Publish Date:May 18, 2023
సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్ అన్నారు గురజాడ. అయితే మన ఏపీ ముఖ్యమంత్రి మాత్రం సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగినా పట్టించుకోవడం లేదు. సొంత ప్రయోజనాల కోసం అంటూ ప్రజలను నమ్మింది.. ప్రజాధనాన్ని ఇష్టా రాజ్యంగా ఖర్చు చేసేస్తున్నారు. తాజాగా రాష్ట్ర శ్రేయస్సు కోసం అంటూ ఏపీ సీఎం జగన్ చేపట్టిన రాజశ్యామల యాగం కోసం ప్రజాధనం పది కోట్లు ఖర్చు చేశారు. వాస్తవంగా ఈ యాగ నిర్వహణకు మహా అయితే పది లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అలాంటిది జగన్ సర్కార్ పది కోట్లు ఖర్చు చేసేసింది. తీరా చూస్తే ఆ యాగం లక్ష్యం ఉద్దేశం అంతా రాష్ట్ర శ్రేయస్సు కాదు. మరేమిటంటారా జగన్ కోసం. తన మీద ఉన్న కోర్టు కేసుల నుంచి బయటపడాలనీ, శత్రు భయం పోవాలనీ, వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలనీ..మాత్రమే. యాగ సంకల్పం కూడా అదే. తన మత విశ్వాసానికి యాగాలు చేయడం విరుద్ధం అయినా సొంత లాభం కోసం ప్రజా ధనాన్ని కర్చు పెట్టి మరీ యాగం చేశారు జగన్. ఆ యాగ సంకల్పం ఏమిటో మీరే వినండి..
మమ
సమస్త శతృూణ, ధూర్తహ ఫలాయన సిద్ధి ద్వారా
సర్వత్రా న్యాస్థానేషు
సర్వత్ర వ్యవహారేషు
సర్వత్రా సానుకూల్యత సిద్ధి ద్వారా
సమస్త మంగళ వాక్యర్థం, శ్రీ రాజశ్యామల
మాతంగేశ్వర దేవత అనుగ్రహ సిద్ద్యర్థం
శ్రీ చండీ పరాంబిక సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం
శ్రీ చండీ పరాంబిక పంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం
శ్రీ సుదర్శన సహిత మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్ధం
మదీయ సర్వత్రా పురుషార్దేషు
యేయే ప్రతికూల కారణాహ ద్వేషాం ప్రాతికేల్యత కార
సానుకూలపర్యర్వేనా పరాయంత్ర, పరమంత్ర పరకీయ, సర్వదృష్ట గృహ సర్వా
మమ నిర్యుర్తిపూర్వక స్వకృత్య బలవృద్ధి అర్ధం
చండీ, రుద్రపూర్వక రాజశ్యామల మంత్ర దేవతా
సుదర్శన స్వరూపి సహిత శ్రీ మహా విష్ణు సహిత
శ్రీ మహా లక్ష్మి మహాయాగ అక్ష, కర్మణే, స్వర్ణ
మహాలక్ష్మీ దేవ్యాహ అనుగ్రహ ప్రసాదేనా అవాహనాది షోడచ ఉపచార పూజం కరిష్యే
ఇంత స్పష్టంగా తన కోసం తాను సంకల్పం చెప్పుకుని ప్రజాధనంతో యాగం నిర్వహించి రాష్ట్రం కోసమేనని జగన్ ఎంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారో..
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-yagam-with-people-money-39-155537.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.