సెంటిమెంటు పండితే చాలు అధికారం గ్యారంటీ అంటూ రాజకీయాలు చేస్తున్న పార్టీలకూ, నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చాయి. 
తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ మధ్య ఎన్నికలలో అధికారం కోల్పోయిన పార్టీలకు గట్టి ఝలక్ ఇచ్చాయి. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయి విపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ.. ఆ రోజు నుంచీ కూడా ఒక సెంటిమెంటును బలంగా నమ్ముకుని మళ్లీ అధికారంలోకి వచ్చేయడానికి విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది.

ఇక గత ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయి కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని వైసీపీ కూడా సెంటిమెంటు పండిస్తే చాలు మళ్లీ అధికారపగ్గాలు మావే అన్న ఆశల పల్లకీలో ఊరేగుతోంది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రెండు పార్టీలకూ కూడా గట్టి ఝలక్ ఇచ్చాయి. జైలు కెళ్లొస్తేనే, సానుభూతి కోసం వెంపర్లాడితేనో జనం ఓట్లు వేయరని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఢంకా బజాయించి మరీ చెప్పాయి. ఇంతకీ తెలుగు రాష్ట్రాలలో  జైలుకి వెళ్లొస్తే ముఖ్యమంత్రి పదవి గ్యారంటీ అన్న సెంటిమెంట్ ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు..

వైసీపీ అధినేత జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఇలా వీరంతా అరెస్ట్‌ అయిన తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు. దీంతో అధికారానికి అరెస్టు ఒక అడ్డదారి అన్న భ్రమల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, పార్టీలూ పడిపోయాయి.  తెలంగాణ విషయానికి వస్తే.. ఎఫ్-1 రేసింగ్ కేసులో దమ్ముంటే తనని అరెస్ట్‌ చేసి జైలుకి పంపాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పదేపదే  చేసిన సవాలు వెనుక ఉన్న కారణం ఇదే.  అంతే కాకుండా ఈ కేసులో తన అరెస్టు ఖాయమనీ, జైలులో యోగా చేసి మరింత ఫిట్ గా తయరై వచ్చి పాదయాత్ర చేస్తాననీ స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. ఇక బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కేటీఆర్‌ని అరెస్ట్‌ చేసి పుణ్యం కట్టుకోండని అధికార కాంగ్రెస్ పార్టీని బతిమలాడుకుంటున్నారా అన్నట్లుగా వ్యవహరించారు.  అయితే జైలు అధికారం సెంటిమెంటుకు రేవంత్ ఏమీ అతీతుడు కాదు కనుక.. కేటీఆర్ అరెస్టు విషయంలో దూకుడుగా వ్యవహరించలేదు. కేటీఆర్ ను అరెస్టు చేయాలన్న తొందర తనకేం లేదని కుండబద్దలు కొట్టేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూ వెనకడుగు వేశారు. కేటీఆర్‌ని అరెస్ట్‌ కోసం పకడ్బందీగా వ్యూహాలు పన్నారనీ ఇహనో ఇప్పుడో  అయన కటకటాల పాలవ్వడం ఖాయన్నట్లుగా  పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అరెస్టు సెంటిమెంట్ గుర్తుకు వచ్చిందో ఏమో కేటీఆర్ అరెస్టు విషయంలో తనకు ఎటువంటి తొందరా లేదని వెనకడుగు వేశారు.  

అయితే కేటీఆర్ కూడా నిన్నమొన్నటి వరకూ కేటీఆర్ ఎలాగైనా సరే అరెస్టవ్వాలన్న ప్రయత్నాలూ చేశారు. ఇక ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత పరిస్థితి మారిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక నుంచి కేటీఆర్ అరెస్టు కోసం అధికార కాంగ్రెస్ పార్టీ, ఆ అరెస్టును తప్పించుకోవడం కోసం కేటీఆర్, బీఆర్ఎస్ లు ప్రయత్నాలు ప్రారంభిస్తాయని సెటైర్లు వేస్తున్నారు. జైలుకి వెళ్లొచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రులు అయిపోరనీ, జైలు కెళ్లడం అన్నది అధికారానికి అడ్డదారి ఎంత మాత్రం కాదనీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేసేశాయని అంటున్నారు.  ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా మద్యం కుంభకోణం కేసులో  జైలుకు వెళ్లి వచ్చారు.  అయినా అధికారం కోల్పోయారు.  దీంతో నిన్న మొన్నటి వరకూ జైలుకెల్లాలని ఉబటాటపడిన కేటీఆర్ ఇప్పుడు జైలు మాటెత్తితేనే ఉలిక్కిపడుతున్నారని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జి ఎస్పీఎస్ఎస్ వర్మ చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా, ఎవరికోసమైతే గత అసెంబ్లీ ఎన్నికలలో సీటు త్యాగం చేశారో.. వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నా, అడుగడుగునా అవమానాల పాలు చేస్తున్నా తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తెలుగుదేశం పట్ల తన విధేయతను చెక్కు చెదరనీయలేదు.
 బిఆర్ ఎస్ కార్యనిర్వాహణాధ్యక్షుడు కెటీఆర్ తో  కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న( చింతపండు నవీన్ కుమార్ )  అసెంబ్లీలో  భేటీ అయ్యారు. తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్  నేతను కలవడం చర్చనీయాంశమైంది. బిసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న బిఆర్ఎస్ నేతలైన కెటీఆర్ , హరీష్ రావులను కోరారు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలం పేరు మార్చనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో యూనివర్సిటీలు, సంస్థలు ఒకే పేరుపై ఉండటం వల్ల పాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయనీ, అందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణ కు సంబంధించిన పేర్లే పట్టాలని నిర్ణయించినట్లు రేవంత్ చెప్పారు.
తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసులపై తిరుమలేశుని దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిథుల లేఖలపై శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించనుంది.
అమెరికాలోని ఫ్లోరిడా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మరణించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకుల పల్లి గ్రామ మాజీ ఎంపీటీసీమోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పవిత్రాదేవి దంపతుల కుమార్తె ప్రగతిరెడ్డి, మనవడు హర్వీన్, కుమార్తె అత్త సునీతలు ఈ ప్రమాదంలో మరణించారు.
ఓయూలో ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై విద్యార్థి లోకం భగ్గు మంది. విద్యా విద్యార్థుల స్వేచ్ఛను కాలరాస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళ‌న‌ల‌ను నిషేదిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ మెడలో మిర్చి దండలు వేసుకుని నిరసనకు దిగారు.
ఇరాన్ లో ఇటీవలె బ్లడ్ రెయిన్ కురిసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు.  స్వచ్చమైన నీరు రంగు రుచి వాసన ఉండదు. ఈ మూడు లేనిదే స్వచ్చమైన నీరు అని  మనవ అభివర్ణిస్తుంటాం.
బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్లీ పట్టు సాధించాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్క్భాన్ని ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు జిల్లాల పర్యటనకు సమాయత్తమౌతున్నారు.
బీజేపీ ఎంపీ, మాజీ మంతరి డీకే అరుఏణ ఇంట్లోకి అగంతకుడు జొరబడటం ఇప్పుడు సంచలనం సృష్టించింది. మామూలుగా ఇళ్లల్లో దొంగలు పడటం, పోలీసులకు ఫిర్యుదు అందగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం మామూలు విషయమే.
కాలు జారితే, వెనక్కి తీసుకోవచ్చును, కానీ, నోరు జారితే వెనక్కి తీసుకోలేము. ఒక్కొక్క సారి, నోరు జారిన నేరానికి, భారీ మూల్యమే చెల్లించుకోవలసివస్తుంది, ఉత్తరాఖండ్’ ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల మంత్రి, ప్రేమ్ చంద్ అగ్రవాల్ విషయంలో అదే జరగింది. అవును. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో,ఆయన,రాష్ట్రమంటే కేవలం’ పహాడీలు’ (గిరిజనులు) మాత్రమే కాదు,అంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆతర్వాత ఆయన, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా చాలా చాలా వివరణ ఇచ్చుకున్నారు. అయినా కొంచెం ఆలస్యంగానే అయినా, రాజీనామా చేయక తప్పలేదు. ఆదివారం (మార్చి 16) ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అమరావతి చుట్టూ భారీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రణాళిక మేరకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే పెద్దదిగా ఉంటుంది. మొత్తం 189.9 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరణకు ఇప్పటికే అధికారుల నియామకం పూర్తయ్యింది.
వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇటీవల తన ప్రాణాలకు ముప్పు ఉంది, భద్రత కల్పించాలని కోరిన సంగతి తెలిసిందే. దస్తగిరి ప్రాణాలకు ముప్పు మాట నిజమేననడానికి తాజాగా ఆయన భార్య షబానాపై జరిగిన దాడి రుజువుగా నిలిచింది. షబానాపై ఆమె నివాసంలోనే దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వారు వైసీపీ మహిళా కార్యకర్తలని ఆమె ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.