జగన్ కి మళ్లీ మూడొచ్చింది. మొన్నటి వరకూ కర్నూలు- అమరావతి- విశాఖ అంటూ మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడిన జగన్ ఇప్పుడు మరో మూడు ముక్కలాటకు తెరతీశారు. అదే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. దీనికే ఆయన సినిమా ఫక్కీలో మావిగన్ అంటూ జగన్ అనే అర్ధమొచ్చేలా పేరు పెట్టారు.
పేరు వరకూ ఓకే... ఇప్పటి వరకూ ఆయన అన్నమాటలను ఒకసారి పరిశీలిస్తే తనకే సంకుచితమైన మనస్తత్వమే ఉంటే అమరావతిని ఎందుకు లెజిస్లేటివ్ క్యాపిటల్ చేస్తాను? అక్కడే స్థలం కొన్ని ఇల్లెందుకు కడతాను? తానే కదా మొదట అమరావతిలో ఇల్లు కట్టుకున్నది అన్నారు. తనకే సంకుచిత మనస్తత్వమే ఉండి ఉంటే, రాయలసీమలోనే రాజధాని కట్టేవాడ్ని కదా? అని కూడా ప్రశ్నించారు. తనకెలాంటి సంకుచిత మనస్తత్వం లేదు కాబట్టే.. తాను విశాఖ రాజధాని కావాలని కోరుకున్నట్టు చెప్పారు మావిగన్ రూపశిల్పి జగన్.
జగన్ తన ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. అందులో మొదటిది.. వాళ్లేవిధంగా అసెంబ్లీలో అమరావతే రాజధాని అని ఒక చట్టం చేశారో.. మాకు అధికారం వస్తే, అదే అసెంబ్లీని వేదికగా చేసుకుని.. ఆ చట్ట సవరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు? అలా ప్రశ్నించడం ద్వారా తానేమిటో.. తన విధానమేమిటో క్లారిటీ ఇచ్చేశారు.
మొన్నటి వరకూ విశాఖ విశాఖ అన్న జగన్.. ఇప్పుడు అమరావతిని కొత్త రాజధాని కారిడార్ లో భాగంగా మచిలిపట్నం, విజయవాడ, గుంటూరును చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు. మరి విశాఖ మీద ఆయనకున్న ప్రేమ ఏమైనట్టు? మరో పక్క బొత్స, ధర్మాన ద్వారా ఈ బిల్లును తిరిగి తాము బ్రేక్ చేయగలమని కూడా చెప్పిస్తున్నారు. అంటే ఎవర్ని ఎవరిపైకి ఎందుకు ఉసిగొల్పుతున్నారు?
దీనంతటిని బట్టీ చూస్తుంటే అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణం జరగడానికి వీల్లేదని జగన్ బలంగా కోరుకుంటున్నారని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. అందుకే మావిగన్ అంటూ పిచ్చి ప్రతిపాదనలు, ప్రేలాపనలు చేస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఈ వైఖరితో జగన్ పార్టీ వచ్చే ఎన్నికలలో 11 నుంచి ఒకటికి పడిపోయినా ఆశ్చర్యంలేదంటున్నారు. నలభై శాతం ఓటు బ్యాంకు అంటున్న జగన్ కు ఆ ఓటు శాతం నాలుగుకు పడిపోయేదాకా నిద్రపట్టదా ఏంటని ఎద్దేవా చేస్తున్నారు నెటిజనులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagans-weapon-against-chandrababu-is-mavigan-36-216533.html
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే మళ్లీ ముంపు తప్పదా అన్న భయం మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది. గత వరదల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఏడేళ్లుగా తనకు ఇస్తున్న హామీలను నిర్వాహకులు నెరవేర్చడంలేదన్నారు. చెప్పిన సమయానికి విగ్రహ ప్రతిష్టాపన ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. తన ఆగ్రహానికి గురికాకముందే ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చాలని హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నప్పటికీ.. మాట తప్పడం సరికాదన్నారు.
భారత వాతావరణ శాఖ శాస్త్రీయ అధ్యయనాల అనంతరం ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని చెబుతుంటే.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో భవిష్యవాణి రంగం మాత్రం కుండపోత వర్షాలు, భారీ వరదల ముప్పు ఉందని హెచ్చరిస్తోంది.
మొత్తంగా మోడీ పర్యటనలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం ప్రధాన అంశం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఆగస్టు మూడో వారం నుంచే భోగాపురం విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
భోగాపురం నుంచి నేరుగా అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆకర్షించేందుకు బలమైన పునాది ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ను ఉత్తరాంధ్ర ప్రగతికి గేట్వేగా అభివర్ణించారు. ఇప్పుడు ఇక తదుపరి టార్గెట్ గా అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇక్కడ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపడమే కావాలని ఆంధ్రులు కోరుతున్నారు.
నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి ప్రజాస్వామ్య నిరసన హక్కును గౌరవిస్తూ ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ట విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది
బోనం కింద పడటంతో జోగిని శ్యామలతో పాటు పలువురు జోగినులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. జాతర సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు వచ్చిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పలాంటిర్ టెక్నాలజీస్ మరియు అర్మాడా సంయుక్తంగా షిప్పింగ్ కంటైనర్లలో ఎన్విడియా B300 AI యాక్సిలరేటర్లతో పనిచేసే మొబైల్ వార్ డేటా సెంటర్లను ఆవిష్కరించాయి. ఇంటర్నెట్ మరియు క్లౌడ్ కనెక్షన్ లేకపోయినా యుద్ధ రంగంలోనే స్వతంత్రంగా పనిచేసే ఈ వినూత్న టెక్నాలజీ విశేషాలు చూడండి.
సోనీ సంస్థ తన 10 ఏళ్ల మైలురాయిగా విడుదల చేసిన అత్యంత విలాసవంతమైన 1000X కలెక్షన్ వైర్లెస్ హెడ్ఫోన్స్పై మొదటిసారి 15 శాతం పరిమిత కాలపు డిస్కౌంట్ను ప్రకటించింది. DSEE ఆల్టిమేట్ టెక్నాలజీ, 12 మైక్రోఫోన్ల నోయిస్ క్యాన్సిలేషన్ మరియు 24 గంటల బ్యాటరీ లైఫ్ ఉన్న ఈ ప్రీమియం ఆడియో డివైజ్ పూర్తి వివరాలు మరియు ఆఫర్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ లిమిటెడ్ ఐపిఓ ప్రైస్ బ్యాండ్ రూ. 200 212 గా నిర్ణయించబడింది. ఆగస్టు 7 నుండి 11 వరకు సబ్స్క్రిప్షన్ కి అందుబాటులో ఉండే ఈ ఐపిఓ పూర్తి వివరాలు, లాట్ సైజ్ మరియు లిస్టింగ్ తేదీలను ఇక్కడ తెలుసుకోండి.
8వ వేతన సంఘం 8th Pay Commission వార్షిక ఇంక్రిమెంట్ ప్రతిపాదనలపై కీలక వివరాలు. 3%, 5%, మరియు 6% ఇంక్రిమెంట్ల ఆధారంగా లెవెల్ 1, 2, 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 5 ఏళ్లలో ఎలా పెరుగుతుందో సమగ్రంగా తెలుసుకోండి.
మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా పౌరులందరికీ సమానమైన చట్టాలు అమలులో ఉన్నాయన్న తస్లీమా.. ఇండియాలో మాత్రం మహిళలు ఇప్పటికీ చట్టపరంగా, సామాజికంగా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.