పెట్టుబడిదారులను తరిమేసేందుకే జగన్ మావిగన్!

Publish Date:Apr 13, 2026

Advertisement

ప్రస్తతుం ఆంధ్రప్రదేశ్ లో జగన్ మావిగన్ పై ఎడతెగని చర్చ జరుగుతోంది. వైసీపీయూలు మావిగన్ ను ఆంధ్రప్రదేశ్ ను సకల కష్టాల నుంచీ తొలగించే సంజీవనిలా, సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ లా అభివర్ణిస్తుంటే.. తెలుగుదేశం కూటమి పార్టీలే కాకుండా, మేధావులూ, సామాన్య జనం కూడా మావిగన్ ప్రతిపాదన చేసిన  జగన్ ను ఓ జోకర్ గా అభివర్ణిస్తున్నారు. అదే తీరుగా నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్  ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం జగన్ మావిగన్ ప్రతిపాదన ఆషామాషీగా చేయలేదని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రతిపాదన వెనుక భారీ కుట్ర దాగుందని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మావిగన్’  వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందంటున్నారాయన. ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు.  విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.   జగన్  మావిగన్  వ్యూహం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి ఉద్దేశించినదేనని విశ్లేషించారు.

ముఖ్యంగా పెట్టబడి దారులను బెదరించి వెనక్కు పంపడం కోసమే ఆయన మావిగన్ ప్రతిపాదన చేశారన్న ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి వస్తున్న పెట్టుబ డిదారులను భయభ్రాంతులకు గురిచేయడమే జగన్ లక్ష్యం అన్నారు. రాజధానిపై జగన్ తన వ్యతిరేకతను ఈ విధంగా వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగకుండా అడ్డుకట్ట వేయాలన్న కుట్ర చేస్తున్నారన్నారు. 

సపోజ్ ఫర్ సపోజ్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి దారుణంగా మారుతుందని ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, వేసిన రోడ్లను తవ్వేయడం, కేబుళ్లు,  పైపులను తరలించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని  ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా అమరావతిని గ్రాఫిక్స్ అని, స్మశానమని అభివర్ణించి పెట్టుబడిదారులు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడూ అదే చేస్తున్నారన్నారు.  

కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి విషయంలో పూర్తిస్థాయి నిబద్ధతతో లేదని విమర్శించిన ఏబీవీ.. ఢిల్లీ పాలకులు కేవలం తమ రాజకీయ అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, రైతుల త్యాగాలకు తగిన న్యాయం జరగడం లేదనీ చెప్పారు.   సీఆర్డీఏ  చట్టం ఉండటం వల్లనే ఇప్పటివరకు అమరావతి కొంతైనా నిలబడిందని చెప్పిన ఏబీవీ..  ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం రాజధాని పనులను 2028 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న నేపథ్యంలో, ఆ దిశగా వేగంగా అడుగులు వేయాలని కోరారు. అమరావతి కేవలం నగరం కాదనీ,  వేలాది మంది రైతుల నమ్మకమని అన్నారు.  

By
en-us Political News

  
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.