Publish Date:Sep 12, 2022
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అమీతుమీ తేల్చుకోవడానికి రైతాంగం ఉద్యమబాట చేపట్టారు. అది ఇప్పటికి వెయ్యిరోజులు పూర్తిచేసుకుంది. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ ప్రభు త్వం కావాలనే ఉల్లంఘించి, మూడు రాజధానుల ఆలోచనను తెరమీదకి తెచ్చింది. దీని పై ప్రజలు, రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకీ వెళ్లకుండా ఊరుకున్న జగన్ సర్కార్ హైకోర్టు తీర్పును కాదనడంలో ప్రజల్ని, రైతాంగానని మోసం చేస్తోందన్న భావన సర్వత్రా ఏర్పడింది. తాజాగా మాజీ న్యాయమూర్తి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా జగన్ సర్కార్ తిక్క ఆలోచనలు, వ్యవ హారశైలికి విసిగెత్తి జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
మూడు రాజధానులపై చట్టం చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ ఆ తీర్పును ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి జగన్తో పాటు, సంబంధిత మంత్రి ని, సీఎస్లకు జైలు శిక్ష విధించాలని విశ్రాంత న్యాయమూర్తి వి.గోపాల గౌడ అన్నారు. తానే గనుక ఆ కేసును విచారిస్తుంటే సీఎం జగన్ను జైలుకు పంపేవాడినని గోపాల గౌడ అన్నారు.
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అమరావతే ఏపీ రాజధాని అని, ఈ విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం తప్ప ఏపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం లేదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం అన్నారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్ర యించలేదు గనుక హైకోర్టు తీర్పే శిరోధార్యమవుతుందన్నారు. మూడు రాజధానులని సీఎం, మంత్రులు అంటున్నారు గాని దానికి చట్ట బద్ధత ఉండదని సుబ్రహ్మణ్యం అన్నారు.
రాజధాని నిర్మాణానికి భూసమీకరణ నుంచీ ప్రణాళిక రూప కల్ప న వరకూ సుబ్రహ్మణ్యం పరిశీలించారు. అలాంటి సుబ్రహ్మణ్యం జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం గమనార్హం. ప్రభుత్వ వాదన లన్నీ విన్న తర్వాతే కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు అర్ధంకాదని అనడం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించ లేదనే అర్ధాన్ని సూచిస్తుందన్నారు. సీఎం, మంత్రులు తాము చెప్పిందే అమలు చేస్తామనడం హేయ మన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-would-be-jailed-says-former-justice-gopalagoda-25-143593.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.